అన్వేషించండి

Republic Day 2022: జాంటీ రోడ్స్‌కు మోదీ లేఖ! ఇండియాకు నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ప్రశంస

గణతంత్ర దినోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ కొందరు విదేశీయులను అభినందించారు. భారత్‌ పట్ల వారు పెంచుకొన్న మమకారం, అనుబంధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జాంటీ రోడ్స్‌కు లేఖ రాశారు.

దేశ ప్రజలు 73వ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకలా జరుపుకుంటున్నారు. కరోనా కోరలు చాస్తున్నా కట్టుదిట్టమైన ఆంక్షలు పాటిస్తూ జెండా వందనం చేశారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ కొందరు విదేశీయులను అభినందించారు. భారత్‌ పట్ల వారు పెంచుకొన్న మమకారం, అనుబంధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌, ప్రపంచంలోనే అద్భుతమైన ఫీల్డర్‌ జాంటీ రోడ్స్‌ను మోదీ కొనియాడారు. అతడీ దేశానికి నిజమైన ప్రచారకర్త అని వెల్లడించారు.

మైదానంలో చిరుతలా పరుగెత్తుతూ.. పక్షిలా గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకొనే జాంటీ రోడ్స్‌ను ఎవరూ మర్చిపోలేరు. తొంభయ్యోవ దశకంలో అతడి ఫీల్డింగ్‌ చూసి ప్రపంచమే అబ్బురపడింది. ఫీల్డింగ్‌ చేస్తే అతడిలా ఉండాలని క్రికెట్‌ ప్రపంచం సరికొత్త ప్రమాణాలు నిర్దేశించింది. నిజానికి జాంటీకి భారతదేశమంటే ఎంతో ఇష్టం. ఇక్కడి సంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలను ఎంతో ప్రేమిస్తాడు. ఈ దేశానికి వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక హిందూ సంప్రదాయం నేర్చుకుంటూనే ఉంటాడు. యజ్ఞాలు, యాగాలు చేయించాడు. తన కుమార్తెకు 'ఇండియా' అని పేరు పెట్టాడు.

టీమ్‌ఇండియాతో మ్యాచుల కోసం జాంటీరోడ్స్‌ చాలాసార్లు ఇక్కడికి వచ్చాడు. అంతేకాకుండా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఫీల్డింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. గతేడాది అతడు పంజాబ్‌ కింగ్స్‌కు మారాడు.

'భారతదేశ మిత్రులైన మీకు, మరికొందరికి నేనీ లేఖ రాస్తున్నాను. భారత్‌ పట్ల మీ అనుబంధం, ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా దేశం, మా ప్రజలతో మీరిలాగే కలిసి పనిచేస్తారని నా విశ్వాసం. కొన్నేళ్లుగా మీరు భారతదేశం, ఇక్కడి సంస్కృతి పట్ల ప్రేమ పెంచుకొన్నారు. ఈ జాతి పేరును ప్రతిబింబించేలా ఇండియా అని మీ కుమార్తెకు పేరు పెట్టడం మీ ఇష్టాన్ని తెలియజేస్తోంది. మీరు నిజంగా మా దేశానికి నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్‌. మన దేశాల మధ్య ఇలాగే సత్సంబంధాలు కొనసాగాలి. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిమ్మల్ని కలిసి మాట్లాడేందుకు ఎదురు చూస్తుంటాను' అని జాంటీకి మోదీ లేఖ రాశారు.

'నరేంద్ర మోదీజీ.. ప్రేమపూర్వక మీ మాటలకు ధన్యవాదాలు. భారతదేశానికి వచ్చిన ప్రతిసారీ వ్యక్తిగా నేనెంతో ఎదిగాను. భారతీయులు అందరితో పాటు మా కుటుంబం అంతా  గణతంత్ర వేడుకలను జరుపుకుంటోంది. భారతీయుల హక్కులను కాపాడుతున్న రాజ్యాంగాన్ని మేమెంతో గౌరవిస్తున్నాం' అని మోదీకి జాంటీ బదులిచ్చారు. భారతీయులు జరుపుకొనే ప్రతి పండుగను జాంటీ జరుపుకుంటాడు. దీపావళిని జరుపుకున్న వీడియోలు, చిత్రాలను అతడు సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు.

Also Read: Yuvraj Blessed with Baby: ఫ్యాన్స్‌కు యువరాజ్ గుడ్‌న్యూస్.. తండ్రి అయ్యానని పోస్ట్ చేసిన మాజీ ఆల్ రౌండర్

Also Read: IND vs WI: విండీస్‌ సిరీసుకు ఈ వారమే జట్టు ఎంపిక! రోహిత్‌ ఫిట్‌నెస్‌ టెస్టు సంగతేంటి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget