అన్వేషించండి

Hyderabad News: విద్యార్దుల అరెస్ట్ లతో హీటెక్కిన HCU భూముల వివాదం.. తెగేవరకూ లాగుతున్నది ఎవరు..?

400 ఎకరాల భూముల వివాదంతో హెచ్ సియూ లో విద్యార్దుల ఆందోళనలు తారాస్దాయికి చేరింది. తాజాగా విద్యార్దుల బలవంతపు అరెస్ట్ లతో మరింత అగ్గిరాజుకుంది. ప్రభుత్వం వర్సెస్ విద్యార్దుల మధ్య ఏం జరుగుతోందంటే..?

HCU Land Dispute | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూములపై గత కొంత కాలంగా విద్యార్దులు ఆందోళనలు చేస్తున్నారు. యూనిర్సిటీ క్యాంపస్ లోపలే ప్రతీ రోజూ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా నిరసనలు తారాస్దాయికి చేరాయి. జేసిబిలు క్యాంపస్ లోపలికి రావడం, వివాదాస్పద భూముల్లో చెట్లను తొలగించేందుకు సిద్దమవ్వడంతో విద్యార్దులు అడ్డుకున్నారు. విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న విద్యార్దులు జేసిబిలను వెనక్కు పంపే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్దులను బలవంతంగా అదుపులోకి తీసుకుని , పోలీసు వాహనాల్లో మాాదాపూర్ పోలీస్టేషన్ కు తరలించారు. 

వివాదానికి కారణాలేంటి..?

హెచ్ సీయూ భూముల వివాదంపై విద్యార్దుల వాదనలు ఓలా ఉంటే,  ప్రభుత్వం జీవోలు, నిర్ణయాలు మరోలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కంచెగచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడినప్పుడు 2300 ఎకరాల భూములు యూనివర్సిటీ పరిధిలో ఉండేవి. ఆ తరువాత కాలంలో కొంత మేర ఆక్రమణలు పోగా ప్రస్తుతం యూజీసి లెక్కల ప్రకారం ప్రస్తుతం 1800 ఎకరాల భూములు మాత్రమే ఉన్నాయి. అయితే అందులో తాజాగా 400 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఇక యూనివర్సిటీకి మిగిలేది 1400 ఎకరాల భూములు మాత్రమే. ఈ భూముల్లో మష్ రూమ్ రాక్ వంటి రెండువేల సంవత్సరాల క్రితం చరిత్రాత్మక ఆనవాళ్లతోపాటు, జీవవైవిద్యానికి ప్రతీకగా నిలిచిన ఈ భూములను ప్రభుత్వం ఐటీ సంస్దలకు కేటాయిచడం సరికాదంటూ విద్యార్ది సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు, ఇటీవల ఈ భూములు తెలంగాణ రాష్ట్ర మౌళిక సదుపాయాల సంస్దకు (టిజిఐఐసి) కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు యూనివర్సిటీ విద్యార్దులు.

హెచ్.సి.యు. భూములపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందా..?

హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ లో 400 ఎకరాల వివాదాస్పద భూములపై ప్రభుత్వం వాదన మరోలా ఉంది. ఈ భూములకు , సెంట్రల్ యూనివర్సిటీకి అస్సలు సంబంధంలేదంటున్నారు తెలంగాణ సిఎం , మంత్రులు. కంచెగచ్చిబౌలిలోని సర్వేనెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూములు 2003లోనే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్ ఏర్పాటుకు కేటాయించింది. ఆ భూముల్లో అప్పట్లో ప్రాజెక్టు ప్రారంభించపోాాగా, నిబంధనలు ఉల్లంఘించడంతో 2006లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐఏంజీకి కేటాయించిన జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో రద్దుపై

ఐఏంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించగా 2024 మార్చి 7న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్దిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తిరిగి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఐఏంజీ భారత్ సుప్రీం కొోర్టుకు వెళ్లింది. 2024 మే 3న ఐఏంజీ భారత్ పిటీషన్  ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.దీంతో ఎట్టకేలకు సెంట్రల్ యూనివర్సిటిలోని 400 ఎకరాలు భూములు తిరిగి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోొకి వచ్చాయి అంటోంతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు ఈ భూములకు అటవీశాఖకు అస్సలు సంబంధంలేదంటోంది. 

వివాదాస్పద భూముల్లో ప్రభుత్వం ఏం చేయబోతోంది..?

గత ఏడాది సుప్రీం కోర్టు తీర్పుతో భూములపై హక్కులు సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ 26న టిజిఐఐసికి ఈ  భూములు కేటాయిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ భూముల్లో పికాక్ లేక్ , బఫెలో లేక్ వంటివి లేవని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ 400 ఎకరాల భూముల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుతోపాటు ప్రపంచస్దాయి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు సిద్దమైయ్యింది. ప్రతిపక్షాలు మాత్రం విద్యార్దుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నాయి. కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతోపాటు విద్యార్దుల డిమాండ్ రాష్ట్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలిని కోరుతున్నప్పటికీ ,రాష్ట్ర ప్రభుత్వం ఎవరెలా స్పందించినా మేము మాత్రం భూముల విషయంలో వెనక్కు తగ్గబోమంటూ తేల్చి చెప్పేస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget