BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
Telangana: అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

KCR: అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. * బి ఆర్ ఎస్ పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలని ..తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఆ సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎక్కడా వెనక్కి తగ్గవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాల్సిందేనన్నారు. బి ఆర్ ఎస్ మీద రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సమస్యలపై ప్రభుత్వంపై యుద్ధం
రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు....ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరత పై అసెంబ్లీ లో, మండలి లో పోరాడాలన్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని.. రాష్ట్రం లో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరు పై... మాట్లాడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్... డి ఎ ల పెండింగు... పీఆర్సీ అమలు పై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు.
గ్యారంటీలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం నిలదీత
మహిళలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని కొట్లాడాలి. ఆరు గ్యారంటీ ల అమలు లో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలన్నారు. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు విడుదలచేయక పోవడం గురించి.. వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలపైనా మాట్లాడాలన్నారు. ప్రహజసమస్యలపై ఎండగట్టాలని దళిత బంధును నిలిపివేయడం పట్ల ప్రశ్నించాల్సిందేన్నారు. గొర్రెల పెంపకం.. చేపల పంపిణీ సమగ్ర అమలు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బి ఆర్ ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని పశ్నించాలని అధినేత కేసీఆర్ సమావేశంలో దిశా నిర్దేశం చేశారు.
డిప్యూటీ లీడర్లను నియమిస్తామన్న కేసీఆర్
అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఎల్పీ సమావేశం పలు అంశాలను చర్చించింది. ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. సభల్లో ఇంకా ప్రతిభావంతంగా ప్రజాసమస్యల మీద పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ సభకు తాను హాజరవుతానని ఎక్కడా చెప్పకపోవడం విశేషం. గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

