అన్వేషించండి

CM KCR : దేశంలో ఇన్ని జీవనదులున్నా తాగేందుకు నీళ్లుండవా?, ఈ పాపానికి బాధ్యులెవరు? - సీఎం కేసీఆర్

CM KCR : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా...ప్రజల పరిస్థితులు మారలేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.

CM KCR : దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడంలేదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్అన్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారని, పేదవాళ్లు మరింత పేదవాళ్లు అవుతున్నారని ఆవేదన చెందారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ జబిందా గ్రౌండ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పలువు మరాఠా నేతలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఇన్ని జీవనదులు ఉన్నా తాగు, సాగు నీరు సమస్య ఎందుకు వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. నీరు అందించని పాపం ఎవరిదని మండిపడ్డారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.  

పేదలు మరింత పేదలు 

మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిందని కేసీఆర్ తలచుకున్నారు. తన మాటలు ఇక్కడ విని ఇక్కడే మరిచిపోకుండా... గ్రామాలకు వెళ్లి చర్చించాలన్నారు. దేశంలో ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించాలని కోరారు. దేశం కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. శంభాజీనగర్‌లో వారానికోసారి నీళ్లు వస్తాయా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో ధనవంతులు మరింత ధనవంతులు,  పేదలు మరింత పేదలుగా మారుతున్నారన్నారు. మన కళ్లముందే ఇదంతా జరుగుతుంటే ఈ వ్యాధికి చికిత్స చేయాలా? వద్దా అని ప్రశ్నించారు. ప్రజలు ఎంత త్వరగా మేలుకుంటే అంత త్వరగా బాగుపడుతామన్నారు.  

ఆర్థిక రాజధానిలో తాగునీటి సమస్య 

తెలంగాణలో సమస్యలు లేకుండా చేశామని కేసీఆర్ తెలిపారు. భయపడితే ఇంకా భయపెట్టిస్తారని, ధైర్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదన్నారు. మార్పును తీసుకురావడం కోసమే బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందన్నారు. మార్పు వచ్చే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందన్నారు. దేశ భవిష్యత్‌ ప్రజల మీదే ఆధారపడి ఉందన్నారు.  గోదావరి, కృష్ణా వంటి జీవ నదులున్నా.. మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకు వస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబయిలో తాగేందుకు నీళ్లుండవన్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే దేశం పురోగమిస్తోందా? తిరోగమిస్తోందా? అర్థంకావడంలేదన్నారు. ఔరంగాబాద్‌, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు.  

మహారాష్ట్రలో ఐదేళ్లలో ప్రతి ఇంటికీ నీరు 

 దేశంలో తాగేందుకు నీరు లేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. పెద్ద పెద్ద మాటలు చెబుతున్న నేతలు... తాగునీరు అందించలేకపోతున్నారన్నారు. దేశంలో యువతకు ఉద్యోగాల్లేవన్నారు. జనాభాకు కావాల్సిన దానికంటే రెట్టింపు నీరు ఉన్నా సద్వినియోగం చేసుకోవడంలేదన్నారు. సాగు యోగత్య ఉన్న భూములకు నీరు అందించాల్సి ఉంద్నారు. అయితే ప్రధాని, రాష్ట్రాల సీఎంలకు ఆ పని చేసే సామర్థ్యాలు లేవని విమర్శించారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ తాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో ఐదేళ్లలో ప్రతి ఇంటికీ నీరు అందిస్తామన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ పోరాటం ఆగదన్నారు. ఒక కులం, మతం, వర్గం కోసం బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించలేదన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget