Viral News: ఉద్యోగం నుంచి తీసేశారని ఏఐజీ ఆస్పత్రి పైకి ఎక్కిన మహిళ - దూకేస్తానని బెదిరింపు - బంజారాహిల్స్లో హైడ్రామా !
Hyderabad News: బంజారాహిల్స్లో ని ఏఐజీ ఆస్పత్రికి ఓ మహిళ ఎక్కి దూకేస్తానని బెదిరించింది. ఆమెకు అనేక హామీలు ఇచ్చిన తర్వాత కిందకు దిగింది.

Woman threatened to jump: హైదరాబాద్లో బిజీగా ఉండే బంజారాహిల్స్ ఏరియాలో రెండున్నర గంటల పాటు హైడ్రామా నడిచింది. ఓ యువతి ఏఐజీ ఆస్పత్రి టెర్రస్ పైకి ఎక్కింది. అక్కడ్నుంచి దూకేస్తానని బెదిరించింది. దాంతో ఆ రోడ్ పై వెళ్లేవారు ఏమవుతుందోనని ఉత్కంఠకు గురయ్యారు. పోలీసులు వచ్చారు. ఆస్పత్రి సిబ్బంది ఎవరూ తన దగ్గరకు రావొద్దని.. ఆమె ముందుగానే హెచ్చరించింది. ఫోన్లతో సంప్రందిపులు జరిపింది.
బ్రేకింగ్.. AIG హాస్పిటల్స్ నుంచి దూకి చస్తానంటూ యువతి బెదిరింపు
— Telugu Galaxy (@Telugu_Galaxy) April 19, 2025
బంజారాహిల్స్ AIG హాస్పిటల్స్ బిల్డింగ్ మీది నుంచి దూకేందుకు యువతి యత్నం
భారీగా ట్రాఫిక్ జాం
యువతిని రక్షించేందుకు యత్నిస్తున్న పోలీసులు#KTR #BRS #Congress #RevanthReddy #Telangana #Hyderabad pic.twitter.com/jqu7n3Wf8V
ఆమె భవనంపైకి ఎక్కి దూకుతానని బెదిరిస్తున్న వైనం వైరల్ కావడంతో యాజమాన్యం కూడా స్పందించింది. భవనం పైకి ఎక్కిన మహిళను శివలిల గా గుర్తించారు. అదే ఆస్పత్రిలో ఆమె టెంపరరీ ఉద్యోగం చేశారు. అయితే ఇటీవల ఆమె ఉద్యోగం తొలగించారు. ఈ కారణంగా ఆమె ఆస్పత్రి భవనంపైకి ఎక్కి.. తన ఉద్యోగం తనకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఆమె టెర్రస్ పైనే నిలబడి రెండు గంటల పాటు చర్చలు జరిపారు.ఆమె డిమాండ్లపై యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో ఆమె కిందకు దిగి వచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బంజారా హిల్స్ లోని సిటీ సెంటర్ పక్కన ఏఐజీ ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతం ఎప్పుడూ ట్రాఫిక్ తోబిజీగా ఉండే ఏరియా కాావడంతో ఆమె కారణంగా ట్రాఫిక్ చాలా సేపు అంతరాయం ఏర్పడింది.





















