అన్వేషించండి

Borugadda Anil Kumar: హైకోర్టు సీరియస్, రాజమండ్రి జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్

Andhra Pradesh News | మద్యంతర బెయిల్ గడువు ముగియడంతో గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయారు. హైకోర్టు ఉత్తర్వులతో ఆయన లొంగిపోయాడని తెలుస్తోంది.

రాజమహేంద్రవరం: వైసీపీ సానుభూతిపరుడు, గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ (Borugadda Anil Kumar) వ్యవహారం కొలిక్కి వచ్చింది. మద్యంతర బెయిల్ గడువు మంగళవారం (మార్చి 11న) సాయంత్రం ముగియగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు (Rajamahendravaram Central Jail)లో బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. మద్యంతర బెయిల్ పొందేందుకు ఫేక్ సర్టిఫికెట్ పెట్టారన్న ఆరోపణలు రావడంతో బోరుగడ్డ లొంగిపోతాడా లేదా అని రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో హైకోర్టు సీరియస్ అయింది. గడువులోగా లొంగిపోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంటక జ్యోతిర్మయి ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో బోరుగడ్డ మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత జైలు అధికారుల వద్ద లొంగిపోయాడు. 

వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ లపై దుర్భాషలాడడం, చంపేస్తానంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. బోరుగడ్డపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కాగా విచారణ కొనసాగుతోంది. కొన్ని కేసుల్లో బెయిల్ రాగా, అనంతపురం నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ అయిన బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు.

ఫేక్ సర్టిఫికెట్స్ ఆరోపణలు

అయితే తన తల్లికి అనారోగ్యంగా ఉందనీ, ఆమెకు చూపిస్తే చేయించాలని కోరుతూ హైకోర్టు నుంచి బోరుగడ్డ మద్యంతర బెయిల్ పొందాడు. ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి అటు కోర్టును, ఇటు పోలీసులను వేరే కొట్టించాడని ఆరోపణలు వచ్చాయి. గుంటూరు డాక్టర్ మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చారంటూ బోరుగడ్డ అనిల్ కుమార్ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ పై దుమారం రేగింది. రేపు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి బోరుగడ్డ మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

తల్లికి అనారోగ్యంతో మద్యంతర బెయిల్!
తన తల్లి పద్మావతికి గుండె జబ్బు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోందని బోరుగడ్డ హైకోర్టుకు తెలిపారు. కుమారుడ్ని తాను ఒక్కడినేనని, తల్లికి చికిత్స కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని ఫిబ్రవరి 14న పిటిషన్ వేశాడు. తల్లి అనారోగ్యంపై మెడికల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేశాడు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాస్ రెడ్డి బోరుగడ్డకు ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మద్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఫిబ్రవరి 28న బోరుగడ్డ జైలు సూపరిండెంట్ వద్ద లొంగిపోయాడు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స చేపించానని, కానీ తల్లిని చూసుకునేందుకు తాను ఒక్కడినే ఉన్నానని కోరగా.. హైకోర్టు మార్చి 11 వరకు మద్యంతర బెయిల్ పొడిగించింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా రాజమహేంద్రవరం జైలులో లొంగిపోయాలని ఉత్తర్వులలో పేర్కొంది.

బోరుగడ్డ అనిల్ కుమార్ ఫేక్ మెడికల్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి బెయిల్ తీసుకుని పరారయ్యాడని ప్రచారం జరిగింది. దర్యాప్తు చేపట్టిన గుంటూరు పోలీసులు డాక్టర్ ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని చెప్పారు. అయితే ఈ వివాదం కొనసాగుతుండగానే ఇటీవల బోరుగడ్డ ఓ వీడియో విడుదల చేశారు. తన తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని, ఆమెను చూసుకోవడానికే మధ్యంతర బెయిల్ తీసుకున్నానని తెలిపారు. ఎక్కడికి పారిపోలేదని, తప్పుడు పత్రాలు కూడా సబ్మిట్ చేయలేదన్నాడు. కోర్టు తీర్పును తాను ధిక్కరించబోనని, గౌరవిస్తానని చెప్పాడు. తనకుగానీ, తల్లి, చెల్లెళ్లు, వారి కుటుంబాలకు ఏమైనా జరిగితే నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబుదే పూర్తి బాధ్యత అని బోరుగడ్డ అనిల్ కుమార్ తన వీడియోలో పదే పదే పేర్కొన్నాడు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Health Condition: పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!
కొత్త కారు కొనేవాళ్లు కాస్త ఓపిక పట్టండి - మారుతి బ్రెజ్జా సరికొత్తగా వస్తోంది
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Embed widget