అన్వేషించండి

Uttarakhand Tunnel Rescue Updates: సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో ఇండియన్ ఆర్మీ, మాన్యువల్ డ్రిల్లింగ్‌కి సహకారం

Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో ఇండియన్ ఆర్మీ మాన్యువల్ డ్రిల్లింగ్‌కి సహకారం అందించనుంది.

Uttarakhand Tunnel Rescue Updates:

ఇండియన్ ఆర్మీ సహకారం..

ఉత్తరాఖండ్ సొరంగంలో (Uttarakhand Tunnel Collapse) చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఇంకా సమయం పట్టేలా ఉంది. అమెరికా నుంచి Augur Machine తెప్పించి డ్రిల్లింగ్‌ చేసినా అది సక్సెస్ కాలేదు. మెషీన్ బ్లేడ్‌లు విరిగిపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ ఆగిపోయింది. మరో సారి వర్టికల్ డ్రిల్లింగ్‌ చేపడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ కోసం ఇప్పటికే పలువురు నిపుణులు వచ్చారు. వీళ్లతో పాటు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా ఇందులో పాల్గొంటోంది. దాదాపు రెండు వారాలుగా సహాయక చర్యలు (Silkyara Tunnel Rescue) కొనసాగుతున్నప్పటికీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. వర్టికల్ డ్రిల్లింగ్‌తో పాటు మాన్యువల్ డ్రిల్లింగ్‌నీ చేపడుతున్నారు. ఈ మాన్యువల్ డ్రిల్లింగ్‌కి ఇండియన్ ఆర్మీ (Indian Army Manual Drilling) సహకారం అందిస్తోంది. డ్రిల్లింగ్ చేస్తుండగా ఆగర్ మెషీన్ బ్లేడ్‌లు ఆ శిథిలాల్లో చిక్కుకున్నాయి. ఇప్పుడా బ్లేడ్స్‌ని ఒక్కొక్కటిగా తొలగిస్తోంది రెస్క్యూ సిబ్బంది. మరో 10-15 మీటర్ల వరకూ డ్రిల్లింగ్ చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం హ్యాండ్ టూల్స్‌ని వినియోగిస్తున్నారు. మాన్యువల్ డ్రిల్లింగ్‌లో భాగంగా ఇప్పటికే ఉన్న రెస్క్యూ పాసేజ్‌లోకి ఓ వ్యక్తి వెళ్తాడు. కొంత వరకూ మాన్యువల్ డ్రిల్లింగ్ చేస్తాడు. ఆ తరవాత మరొకరు లోపలికి వెళ్తారు. ఇలా వంతుల వారీగా డ్రిల్లింగ్ చేపట్టనున్నారు. ఇదంతా ఇండియన్ ఆర్మీనే చేయనుంది. 

360 గంటలుగా సొరంగంలోనే..

భారత సైన్యానికి చెందిన ఇంజనీర్ గ్రూప్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం అందిస్తోంది. ఇప్పటికి కార్మికులు సొరంగంలో చిక్కుకుని 360 గంటలు. అయితే...వీళ్లను బయటకు తీసుకురావడానికి మరి కొన్ని వారాల సమయం పట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతానిక కార్మికులంతా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఎండోస్కోపిక్ కెమెరా పైప్‌ ద్వారా పంపించి కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడిస్తున్నారు. వాళ్లు ధైర్యం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటన్నారు. పైప్‌ ద్వారానే ఆక్సిజన్, ఆహారం అందిస్తున్నారు. కొండప్రాంతం కావడం వల్ల ఎప్పుడు ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయో చెప్పలేమని అంటున్నారు నిపుణులు. అందుకే కచ్చితంగా ఇన్ని రోజుల్లోగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తైపోతుందని చెప్పలేకపోతున్నారు. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ (Arnold Dix) ఘటనా స్థలంలోనే ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లని బయటకు తీసుకొచ్చేందుకు మరో నెల రోజుల సమయం పడుతుండొచ్చని అంచనా వేశారు. ఎప్పటికి ఇది పూర్తవుతుందో చెప్పలేమని, గరిష్ఠంగా ఎన్ని రోజులు పడుతుందనేది మాత్రమే తాను చెబుతున్నానని వివరించారు. ఈ డ్రిల్లింగ్‌ కోసం కనీసం 20 మంది సిబ్బంది పని చేయనున్నారు.

Also Read: Kerala Stampade: కొచ్చి వర్సిటీలో తొక్కిసలాటకు కారణాలివే, కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case against Aare Shyamala: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
CM Revanth Reddy: ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
Deputy CM Pawan Kalyan: తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
Allu Sirish Nayanika : ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
Advertisement

వీడియోలు

Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case against Aare Shyamala: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
CM Revanth Reddy: ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
Deputy CM Pawan Kalyan: తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
Allu Sirish Nayanika : ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
ICC Women's World Cup 2025: జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి కారణం అదే! మానసికంగా కుంగదీస్తున్న వివాదాలకు బ్యాట్‌తో సమాధానం!
జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి కారణం అదే! మానసికంగా కుంగదీస్తున్న వివాదాలకు బ్యాట్‌తో సమాధానం!
Second Hand Car Buying Tips పాత కారు కొనే ముందు ఈ 3 విషయాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!
పాత కారు కొనే ముందు ఈ 3 విషయాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!
No Nut November : నవంబర్ స్పెషల్ NNN... అబ్బాయిలు ఇది ఫాలో అయితే కలిగే లాభాలేంటి? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
నవంబర్ స్పెషల్ NNN... అబ్బాయిలు ఇది ఫాలో అయితే కలిగే లాభాలేంటి? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
Salman Khan Revanth Reddy: హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
Embed widget