అన్వేషించండి

దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!

మరోవైపు ఢిల్లీ, లక్ష్వదీప్‌లలోని పాఠశాలలు 100% కంప్యూటర్ సౌకర్యాలతో పని చేస్తున్నాయని, వీటిలో 97.4% పాఠశాలలు ఇంటర్నెట్ యాక్సెస్‌తో ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

భారతదేశంలో దాదాపు 66% పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. బీహార్, మిజోరాం రాష్ట్రాలు ఈ కోవలో మొదటి రెండు స్థానాల్లో నిలుస్తున్నాయి. బీహార్‌లో 92%, మిజోరంలో 90% పాఠశాలల్లోని విద్యార్థులు ఇంటర్నెట్ మాటే ఎరుగరు. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్, మధ్యప్రదేశ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఒడిశా, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాల్లో 80-85% పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) నివేదిక 2021–22 ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక పాఠశాల విద్యకు సంబంధించిన డేటాను క్రోడీకరించడానికి విద్యా మంత్రిత్వ శాఖ తోడ్పాటునిచ్చింది.

ఢిల్లీ దూకుడు - గుజరాత్‌కు సాటిలేదు..
ఇదిలా ఉండగా.. మరోవైపు ఢిల్లీ, లక్ష్వదీప్‌లలోని పాఠశాలలు 100% కంప్యూటర్ సౌకర్యాలతో పని చేస్తున్నాయని, వీటిలో 97.4% పాఠశాలలు ఇంటర్నెట్ యాక్సెస్‌తో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 100% పాఠశాలలు ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ఢిల్లీ. ఆ తర్వాతి స్థానాల్లో చండీగఢ్ (98.7%), పుదుచ్చేరి (98.4%) కేంద్రపాలిత ప్రాంతాలు నిలిచాయి. ఇక రాష్ట్రాల విషయానికొస్తే 94.6 శాతంతో కేరళ, 92 శాతంతో గుజరాత్ ఇంటర్నెట్ సదుపాయాలు అత్యుత్తమ పనితీరు గల రాష్ట్రాలుగా నిలిచాయి. దేశంలో ప్రైవేట్ పాఠశాలల కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఏకైక రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. గుజరాత్‌లో 94.2 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయాలు ఉండగా, ప్రైవేట్ స్కూళ్లలో 89.6 శాతం సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి.

సర్వే ప్రకారం గుజరాత్‌లో మినహాయించి మొత్తంగా.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య అంతరం కొనసాగుతోంది. సర్వేలో 59.6% ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయాలు ఉండగా.. ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లో 53.1 శాతం ఇంటర్నెట్ సదుపాయాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 24.2% మాత్రమే సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్‌లో బెంగాల్ అదరహో..
సర్వే చేయబడిన పాఠశాలల్లో 50% కంటే తక్కువ పాఠశాలల్లో కంప్యూటర్‌లు పనిచేస్తున్నాయి. ఆన్‌లైన్ తరగతుల కోసం కేవలం 20% మాత్రమే మొబైల్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇక స్మార్ట్ తరగతుల లభ్యత కూడా చాలా తక్కువగానే ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. దేశంలోని 1.4 మిలియన్ల పాఠశాలల్లో 2,22,155 మాత్రమే డిజిటల్ లేదా స్మార్ట్ బోర్డులతో స్మార్ట్ తరగతులు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో 99.99 % పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఉండటం విశేషం. పంజాబ్, హర్యానా, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా స్మార్ట్ తరగతులు ఉన్నాయి. మరోవైపు, తమిళనాడులో ఒక్కటంటే ఒక్క స్మార్ట్ క్లాస్ రూమ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక మిజోరంలో ఉన్న 3911 పాఠశాలల్లో, కేవలం 25 పాఠశాలలు మాత్రమే స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను కలిగి ఉన్నాయి.

గత నివేదికల కంటే మెరుగ్గానే..

అయితే, గత నివేదికలతో పోల్చితే.. మొత్తంగా పెరుగుదల మాత్రం కనిపిస్తోంది. గత నాలుగేళ్లలో భారతదేశంలోని మొత్తం పాఠశాలల సంఖ్య 2018-19లో 15,51,000 నుండి 2021–22లో 1,48,9,115కి తగ్గినప్పటికీ, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న పాఠశాలల సంఖ్య 2018–19లో 2,90,447 (18.3) నుంచి 2021–22లో 5,04,989(33.9%)కి చేరింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget