అన్వేషించండి

Borugadda Anil Kumar: హైకోర్టు సీరియస్, రాజమండ్రి జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్

Andhra Pradesh News | మద్యంతర బెయిల్ గడువు ముగియడంతో గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయారు. హైకోర్టు ఉత్తర్వులతో ఆయన లొంగిపోయాడని తెలుస్తోంది.

రాజమహేంద్రవరం: వైసీపీ సానుభూతిపరుడు, గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ (Borugadda Anil Kumar) వ్యవహారం కొలిక్కి వచ్చింది. మద్యంతర బెయిల్ గడువు మంగళవారం (మార్చి 11న) సాయంత్రం ముగియగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు (Rajamahendravaram Central Jail)లో బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. మద్యంతర బెయిల్ పొందేందుకు ఫేక్ సర్టిఫికెట్ పెట్టారన్న ఆరోపణలు రావడంతో బోరుగడ్డ లొంగిపోతాడా లేదా అని రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో హైకోర్టు సీరియస్ అయింది. గడువులోగా లొంగిపోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంటక జ్యోతిర్మయి ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో బోరుగడ్డ మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత జైలు అధికారుల వద్ద లొంగిపోయాడు. 

వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ లపై దుర్భాషలాడడం, చంపేస్తానంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. బోరుగడ్డపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కాగా విచారణ కొనసాగుతోంది. కొన్ని కేసుల్లో బెయిల్ రాగా, అనంతపురం నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ అయిన బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు.

ఫేక్ సర్టిఫికెట్స్ ఆరోపణలు

అయితే తన తల్లికి అనారోగ్యంగా ఉందనీ, ఆమెకు చూపిస్తే చేయించాలని కోరుతూ హైకోర్టు నుంచి బోరుగడ్డ మద్యంతర బెయిల్ పొందాడు. ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి అటు కోర్టును, ఇటు పోలీసులను వేరే కొట్టించాడని ఆరోపణలు వచ్చాయి. గుంటూరు డాక్టర్ మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చారంటూ బోరుగడ్డ అనిల్ కుమార్ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ పై దుమారం రేగింది. రేపు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి బోరుగడ్డ మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

తల్లికి అనారోగ్యంతో మద్యంతర బెయిల్!
తన తల్లి పద్మావతికి గుండె జబ్బు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోందని బోరుగడ్డ హైకోర్టుకు తెలిపారు. కుమారుడ్ని తాను ఒక్కడినేనని, తల్లికి చికిత్స కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని ఫిబ్రవరి 14న పిటిషన్ వేశాడు. తల్లి అనారోగ్యంపై మెడికల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేశాడు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాస్ రెడ్డి బోరుగడ్డకు ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మద్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఫిబ్రవరి 28న బోరుగడ్డ జైలు సూపరిండెంట్ వద్ద లొంగిపోయాడు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స చేపించానని, కానీ తల్లిని చూసుకునేందుకు తాను ఒక్కడినే ఉన్నానని కోరగా.. హైకోర్టు మార్చి 11 వరకు మద్యంతర బెయిల్ పొడిగించింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా రాజమహేంద్రవరం జైలులో లొంగిపోయాలని ఉత్తర్వులలో పేర్కొంది.

బోరుగడ్డ అనిల్ కుమార్ ఫేక్ మెడికల్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి బెయిల్ తీసుకుని పరారయ్యాడని ప్రచారం జరిగింది. దర్యాప్తు చేపట్టిన గుంటూరు పోలీసులు డాక్టర్ ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని చెప్పారు. అయితే ఈ వివాదం కొనసాగుతుండగానే ఇటీవల బోరుగడ్డ ఓ వీడియో విడుదల చేశారు. తన తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని, ఆమెను చూసుకోవడానికే మధ్యంతర బెయిల్ తీసుకున్నానని తెలిపారు. ఎక్కడికి పారిపోలేదని, తప్పుడు పత్రాలు కూడా సబ్మిట్ చేయలేదన్నాడు. కోర్టు తీర్పును తాను ధిక్కరించబోనని, గౌరవిస్తానని చెప్పాడు. తనకుగానీ, తల్లి, చెల్లెళ్లు, వారి కుటుంబాలకు ఏమైనా జరిగితే నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబుదే పూర్తి బాధ్యత అని బోరుగడ్డ అనిల్ కుమార్ తన వీడియోలో పదే పదే పేర్కొన్నాడు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Ayatollah Khomeini trap Story: సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
Embed widget