అన్వేషించండి

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న సిటీ టాస్క్‌‌ఫోర్స్‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌, మూడో నిందితుడుగా ఉన్న భుజంగరావుకు హైకోర్టు యిల్ మంజూరు చేసింది.

Bhujanga Rao and Radhakishan Rao Gets bail In Phone Tapping Case | తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు పోలీసు అధికారులు అరెస్టయ్యారు. ఈ కేసులో తాజాగా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితులుగా ఉన్న సిటీ టాస్క్‌‌ఫోర్స్‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌, మూడో నిందితుడుగా ఉన్న భుజంగరావుకు బెయిల్ మంజూరు చేసింది. 

పాస్​పోర్టులు సమర్పించాలని ఆదేశం
ఈ సందర్భంగా హైకోర్టు నిందితులు లక్ష రూపాయలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అదేవిధంగా పాస్​పోర్టులు సమర్పించాలని సూచించింది. ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించాలని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాజాగా రాధాకిషన్, భుజంగరావుకు బెయిల్ మంజూరు చేయడంతో ఈ కేసులో ఉన్న ప్రణీత్ రావు మత్రమే ప్రస్తుతం జైలులో ఉన్నారు. మిగతా నిందితులందరికీ బెయిలు మంజూరైంది. 

ఈ నెల 28న తిరుపతన్నకు కూడా బెయిల్​
ఈ కేసులో సస్పెండైన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు ఈ నెల 28న  బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌‌గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న తిరుపతన్నను గతేడాది మార్చి 23న సిట్‌‌ అరెస్ట్‌‌ చేసింది. దీంతో 10 నెలలపాటు జైలు జీవితం గడిపిన తిరుపతన్న బెయిల్​పై విడుదలయ్యారు. ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించి విడుదల కావడం గమనార్హం. సుప్రీం ఆదేశాల మేరకు ఆయన లాయర్లు మంగళవారం నాంపల్లి కోర్టులో ష్యూరిటీస్‌‌ దాఖలు చేశారు. అనంతరం బెయిల్‌‌ ఆర్డర్‌‌‌‌ను చంచల్‌‌గూడ జైలు అధికారులకు అందించారు. 

ప్రణీత్‌‌రావుకు నో బెయిల్​
ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మరో ప్రధా నిందితుడు మాజీ డీఎస్పీ ప్రణీత్‌‌రావుకు మాత్రం బెయిల్‌‌ లభించలేదు. రెండో నిందితుడిగా ఉన్న ప్రణీత్‌‌రావు ప్రస్తుతం చంచల్​గూడ జైలులోనే ఉన్నారు. ఆయన తరఫు లాయర్లు సమర్పించిన బెయిల్​ పిటిషన్లను హైకోర్టు పలుమార్లు తిరస్కరించింది.

ప్రభాకర్‌‌‌‌రావు,  శ్రవణ్‌‌రావును అమెరికా నుంచి రప్పించే యత్నం
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌‌‌‌రావు, ఆరో నిందితుడిగా ఉన్న ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్‌‌రావు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారు. ప్రభాకర్‌‌‌‌రావు,  శ్రవణ్‌‌రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు హైదరాబాద్‌‌లోని అమెరికన్ ఎంబసీ ద్వారా అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు.

450కి పైగా ఫోన్ల ట్యాప్‌‌
ఫోన్​ ట్యాపింగ్ కేసులో రెండో చార్జ్‌‌షీట్‌‌ దాఖలు చేసేందుకు సిట్ దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2023 నవంబర్‌‌‌‌ 15 నుంచి 30వ తేదీ మధ్య 450కి పైగా ఫోన్లను ట్యాప్‌‌ చేసినట్టు సిట్‌‌ సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఇందులో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి వినియోగించిన రెండు ఫోన్ నంబర్స్‌‌తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుల ఫోన్‌‌ నంబర్స్‌‌, మండలస్థాయి కాంగ్రెస్​ లీడర్ల నంబర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. 

ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా..
ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఇటీవలే వెల్లడైంది. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ముఠాలోని కీలక నిందితుడి సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) విశ్లేషించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల ఫోన్లలో ఇద్దరు న్యాయమూర్తుల ఫొటోలతో పాటు వారి పూర్తి ప్రొఫైల్స్ ఉన్నాయి. వారు ఎక్కడ జన్మించారు? ఎక్కడ చదువుకున్నారు? కుటుంబ సభ్యుల వివరాలు, ఉద్యోగ ప్రస్థానం వంటి విషయాలు కూడా అందులో ఉన్నాయి. వారి నంబర్ల కాల్ డిటైల్ రికార్డ్స్ (సీడీఆర్)తో పాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటైల్ రికార్డ్స్ (ఐపీడీఆర్)ను కూడా నిందితుడు సేకరించినట్లు గుర్తించారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#Hidden Agenda at TDP Social Media | టీడీపీ సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే ఎటాక్స్..అసలు రీజన్ ఇదేనా | ABP DesamSouth Industry Domination | బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ | ABP DesamShreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
Embed widget