Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
IPL 2026 ప్రారంభానికి కొద్ది రోజుల ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఈ పోస్టర్స్ విరాట్ కోహ్లీ సన్ రైజర్స్ నిర్ణయాన్ని తిట్టినట్లు...తర్వాత వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ కూడా సన్ రైజర్స్ నిర్ణయాన్ని తిడుతూ కావ్యామారన్ ను తప్పు పడుతున్నట్లు ఉన్నాయి కదా. వాస్తవానికి ఇవన్నీ ఫేక్ పోస్టర్స్...ఫేక్ కార్డ్స్. అసలు కోహ్లీ కానీ కపిల్ దేవ్ కానీ సన్ రైజర్స్ గురించి ఇలాంటి మాటలే మాట్లాడలేదు కానీ...ఎందుకు ఇవి ప్రచారం చేస్తున్నారంటే. సన్ రైజర్స్ జట్టు భారత్ లో ఐపీఎల్ తో పాటు యూకే లో అమెరికా సౌతాఫ్రికాల్లోనూ టీ20 జట్లను కొనుక్కుంది. అలా యూకేలో జరిగే టీ20 లీగ్ లో సన్ రైజర్స్ లీడ్స్ అనే జట్టుకు యజమానిగా ఉంది కావ్యా మారన్ టీమ్. ఈ టోర్నీ కోసం మొన్న ఆక్షన్ జరిగినప్పుడు పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ ను లీడ్స్ జట్టు కొనుక్కోవటం వివాదాస్పదమైంది. భారతీయ సంస్థ ఒకటి పాకిస్తాన్ బౌలర్ ను తమ జట్టుకు తీసుకోవటం ఏంటని సన్ రైజర్స్ పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనిపై సన్ రైజర్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఇక్కడ భారత్ లో ఐపీఎల్ దగ్గరికి వచ్చింది. అందుకే అదే సన్ రైజర్స్ నిర్వహిస్తున్న హైదరాబాద్ జట్టు టార్గెట్ గా SRH ను ఇరుకున పెట్టేలా ఓ నెగటివ్ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లుగా ఈ ఫేక్ పోస్టర్స్ చూస్తే అర్థం అవుతోంది. అసలు బీసీసీఐ సన్ రైజర్స్ యూకేలో జట్టులోకి తీసుకున్న పాక్ బౌలర్ వివాదాన్ని తమకు సంబంధం లేదని తోసిపుచ్చింది. ఎక్కడో యూకేలో పాక్ ప్లేయర్ ను తీసుకుంటే దానికి బీసీసీఐ ఏం చేయాలని రాజీవ్ శుక్లా ప్రశ్నించారు. మరి అదే పాయింట్ ను తీసుకుని ఇప్పుడు SRH ను ఇబ్బంది పెట్టేది ఎవరనే ప్రశ్న మొదలైంది. అయితే ఇదే ఇష్యూకి సెకండ్ సైడ్ ఏంటంటే...సన్ రైజర్స్ తమిళనాడుకు చెందిన స్పోర్టింగ్ సంస్థ. దీనికి యజమాని కావ్యామారన్ ఆయన తండ్రి కళానిధి మారన్. డీఎంకే పార్టీకి చెందిన మనుషులు. కరుణానిధి కుటుంబ సభ్యులైన మారన్ ఫ్యామిలీ నిర్వహించే సంస్థ కాబట్టి తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారిపై పాక్ అనుకూలురు అనే భావన కలిగేలా సన్ రైజర్స్ కావాలనే టార్గెట్ చేస్తున్నారనే మరో అంశం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చూడాలి ఈ వివాదంపై సన్ రైజర్స్ ఏ విధంగా స్పందిస్తుందో
























