అన్వేషించండి

Toxic soil Crisis: భారీ లోహాలతో పెరుగుతున్న భూ కాలుష్యం, ప్రమాదంలో 140 కోట్ల మంది- తాజా అధ్యయనం

Agriculture Land Pollution | భారీ లోహాలతో భూ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోందని, ప్రస్తుతం 140 కోట్ల మంది ప్రజలు ప్రమాదంలో ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది.

Soil Crisis across the World | ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు విషపూరిత భారీ లోహాల కారణంగా కలుషితమైన, భూమి ప్రమాదకరంగా మారిన ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని భూమి కోబాల్ట్, క్రోమియం, ఆర్సెనిక్, కాడ్మియం, రాగి, నికెల్, సీసం వంటి విషపూరిత భారీ లోహాలతో భారీగా కలుషితమైందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2050 నాటికి 90 శాతం భూమి ప్రమాదకర లోహాలతో కలుషితమయ్యే అవకాశం ఉందని రీసెర్చర్లు చెబుతున్నారు.

14 నుంచి 17 శాతం కాలుష్యం

డెయి హౌ ఆయన సహచరుల నేతృత్వంలోని బృందం ప్రపంచ కాలుష్య నమూనాలపై అధ్యయనం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,493 ప్రాంతాల నుంచి అత్యాధునిక మెషీన్ల ద్వారా దాదాపు 8,00,000 నేల నమూనాలను సేకరించి విశ్లేషించింది. ప్రపంచంలోని సాగుచేసే భూములలో 14 నుంచి 17 శాతం అంటే సుమారు 242 మిలియన్ హెక్టార్లు సాగుభూమి మానవ ఆరోగ్య పరిమితులను మించి కనీసం ఒక లోహంతో కలుషితమైంది. ఒకటికి మించి ఎక్కువ లోహాలు సైతం ఉండొచ్చునని అధ్యయనం అంచనా వేసింది.

ఈ కాలుష్యం కారణంగా పంట దిగుబడి తగ్గుతుంది. విషపూరిత లోహాలను ఆహార పదార్ధాల త్వారా తీసుకుంటున్నాం. మరోవైపు మన ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి భారీగా ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  యురేషియా అంతటా భూమి లోహాల వల్ల కలుషితం అవుతోంది. ఈ ప్రమాదకర జోన్ లోహాలు అగ్నిపర్వతాలు, ఇతర సహజ భౌగోళిక కారకాల కారణంగా, మైనింగ్, పారిశ్రామికీకరణ, నీటిపారుదల పద్ధతులలో లోపాలతో సమస్యగా మారుతున్నాయి. లోహాలు వాతావరణంలో కీలకపాత్ర పోషిస్తాయి. 

విష పూరిత లోహాలతో జాగ్రత్త
కాడ్మియం కారణంగా ముఖ్యంగా దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మూత్రపిండాల సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. కొన్ని రకాల క్యాన్సర్ లాంటి తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతుంది. నికెల్, క్రోమియం, ఆర్సెనిక్, కోబాల్ట్ వంటి లోహాలు కూడా సురక్షితమైన స్థాయిలను మించిపోతాయి. ఈ విషపూరిత లోహాలు దశాబ్దాలుగా నేలలో ఉండగలవు. దాంతో ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేహించి తీవ్ర అనారోగ్యం, వ్యాధులకు కారకాలుగా మారుతున్నాయి. నాడీ సంబంధిత లోపాలు సైతం తలెత్తుతాయి.

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా, వాటి కోసం చేస్తున్న ప్రయత్నాలతో లోహాల కలయికతో భూసారం దెబ్బతింటోంది. తక్షణం చర్యలు  తీసుకోకపోతే నేల కాలుష్యం పెరిగిపోతోంది. పర్యావరణ నిబంధనలు, నేల పర్యవేక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, ప్రజలకు అవగాహన కల్పించడం మంచిదని నిపుణులు సూచించారు. ఇకనుంచి ప్రజలు సైతం బాధ్యతగా నడుచుకోవాలని, పారిశ్రామికీకరణ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయకూడదని చెబుతున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget