అన్వేషించండి
In Pics: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, చూసి తరించండి

శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
1/7

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షికవసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి.
2/7

మొదటిరోజు మధ్యాహ్నం శుక్రవారపు తోటలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. మే 16న ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.
3/7

వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి.
4/7

లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయి.
5/7

వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
6/7

2.30 నుండి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి.
7/7

రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.
Published at : 15 May 2022 08:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
హైదరాబాద్
సినిమా
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion