అన్వేషించండి

CM Chandrababu at VIT: నా నిర్ణయాల ఫలితంగా తెలంగాణ నెంబర్ వన్ అయింది, గర్వంగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు

Andhra Pradesh News | గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ సిటీని డెవలప్ చేశానని, అప్పుడు తీసుకున్న నిర్ణయాల ఫలితంగా తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1 అయిందన్నారు.

Chandrababu Visits VIT at Amaravati | అమరావతి: 2047కి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయాలు, 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తయారవుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందులో విద్యార్థులు, యువత మీ పాత్ర ఏంటి, మీరు ఏ స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నారో.. కలలు కనడంతో పాటు వాటిని నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని సూచించారు. అమరావతిలోని విట్‌ వర్సిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. కొందరు డబ్బుల్లేవని అభివృద్ధి, సంక్షేమాన్ని ఆపేస్తుంటారు. కానీ మనం సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విట్ యూనివర్సిటీలో స్టార్టప్ కంపెనీల కోసం సోమవారం నాడు వీ లాంచ్‌ప్యాడ్ ను చంద్రబాబు ప్రారంభించారు.

సాధారణ కుటుంబాల నుంచి వచ్చి అసాధారణ ఫలితాలు

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. జాతిపిత గాంధీజీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, దివంగత సీఎం ఎన్టీఆర్, నేను సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినా ఉన్నత స్థానాలకు ఎదిగాం. రతన్ టాటా సైతం చిన్నతనంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. విద్యార్థులు తమ సమాజంలో ఉన్నతమైన వారిగా నిలిచేందుకు సంకల్పించుకుని, అందుకు తగ్గట్లుగా కృషి చేయాలని సూచించారు.

కాలేజీ రోజుల్లోనే నా కెరీర్ డిసైడ్ చేసుకున్న

నా జీవితం ఎలా ఉండాలని చదువుకున్న రోజుల్లో ఆలోచించాను. తనకు ఐఏఎస్ సెట్ అవుతుందని అందరూ సూచించారు. నేను సరిగ్గా చదవలేను. చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నా.. గంటల తరబడి చదవడం ఇష్టం ఉండేది కాదు. ఇది నాకు సెట్ కాదని అప్పటి మా వైస్ ఛాన్స్‌లర్‌కు స్పష్టం చేశా. అనుకున్నట్లుగానే 1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాను. నేను ప్రభుత్వంలోకి వస్తే.. ఐఏఎస్ అధికారులకు దిశా నిర్దేశం చేయవచ్చు అనుకున్నాను. నా జీవితంలో సరిగ్గా అదే జరిగింది. వ్యాపారం, ఉద్యోగం చేయవచ్చు కానీ బతకడం కోసం రాజకీయాలు ఎవరూ చేయవద్దు అనేది నా సూచన. పారదర్శకత, నీతి నిజాయితీ ఉండాలంటే రాజకీయాలను బతుకుదెరువు చేసుకోకూడదు. అందుకే 1991లో సంస్కరణలు వచ్చాయి. 1992లో హెరిటేజ్ సంస్థ స్థాపించా. నా సతీమణి నారా భువనేశ్వరి ఎంతో శ్రమించి సంస్థను అభివృద్ధి చేశారు. 

తెలంగాణ నెంబర్ 1 అయినందుకు సంతోషంగా ఉంది

ఒకప్పుడు తక్కువ సమయంలోనేే హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేశాను. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం తెలంగాణలో ఉంది. ఆనాడు నేను తీసుకున్న నిర్ణయాల ఫలితంగా హైదరాబాద్ ఉన్న కారణంగా దేశంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఓ తెలుగు రాష్ట్రం నెంబర్ వన్ అయినందుకు తెలుగు వాడిగా గర్వపడుతున్నాను. ప్రపంచంలో పలు దేశాల్లో తెలుగు వాళ్లు ఉన్నారు. వారు ఎక్కడున్నా అగ్ర స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.

మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్నారని, ఆయన చేతుల మీదుగా రాజధాని అమరావతి పునఃప్రారంభం కాబోతోందని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఐటీ విప్లవం తీసుకొచ్చాం. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్‌ టెక్నాలజీని ప్రమోట్‌ చేస్తున్నానని చెప్పారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం చూడవద్దు, కొత్త టెక్నాలజీ, సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget