అన్వేషించండి

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న సిటీ టాస్క్‌‌ఫోర్స్‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌, మూడో నిందితుడుగా ఉన్న భుజంగరావుకు హైకోర్టు యిల్ మంజూరు చేసింది.

Bhujanga Rao and Radhakishan Rao Gets bail In Phone Tapping Case | తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు పోలీసు అధికారులు అరెస్టయ్యారు. ఈ కేసులో తాజాగా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితులుగా ఉన్న సిటీ టాస్క్‌‌ఫోర్స్‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌, మూడో నిందితుడుగా ఉన్న భుజంగరావుకు బెయిల్ మంజూరు చేసింది. 

పాస్​పోర్టులు సమర్పించాలని ఆదేశం
ఈ సందర్భంగా హైకోర్టు నిందితులు లక్ష రూపాయలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అదేవిధంగా పాస్​పోర్టులు సమర్పించాలని సూచించింది. ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించాలని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాజాగా రాధాకిషన్, భుజంగరావుకు బెయిల్ మంజూరు చేయడంతో ఈ కేసులో ఉన్న ప్రణీత్ రావు మత్రమే ప్రస్తుతం జైలులో ఉన్నారు. మిగతా నిందితులందరికీ బెయిలు మంజూరైంది. 

ఈ నెల 28న తిరుపతన్నకు కూడా బెయిల్​
ఈ కేసులో సస్పెండైన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు ఈ నెల 28న  బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌‌గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న తిరుపతన్నను గతేడాది మార్చి 23న సిట్‌‌ అరెస్ట్‌‌ చేసింది. దీంతో 10 నెలలపాటు జైలు జీవితం గడిపిన తిరుపతన్న బెయిల్​పై విడుదలయ్యారు. ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించి విడుదల కావడం గమనార్హం. సుప్రీం ఆదేశాల మేరకు ఆయన లాయర్లు మంగళవారం నాంపల్లి కోర్టులో ష్యూరిటీస్‌‌ దాఖలు చేశారు. అనంతరం బెయిల్‌‌ ఆర్డర్‌‌‌‌ను చంచల్‌‌గూడ జైలు అధికారులకు అందించారు. 

ప్రణీత్‌‌రావుకు నో బెయిల్​
ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మరో ప్రధా నిందితుడు మాజీ డీఎస్పీ ప్రణీత్‌‌రావుకు మాత్రం బెయిల్‌‌ లభించలేదు. రెండో నిందితుడిగా ఉన్న ప్రణీత్‌‌రావు ప్రస్తుతం చంచల్​గూడ జైలులోనే ఉన్నారు. ఆయన తరఫు లాయర్లు సమర్పించిన బెయిల్​ పిటిషన్లను హైకోర్టు పలుమార్లు తిరస్కరించింది.

ప్రభాకర్‌‌‌‌రావు,  శ్రవణ్‌‌రావును అమెరికా నుంచి రప్పించే యత్నం
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌‌‌‌రావు, ఆరో నిందితుడిగా ఉన్న ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్‌‌రావు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారు. ప్రభాకర్‌‌‌‌రావు,  శ్రవణ్‌‌రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు హైదరాబాద్‌‌లోని అమెరికన్ ఎంబసీ ద్వారా అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు.

450కి పైగా ఫోన్ల ట్యాప్‌‌
ఫోన్​ ట్యాపింగ్ కేసులో రెండో చార్జ్‌‌షీట్‌‌ దాఖలు చేసేందుకు సిట్ దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2023 నవంబర్‌‌‌‌ 15 నుంచి 30వ తేదీ మధ్య 450కి పైగా ఫోన్లను ట్యాప్‌‌ చేసినట్టు సిట్‌‌ సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఇందులో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి వినియోగించిన రెండు ఫోన్ నంబర్స్‌‌తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుల ఫోన్‌‌ నంబర్స్‌‌, మండలస్థాయి కాంగ్రెస్​ లీడర్ల నంబర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. 

ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా..
ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఇటీవలే వెల్లడైంది. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ముఠాలోని కీలక నిందితుడి సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) విశ్లేషించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల ఫోన్లలో ఇద్దరు న్యాయమూర్తుల ఫొటోలతో పాటు వారి పూర్తి ప్రొఫైల్స్ ఉన్నాయి. వారు ఎక్కడ జన్మించారు? ఎక్కడ చదువుకున్నారు? కుటుంబ సభ్యుల వివరాలు, ఉద్యోగ ప్రస్థానం వంటి విషయాలు కూడా అందులో ఉన్నాయి. వారి నంబర్ల కాల్ డిటైల్ రికార్డ్స్ (సీడీఆర్)తో పాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటైల్ రికార్డ్స్ (ఐపీడీఆర్)ను కూడా నిందితుడు సేకరించినట్లు గుర్తించారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Temple Priest Passes Away: అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత
Revanth Reddy: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
Rs 9 Crore Compensation: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
Chiranjeevi: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్
నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Toyaguda Villagers Meet After 40 Years | నాలుగు దశాబ్దాల నాటి జ్ఞాపకాల ఊరిలో | ABP DesamDwarapudi Adiyogi Statue | కోయంబత్తూరు వెళ్లలేని వాళ్లకోసం ద్వారపూడికే ఆదియోగి | ABP DesamKarthi Visits Tirumala | పవన్ తో వివాదం తర్వాత తొలిసారి తిరుమలకు కార్తీ | ABP DesamRam Mohan Naidu Yashas Jet Flight Journey | జెట్ ఫ్లైట్ నడిపిన రామ్మోహన్ నాయుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayodhya Temple Priest Passes Away: అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత
Revanth Reddy: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
Rs 9 Crore Compensation: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
Chiranjeevi: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్
నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్
Champions Trophy Team India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం
ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం
Magha Purnima 2025 : శత్రు బాధలు దూరం చేసి మోక్షాన్నిచ్చే మాఘ పౌర్ణమి స్నానం , దానం!
శత్రు బాధలు దూరం చేసి మోక్షాన్నిచ్చే మాఘ పౌర్ణమి స్నానం , దానం!
Telugu TV Movies Today: వెంకీ ‘మల్లీశ్వరి’, రాజశేఖర్ ‘సూర్యుడు’ టు ప్రభాస్ ‘మున్నా’, ఎన్టీఆర్ ‘నాగ’ వరకు- ఈ బుధవారం (ఫిబ్రవరి 12) టీవీలలో వచ్చే సినిమాలివే
వెంకీ ‘మల్లీశ్వరి’, రాజశేఖర్ ‘సూర్యుడు’ టు ప్రభాస్ ‘మున్నా’, ఎన్టీఆర్ ‘నాగ’ వరకు- ఈ బుధవారం (ఫిబ్రవరి 12) టీవీలలో వచ్చే సినిమాలివే
Rahul Telangana tour cancel :  రాహుల్ తెలంగాణ టూర్ క్యాన్సిలట - అసలు వస్తారని ఎప్పుడు చెప్పారు?
రాహుల్ తెలంగాణ టూర్ క్యాన్సిలట - అసలు వస్తారని ఎప్పుడు చెప్పారు?
Embed widget