అన్వేషించండి

Konaseema News: నడిసంద్రంలో ఆగిపోయిన బోట్లు.. 14 మంది మత్స్యకారులను ఎలా రక్షించారంటే..

Konaseema News:న‌డి సముద్రంలో ఆగిపోయిన 2 బోట్లు. దిక్కు తోచని స్థితిలో 14 మంది మత్స్యకారులు. సరైన టైంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని రక్షించిన అధికారులు. సినిమా తరహా రియల్ రెస్క్యూ ఆపరేషన్ ఇది.

Ambedkar Konaseema District News: ఓ పక్క అల్పపీడన ప్రభావంతో అల్లకల్లోలంగా మారిన సముద్రం... బలమైన ఈదురు గాలులకు ఒడ్డుకు సురక్షితంగా చేరుతామో లేదో అన్న సందేహం. ఇంతలోనే రెండు బోట్లులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దిక్కుతోచని అగమ్యగోచరంలో ఉన్న 14 మంది మత్స్యకారులను నడిసంద్రంలో ఆగిపోయిన బోట్లను తీరానికి సురక్షితంగా తీసుకువచ్చారు.  అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, కోస్టల్‌ మెరైన్‌ ఎస్పీ రవివర్మ పర్యవేక్షణలో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌, ఓడలరేవు కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌, అల్లవరం పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది సంయుక్తంగా కలిసి మొత్తం మీద సముద్రంలో చిక్కుపోయిన రెండు బోట్లును మత్స్యకారులను సురక్షితంగా తీరానికి చేర్చారు..

భైరవపాలెంకు 7.6 నాటికన్‌ మైళ్ల దూరంలో... 
ఈనెల 16న కాకినాడ పోర్టు నుంచి సముద్రంలోకి ఏడుగురు మత్స్యకారులు 4996 అను నెంబరు గల బోటు మీద వేటకు వెళ్లారు. వీరిలో గుర్రాల రాము, చొల్లంగి అప్పారావు, చెక్కా శివాజి, దాసరి దుర్గ, గరికన బుజ్జి, గోశాల మణికంఠ, వాంక సత్తిబాబు వీరంతా పోర్టు ఏరియాకు చెందిన వారు కాగా మరో బోటులో దూడ చిన్నా, గరికిన సింహాద్రి, దూడ కూర్మారావు, దూడ కూర్మారావు, దూడ అప్పారావు, తిక్కాడ శ్రీను, దూడ నల్లబ్బాయి, ఉమ్మిడి నూకరాజు వీరంతా కలిసి మరో బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో వేట సాగించవద్దన్న హెచ్చరికల నేపథ్యంలో తిరిగి వచ్చేందుకు వేర్వేరుగా సిద్ధపడ్డారు. ఇదిలా ఉంటే తిరిగి వచ్చేద్దామనుకున్న ఈ రెండు బోట్లు వేర్వేరుగా 19న మరమ్మత్తులు గురవ్వడంతో అగమ్యగోచర పరిస్థితిలోకి వెళ్లారు. 

పోర్టు సిబ్బందికి ఈ సమాచారం అందించారు. అయితే వారు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో సాయంత్రం సెల్‌ఫోన్‌ ద్వారా ఓడలరేవు కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ పట్నంలోని కోస్టల్‌ మెరైన్‌ ఎస్పీ రవివర్మకు తెలిపారు. 

ఒకటి కాకినాడకు మరొకటి ఓడలరేవుకు సురక్షితంగా...
నడి సముద్రంలో పాడై చిక్కుపోయిన 14 మంది మత్స్యకారులు నడిసంద్రంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి తలెత్తింది. జీపీఎస్‌ ద్వారా కాట్రేనికోన మండలం కొత్తపాలెం వద్ద భైరవపాలెంకు 7.6 నాటికన్‌ మైళ్ల దూరంలో రెండు బోట్లు ఉన్నట్లు నిర్ధారణ చేసుకున్న తరువాత కాకినాడ నుంచి కోస్టు గార్డు సిబ్బంది ఒక బోటు, ఓడలరేవు నుంచి మరో బోటును పంపించారు. కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన కొపనాతి శంకర్‌ను సహాయం కోరిన కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులు ఆయన ద్వారా ఓ బోటును, చిక్కుకున్న మత్స్యకారునలు ఓడలరేవు తీరానికి సురక్షితంగా తీసుకువచ్చారు. కోస్ట్‌గార్డు సిబ్బంది ద్వారా మరో బోటును కాకినాడ పోర్టుకు సురక్షితంగా చేర్చారు. 

30 గంటలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..పాడైన రెండు బోట్లులో 14 మంది మత్స్యకారులు వేర్వేరు ప్రాంతాల్లో నడిసంద్రంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 30 గంటలు గడిపిన పరిస్థితి తలెత్తింది. కోస్టుగార్డు సిబ్బంది ద్వారా ఓ బోటు కాకినాడ పోర్టు తీరానికి సురక్షితంగా చేరుకోగా మరో బోటు ఓడలరేవు వైపుకు వీరిని తీసుకువచ్చింది. 

రెస్క్యూ చేసిన బోటు ఓడలరేవు నదీసాగర సంగమం వద్దకు చేరుకుంటున్న క్రమంలో అలల ఉద్ధృతికి బోటుకు ఉన్న కొయ్యకర్ర అదుపుతప్పి గుర్రాల రాముమీద పడడంతో గాయాలపాలయ్యాడు. గరికన బుజ్జి అనే వ్యక్తి అలల ధాటికి బోటు నుంచి సముద్రంలో జారి పడిపోయాడు.. సమయస్ఫూర్తితో వ్యవహరించిన బోటు యజమాని కొపనాతి శంకర్‌ ఓ తాడుకు డబ్బా కట్టి సముద్రంలోకి విసరడంతో అదిపట్టుకోగా లాక్కుని వచ్చి తిరిగి బోటులో ఎక్కించుకుని సురక్షితంగా తీరానికి తీసుకువచ్చారు. మెరైన్‌ సీఐ ఎంవీఎస్‌ఎన్‌ మూర్తి, ఎస్సై జి.విలియమ్స్‌ సకాలంలో స్పందించకుండా ఉంటే తామంతా బతికేవాళ్లం కాదని మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Chit Chat: కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
CM Chandrababu at VIT: నా నిర్ణయాల ఫలితంగా తెలంగాణ నెంబర్ వన్ అయింది, గర్వంగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు
నా నిర్ణయాల ఫలితంగా తెలంగాణ నెంబర్ వన్ అయింది, గర్వంగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు
GVMC Mayor Election: విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం, గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం, గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
KCR on HCU Lands: హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG Captian Rishabh Pant Failures in IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్Rishabh Pant Failures IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్RCB 6 Away Matches Wins in Row | IPL 2025 లో సరికొత్త చరిత్రను సృష్టించి ఆర్సీబీKrunal Pandya 73 runs vs DC IPL 2025 | కుప్పకూలిపోతున్న RCB ని కొహ్లీ తో కలిసి నిలబెట్టేసిన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Chit Chat: కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
CM Chandrababu at VIT: నా నిర్ణయాల ఫలితంగా తెలంగాణ నెంబర్ వన్ అయింది, గర్వంగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు
నా నిర్ణయాల ఫలితంగా తెలంగాణ నెంబర్ వన్ అయింది, గర్వంగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు
GVMC Mayor Election: విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం, గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం, గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
KCR on HCU Lands: హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
Pak Gets C130 Support: యుద్ధ భయంతో టర్కీ సాయం కోరిన పాక్, ఆయుధాలతో ఇస్లామాబాద్ చేరిన సీ130 మిలటరీ విమానం
యుద్ధ భయంతో టర్కీ సాయం కోరిన పాక్, ఆయుధాలతో ఇస్లామాబాద్ చేరిన సీ130 మిలటరీ విమానం
Vishwak Sen: మొన్ననే 30 వచ్చాయ్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా.. - 'హిట్ 3' వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ క్లారిటీ
మొన్ననే 30 వచ్చాయ్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా.. - 'హిట్ 3' వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ క్లారిటీ
PM Modi AP Tour: అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
India Bans Pakistans YouTube: మరోసారి భారత్ కన్నెర్ర, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
మరోసారి భారత్ కన్నెర్ర, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
Embed widget