అన్వేషించండి

AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే

AP Mega DSC 2025 Application | ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి ఆన్‌లైన్‌లోనే మే 15వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు.

AP DSC Notification released for 16347 Teaching Posts | అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదివారం నాడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు, ఫీజు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని అభ్యర్థులకు సూచించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు మంత్రి లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శనివారం ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. ఓర్పు, పట్టుదల, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయుల నియామకం కీలక అంశమని లోకేష్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం మెగా డీఎస్సీ సంబంధించిన జీవో, టీచర్ పోస్ట్ల వివరాలు, ఎగ్జామ్ షెడ్యూలు, సిలబస్ ఇలాంటి పూర్తి వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://apdsc.apcfss.in/# ను సందర్శించాలని సూచించారు.  

డీఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్స్ ఇవే

👉 https://cse.ap.gov.in
👉 https://apdsc.apcfss.in


ఏపీ మెగా డీఎస్సీ షెడ్యూల్‌
- ఏప్రిల్‌ 20వ తేదీన ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ప్రారంభం
- మే 15  దరఖాస్తుల స్వీకరణకు ముగియనున్న గడువు 
- మే 20వ తేదీ నుంచి మాక్ టెస్టుల నిర్వహణ  
- మే 30 డీఎస్సీ ఎగ్జామ్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం
- జూన్‌ 6 నుంచి జులై 6 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వహణ 

అన్ని పరీక్షలు పూర్తయ్యాక రెండు రోజుల తరువాత ప్రాథమిక ‘కీ’ విడుదల కానుంది. అనంతరం 7 రోజులపాటు అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వారం రోజులకు డీఎస్సీ ఎగ్జామ్స్ ఫైనల్ ‘కీ’ విడుదల చేయనున్నారు. మరో వారం రోజులకు డీఎస్సీ మెరిట్‌ జాబితా విడుదల కానుంది.

మెగా డీఎస్సీ పోస్టుల వివరాలివే..
మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, పురపాలక, జువెనైల్‌ సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులకు జిల్లా స్థాయిలో నియామక ప్రక్రియ ఉంటుంది. ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలలతో పాటు బధిర, అంధుల స్కూల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్‌ స్థాయిల్లో భర్తీ చేస్తారు. 

ఎస్జీటీ పోస్టులు 6,599 ఉండగా, స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు 7,487, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు కలిపి మొత్తం 14,088 పోస్టులున్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులు 259 ఉన్నాయి. జోన్‌-1లో 400 పోస్టులు, జోన్‌-2లో 348 పోస్టులు, జోన్‌-3లో 570, జోన్‌-4లో అత్యధికంగా 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక స్కూళ్లలో మొత్తం 13,192 పోస్టులు ఉన్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881 పోస్టులు, జువెనైల్‌ పాఠశాలల్లో 15 ఖాళీలు, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.


AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించిన ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించిన ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించిన ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించిన ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Satya Nadella: భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Embed widget