అన్వేషించండి

Fact Check: బెంగళూరులో EVM బ్యాలెట్ బటన్ పని చేయలేదా? అసలు వాస్తవం ఇదే

Fact Check: బెంగళూరులో ఓ పోలింగ్‌బూత్‌లో ఈవీఎమ్‌ బ్యాలెట్ బటన్ పని చేయలేదంటూ వైరల్ అయిన ఆడియో క్లిప్‌లో నిజం లేదని ఈసీ స్పష్టం చేసింది.

Fact Check: వాట్సాప్‌లో ఓ ఆడియో క్లిప్ విపరీతంగా షేర్ అవుతోంది. రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరులో ఓ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎమ్‌ బ్యాలెట్ బటన్ పని చేయలేదన్నది ఆ ఆడియో సారాంశం. ఇది నిజమా కాదా అని వెరిఫై చేయకుండానే చాలా మంది వాట్సాప్‌లో అందరికీ ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఇది కాస్తా ఎన్నికల సంఘం దృష్టి వరకూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమై ఫ్యాక్ట్‌చేయగా అదంతా అవాస్తవం అని తేలింది. బెంగళూరులోని శాంతినగర్‌లో బూత్‌ నంబర్ -17లో ఈవీఎమ్‌ బ్యాలెట్ బటన్ యాక్టివేట్ కాలేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు అధికారులు. 

క్లెయిమ్ (ప్రచారం): 

ఈ ఆడియో క్లిప్‌లో ఓ వ్యక్తి బెంగళూరులోని శాంతినగర్‌లో పోలింగ్ బూత్ నంబర్ 17లో EVM బ్యాలెట్ బట్ పని చేయాలని చెప్పాడు. అందులో ఇంకా ఏముందంటే..

"నేను ఓటర్ స్లిప్ ఇచ్చి ఓటు వేసేందుకు లోపలికి వెళ్లాను. ఈవీఎమ్‌పై బటన్ నొక్కాను. కానీ ఎలాంటి శబ్దమూ రాలేదు. అటు వీవీప్యాట్‌లోనూ నేను ఓటు వేసిన అభ్యర్థి ఫొటో కనిపించలేదు. ఓ 10-15 సెకన్ల తరవాత మరోసారి బటన్ నొక్కాను. అప్పుడు కూడా వీవీప్యాట్ మెషీన్‌లో ఎలాంటి సౌండ్ రాలేదు. నాకు చాలా కోపం వచ్చి అక్కడి సిబ్బందిని అడిగాను. సౌండ్ ఎందుకు రావడం లేదని నిలదీశాను. నేను మరీ అంత పిచ్చోడిగా కనిపిస్తున్నానా అని మండిపడ్డాను. కంట్రోల్ ప్యానెల్‌లో బటన్ నొక్కాల్సిన వ్యక్తి ఆ పని చేయలేదని అర్థమైంది. అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. మీరు ఓటు వేసే ముందు కంట్రోల్ ప్యానెల్‌లో బటన్ నొక్కారా లేదా అని సరి చూసుకోండి. అతను అక్కడ బటన్ నొక్కిన తరవాత EVMపై గ్రీన్‌ లైట్‌ ఆన్ అవుతుంది. ఆ తరవాత మనం బటన్ నొక్కితే ఓటు నమోదవుతుంది. మీరు ఓటు వేసే సమయంలో ఈవీఎమ్‌పై గ్రీన్ లైట్ లేకపోతే అక్కడి సిబ్బందిని నిలదీయండి"

నిజమేంటి..?

ఈ ఆడియో క్లిప్‌ నిజమా కాదా అని Newschecker టీమ్‌ ఫ్యాక్ట్‌చెక్ చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం అలాటిదేదీ జరగలేదని తేల్చి చెప్పినట్టు ఫ్యాక్ట్‌చెక్‌లో వెల్లడైంది. బెంగళూరులో ఇలా జరిగిందంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేసింది. బెంగళూరు జిల్లా ఎన్నికల అధికారి కూడా ఇదే విషయం చెప్పారు. X వేదికగా పోస్ట్‌లు పెట్టారు. ఏప్రిల్ 26వ తేదీన దీనిపై క్లారిటీ ఇస్తూ Xలో ఈ పోస్ట్‌లు షేర్ చేశారు. మొత్తంగా చూస్తే బెంగళూరులో EVM బటన్ యాక్టివ్ కాలేదని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం కాదని తేలింది. 
 

This story was originally published by newschecker.in, as part of the Shakti Collective. This story has been translated by ABPDesam staff. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Embed widget