ఐటీ నగరానికి అనుసంధానం అయి ఉన్న చివరి మెట్రో స్టేషన్ రాయదుర్గం నుంచి వివిధ ఐటీ కంపెనీలకు కలుపుతూ నిర్మించిన స్కై వాక్ ఆకట్టుకుంటోంది.
రాయదుర్గం మెట్రోస్టేషన్, రహేజా మైండ్స్పేస్ ఐటీ కారిడార్ను కలుపుతూ కిలో మీటరు పొడవున ఈ స్కైవాక్ నిర్మించారు.
మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ ఈ స్కై వాక్ను రూపకల్పన చేసింది.
సోమవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ స్కైవాక్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కిలో మీటరు పొడవు, 3.5 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించారని అన్నారు.
రోజుకు 30 వేల మంది దీనిపై ప్రయాణించగలరని అన్నారు.
మైండ్ స్పేస్ ఐటీ కారిడార్ను కలుపుతూ స్కైవాక్ వృత్తాకారంలో ఆకర్షణీయంగా ఉందని తెలిపారు.
స్కై వాక్కు 6 స్టెయిర్ కేస్లు, 5 ఎస్కలేటర్లు, 4 లిఫ్టులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
దివ్యాంగులు కూడా అత్యంత సులభంగా దీనిపై ప్రయాణించేందుకు వీలుగా నిర్మించారని అన్నారు.
మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ సీఈవో వినోద్ రోహిరా కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్కై వాక్ల మధ్యలో ఇంటర్ సెక్షన్లో వింటేజ్ కేఫ్ అందుబాటులో ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.
Ramadan 2022 Photos: హైదరాబాద్లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
In Pics : తెలంగాణ ప్రభుత్వ ఇఫ్తార్ విందు, పాల్గొన్న సీఎం కేసీఆర్
TRS Plenary Photos: గులాబీ రంగు అద్దుకున్న హైదరాబాద్- ప్లీనరీతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం
In Pics: 3 టిమ్స్ ఆస్పత్రులకు కేసీఆర్ శంకుస్థాపన - భవన ఆకృతుల ఫోటోలు ఇవీ
In Pics: బండి సంజయ్కు అస్వస్థత, పాదయాత్రలోనే వైద్య పరీక్షలు - ఫోటోలు
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
TRS Rajyasabha Candidates: ఖమ్మంపై సీఎం కేసీఆర్ కన్ను - రెండు రాజ్యసభ స్థానాలు లాభం చేకూర్చేనా ?