అన్వేషించండి

Breaking News Telugu Live Updates: ఢిల్లీ బ్రోకర్ గాళ్లు చంచల్ గూడ జైల్లో ఉన్నారు - కేసీఆర్

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ లైవ్ అప్‌డేట్స్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
Breaking News Telugu Live Updates: ఢిల్లీ బ్రోకర్ గాళ్లు చంచల్ గూడ జైల్లో ఉన్నారు - కేసీఆర్

Background

దక్షిణ కొరియాలో పెను విషాదం చోటుచేసుకుంది. రాజధాని సియోల్‌ నగరంలో నిర్వహించిన హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట జరగడంతో 149 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వారిలో 20 నుంచి 30 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. సియోల్ లోని ఇటావాన్‌ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ వేడుకలు నిర్వహించారు. అప్పటివరకూ ఉత్సాహంగా సాగిన హాలోవీన్ సంబురాలు పెను విషాదాన్ని నింపాయి. చిన్నా పెద్దా అనే వ్యత్యాసం లేకుండా ఒక్కసారిగా భారీ సంఖ్యలో హాలోవీన్ సంబరాల్లో ప్రజలు పాల్గొనడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో అధికంగా యువత ఉన్నారని అధికారులు గుర్తించారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా.. తమిళనాడు వైపుగా అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ కోస్తాంధ్ర పై భారీ ప్రభావం చూపుతోంది. అల్పపీడనంతో నేడు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అక్టోబర్ 31 నుంచి ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలపగా, వాతావరణ కేంద్రం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అక్టోబర్ 31 రాత్రి నుంచి వర్షాలు మొదలవుతాయి. అంత వరకు చిరు జల్లులు పడతాయి. అక్టోబర్ 31 రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో మొదట నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లోకి అల్పపీడనం ప్రవేశిస్తుంది. తర్వాత నవంబర్ 1, 2, 3, నవంబర్ 4 వరకు ఈ వర్షాలు కొనసాగనున్నాయి. కానీ నవంబర్ 1, నవంబర్ 2 తేదీల్లో అత్యధికంగా వర్షాలు కురవనున్నాయి. ఈసారి అల్పపీడనానికి ఉత్తర భాగంలో ఉపరితల ఆవర్తనం ఉండటం వలన వర్ష తీవ్రత కోస్తా భాగాల్లో ఉంటుంది.

రాష్ట్రంలో వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాత్రివేల చలి తీవ్రత రాష్ట్రంలో పెరుగుతోంది. నేడు కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 31 నుంచి రాష్ట్రంలో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలున్నాయి. నవంబర్ తొలి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 30 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. ఈశాన్య దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం నేడు ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీరంలో ఉండటంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఉంటుంది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో నేటి నుంచి ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో అక్టోబర్ చివరి నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిటికంటే తక్కువగా వర్షాలు పడనుంది. నవంబర్ 2, నవంబర్ 3న వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అన్నిటికంటే తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో వర్షాలున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం నవంబర్ 2, 3 చలి గాలులు వీచనున్నాయి. తెలంగాణలో ఇది వర్షాకాలం కాదు. తెలంగాణ - ఆంధ్ర సరిహద్దు భాగాల్లో మాత్రం నవంబర్ 2, 3 తేదీల్లో చినుకులు ఉండే అవకాశాలున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లో అధికంగా వర్షాలు పడే అవకాశాలున్నాయి. కృష్ణపట్నం, మైపాడు, తూపిలిపాలెం, శ్రీహరికోట లాంటి చోట్ల ఎక్కువ వర్షాలు పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. మరో వైపున నెల్లూరు నగరం, గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి వైపు మాత్రం భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉంది. ఈ జిల్లాల్లో అత్యధికంగా నవంబర్ 1, 2 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 3, 4 తేదీలలో సాధారణ వర్షాలున్నాయి.

16:44 PM (IST)  •  30 Oct 2022

KCR Speech: వడ్లు కొనరు కానీ ఎమ్మెల్యేలను కొనేందుకు వస్తరా? - కేసీఆర్

’’మా పంట కొనాలని వడ్లు కొనాలని అడిగితే స్పందించరు కానీ, రూ.వందల కోట్లు సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనాలని వస్తరా? ఈ బీజేపీకి బుద్ధి చెప్పాలా? వద్దా? మీరంతా ఆలోచించాలి. వీటన్నింటికీ మీరు జవాబు చెప్పకపోతే వాళ్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తరు. మేం చేసేది ఏమీ ఉండదు. గ్యాస్ రేటు పెరిగింది.. పెట్రోల్ రేట్లు పెరిగాయి.. జీఎస్టీ ఎస్తున్నారని మనం కొట్లాడాలి. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధాన్ని ఇంకొకడ్ని చేయమంటే చేస్తడా? ఎవరి చేతిలో కత్తి పెడతవో.. వాడు మన మెడ కోసేస్తడు. కాబట్టి, కత్తి ఒకడి చేతిలో పెట్టి యుద్ధాన్ని మరొకరిని చేయమంటే సమంజసం కాదు. ప్రజల ఆస్తులు కాపాడే పార్టీలను మీరు గౌరవిస్తే అందరం మంచిగుంటదని గమనించాలి.’’ అని కేసీఆర్ అన్నారు.

16:21 PM (IST)  •  30 Oct 2022

CM KCR: మునుగోడు ప్రజలు మనసుపెట్టి ఆలోచించండి - కేసీఆర్

‘‘ఇతరుల్ని సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కూలగొడుతున్న అరాచకం ప్రస్తుతం ఉంది. మోదీ రెండు సార్లు ప్రధానిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ కు వచ్చి ఇప్పుడు చంచల్ గూడ జైలులో ఉన్నారు. దీనిపైన విచారణ జరగాలి. మనం మౌనంగా ఉంటే అదే మనకు శాపం అవుతుంది. ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. కాబట్టి, మునుగోడులో ఉన్న అందరూ మనసుపెట్టి ఆలోచించండి. మీ ఊరు పోయి చర్చించుకోండి’’ అని కేసీఆర్ అన్నారు.

16:18 PM (IST)  •  30 Oct 2022

KCR Speech: ఢిల్లీ బ్రోకర్ గాళ్లు చంచల్ గూడ జైల్లో ఉన్నారు - కేసీఆర్

‘‘హైదరాబాద్ నుంచి నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నాతో పాటు వచ్చారు. నిన్నా మొన్నా ఢిల్లీ బ్రోకర్ గాళ్లు పార్టీ మారాలని వంద కోట్లు ఇస్తే వారిని ఎడమ కాలు చెప్పుతో కొట్టారు. మేం అమ్ముడు పోబోమని, తెలంగాణ బిడ్డలమని, తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయాలంత ఎత్తు ఎగరేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్, కొత్తగూడెం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు లాంటివారు మన రాజకీయాలకు కావాలి. జాతి, దేశ గౌరవాన్ని కాపాడారు. అంగట్లో పశువుల్లాగా అమ్ముడుపోకుండా రూ.వంద కోట్లిచ్చినా గడ్డిపోచగా విసిరికొట్టారు.’’ అని కేసీఆర్ అన్నారు.

16:01 PM (IST)  •  30 Oct 2022

CM KCR in Munugode: చండూరుకు చేరుకున్న సీఎం కేసీఆర్

మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభా వేదిక వ‌ద్ద‌కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో కేసీఆర్ బంగారిగ‌డ్డ‌కు చేరుకున్నారు. కేసీఆర్‌ వెంట ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు కూడా ఉన్నారు.

12:27 PM (IST)  •  30 Oct 2022

రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు బాగోతం కాంగ్రెస్ బట్టబయలు

ఆధారాలతో సహా బహిర్గతం చేసిన కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ, కుమారుడు సంకీర్త రెడ్డి వాటాలున్న కంపనీకి భారీగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చిందని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశి సంస్థతో బీజేపీ క్విడ్-ప్రోకో డీల్ కుదుర్చుకుoది. ఝార్ఖండ్ లో ఉన్న Chandragupt బొగ్గు గనులను రాసిచ్చింది.

ఒప్పoద ప్రక్రియ జాప్యాన్ని గ్రహించిన రాజగోపాల్ రెడ్డి, బీజేపీని సంప్రదించి  2022న తుది ఒప్పoదం చేసుకున్నారు. మీడియా సమావేశంలో ఈ విషయాన్ని బహిరంగ పరిచిన కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ, పొన్నం తదితరులు.

12:14 PM (IST)  •  30 Oct 2022

విశాఖ -  గాజువాక వుడా కాలనీలో రోడ్డు పక్కన మృతదేహం 

విశాఖ -  గాజువాక వుడా కాలనీలో రోడ్డు పక్కన మృతదేహం 
కొట్టి హత్య చేసి ఉంటారని భావిస్తున్న స్థానికులు 
ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మృతుడు మైలార అప్పారావు 40 సంవత్సరాలు లారి డ్రైవర్ గా  గుర్తింపు

ఆయన లారీ డ్రైవర్ గా లైన్లు తిరుగుతుంటారు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సంఘటన స్థలంలో లభ్యమైన ఆధారాల్ని చూస్తే మద్యం సేవించిన అనంతరం బాటిల్ తో కొట్టి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. అక్కడ హంతకుల చెప్పులు లభ్యమయ్యాయి. లారీ డ్రైవర్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా కూపీ లాగే పనిలో ఉన్నారు.

11:02 AM (IST)  •  30 Oct 2022

రాయలసీమ ప్రజల సమస్యలు చంద్రబాబు తెలుసుకోవాలి: నారాయణ స్వామి

తిరుపతి : తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ..‌ నిత్యం ప్రజా సేవకు అంకితమై సేవచేస్తున్న సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల సంక్షేమం కొరకే అన్నారు.. అన్ని ప్రాంతాలు సమానంగా చూడాలని ఆలోచనతోనే మూడు రాజధానులు తీసుకురావడం జరిగిందన్నారు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనేదే సీఎం ప్రధాన లక్ష్యమని చెప్పారు..  రాయలసీమ ప్రజల మదిలో ఏముందో ఇప్పుడైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలుసుకోవాలని సూచించారు. చంద్రబాబుకి తోడునీడగా ఉండే పవన్ కళ్యాణ్ కి మూడు రాజధానుల అవసరం తెలియాలన్నారు.. ఉమ్మడి కుటుంభం నుంచి విడిపోయి కష్టాలు పడుతున్నామని, మల్లి అదే పరిస్థితి రాకుండా చూడాలనే మూడు రాజధానులు సీఎం తీసుకొచ్చారని అన్నారు.. నవరత్నాలు, మూడు రాజధానులను వక్రీకరిస్తున్న చంద్రబాబు, యెల్లో మీడియాకు కనువిప్పు కావాలని దేవుడిని ప్రార్ధించినట్లు తెలిపారు..

11:00 AM (IST)  •  30 Oct 2022

కార్తీకమాసం కావడంతో మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు 

 శ్రీశైలంలో కార్తీక మసోత్సవాల సందర్భంగా మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీకమాసం పైగా ఆదివారం సెలవు కూడా కలసిరావడంతో క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది ఇరు తెలుగు రాష్ట్రల నుండే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సైతం శ్రీశైల ముక్కంటి క్షేత్రానికి చేరుకుని వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తి భావంతో కార్తీక దీపాలను వెలిగించి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా కార్తీకమాసంలో ప్రభుత్వ సెలవు, కార్తీక సోమవారాలు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తామని ఈవో లవన్న తెలియజేసారు మరోపక్క వేకువ జామున నుంచే ఆలయ క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయ ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద ఉత్తర శివమాడవీధిలో ఉసిరిచెట్ల వద్ద భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో ఎస్.లవన్న తెలిపారు.

11:00 AM (IST)  •  30 Oct 2022

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి నమిత

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని సినీ నటి నమిత దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.. ఆలయం వెలుపల నమితా మాట్లాడుతూ.. స్వామి వారి చలువతో పిల్లలు చాలా ఆరోగ్యాంగా ఉన్నారని తెలిపారు.. ప్రస్తుతం రాజకీయం వైపు అడుగులు వేస్తున్నానని, అందుకే సినిమాలు చేయడం లేదని తెలిపారు..

10:59 AM (IST)  •  30 Oct 2022

పెద్దాయిపల్లి వద్ద జోడో యాత్రకు భోజన విరామం

ఐదవ రోజు జడ్చర్ల నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

ఇవాళ 22కి.మీ దూరం సాగనున్న జోడో యాత్ర

కన్యాకుమారి నుంచి 53 రోజులుగా కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర

రైతులు, విద్యార్థులు, గిరిజనులు, చేనేత సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న రాహుల్

బీజేపీ విద్వేషం, టీఆరెస్ దోపిడీపై విమర్శలు కురిపిస్తూ ముందుకు

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రయివేటు పరం అవుతోందంటూ ధ్వజం

ఈరోజు పెద్దాయిపల్లి వద్ద జోడో యాత్రకు భోజన విరామం

అనంతరం సాయంత్రం షాద్ నగర్ సోలిపూర్ జంక్షన్ కు చెరుకోనున్న యాత్ర

అక్కడే కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్న రాహుల్ గాంధీ

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలుKadiyam Srihari Joins Congress | కాంగ్రెస్ నేతలతో కడియం భేటీ..మరి పాతమాటల సంగతేంటీ.? | ABP DesamPrabhakar Chowdary Followers Angry | ప్రభాకర్ చౌదరికి టీడీపీ దక్కకపోవటంపై టీడీపీ నేతల ఫైర్ | ABPTDP Ex MLA Prabhakar Chowdary | అనంతపురం అర్బన్ టికెట్ దక్కకపోవటంపై ప్రభాకర్ చౌదరి ఆగ్రహం| ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Embed widget