అన్వేషించండి

Porsche Car Accident Case: పూణెలో పోర్షే కారు కేసు, బ్లడ్ శాంపిల్స్ మార్చిన ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్

Porsche Car Accident News: పూణె కారు యాక్సిడెంట్ కేసులో నిందితుడిని రక్షించేందుకు తన తండ్రి శాయశక్తులా ప్రయత్నించాడు. ఈక్రమంలో బ్లడ్ శాంపిల్స్ మార్చేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేశాడు.

Porsche Car Accident Case: పూణెలోని పోర్షే కారు హిట్ అండ్ రన్ కేసులో  ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశారు. తన కొడుకును కేసు నుంచి రక్షించడానికి తండ్రి తన శాయశక్తులా ప్రయత్నించాడు. నిందితుడు మైనర్ రక్త పరీక్షకు ముందు బిల్డర్ విశాల్ అగర్వాల్ డాక్టర్‌కు 14 సార్లు ఫోన్ చేశాడు. అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.  ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ప్రభుత్వ ససూన్ ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ అజయ్ తావ్డే నిందితుడి తండ్రి విశాల్‌తో 14 సార్లు ఫోన్‌లో మాట్లాడారు. బ్లడ్ శాంపిల్ మార్చే విషయమై ఈ సంభాషణ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరీక్షల కోసం నమూనాలను తీసుకెళ్తున్నప్పుడు..  నిందితుడి తండ్రి డాక్టర్ తావ్డేకు 14 సార్లు ఫోన్ చేశాడు. ఈ ప్రమాదానికి కారణమైన మైనర్ బ్లడ్ శాంపిల్స్ మార్చినట్లు ఆరోపణలు రావడంతో సా సూన్ జనరల్ ఆస్పత్రి కి చెందిన డా. అజయ్ తవార్, డా. శ్రీహరి హాల్నోర్ లను బుధవారం సస్పెండ్ చేశారు.  ఈ కేసులో వీరితోపాటు మరో ఇద్దరు ఆస్పత్రి సిబ్బందిని సోమవారమే పోలీసులు అరెస్ట్ చేశారు.

సీన్ రీ క్రియేషన్ లో ఏఐ సాయం
ఇప్పుడు బుధవారం ఉదయం పూణే క్రైమ్ బ్రాంచ్ డాక్టర్ అజయ్ తవార్ ఇంటిపై దాడి చేసింది. శాంపిల్‌ను మార్చేందుకు డాక్టర్ అజయ్ తవార్.. మైనర్ తండ్రి విశాల్ అగర్వాల్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు క్రైమ్ బ్రాంచ్ అనుమానిస్తోంది. ఇప్పుడు ఈ పూణే హిట్ అండ్ రన్ కేసును పరిష్కరించడంలో ఏఐ సాయం తీసుకోనున్నారు.  పూణే పోర్స్చే కారు ప్రమాద దృశ్యాన్ని రీక్రియేషన్ చేయడానికి పూణే పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించనున్నారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సన్నివేశాన్ని రీ క్రియేషన్ చేసేటప్పుడు వాహనాలు, రోడ్లకు సంబంధించిన కేంద్ర ఏజెన్సీల సహాయం కూడా తీసుకోనున్నారు.

ఇద్దరు డాక్టర్ల అరెస్ట్
 పూణె పోలీసులు ఇప్పటికే తవార్ ను అరెస్ట్ చేశారు. ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీహరి హాల్నోర్, సిబ్బంది అతుల్ ఘట్కాంబ్లేను కూడా పోలీసులు మే 19న అరెస్టు చేశారు. మైనర్ శాంపిల్‌ను డస్ట్‌బిన్‌లో విసిరి, మరొక వ్యక్తి నమూనాతో మార్పిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.  మే 19న పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో మద్యం మత్తులో విశాల్ అగర్వాల్  కుమారుడు తన పోర్షే కారుతో మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు ఐటీ నిపుణులు మృతి చెందారు. ప్రమాదానికి ముందు మైనర్ రెండు పబ్బులకు వెళ్లి మద్యం సేవించినట్లు తేలింది.

సంభాషణ ఎప్పుడు, ఎలా జరిగింది?
డాక్టర్ అజయ్ తవార్ విశాల్ అగర్వాల్ మధ్య మొదటి సంభాషణ రాత్రి 8.45 గంటలకు జరిగిందని అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల వరకు ఇద్దరి మధ్య దాదాపు 14 సంభాషణలు జరిగాయి. కొన్నిసార్లు వాట్సాప్ కాల్స్ ద్వారా, కొన్నిసార్లు ఫేస్ టైమ్ ద్వారా..  కొన్నిసార్లు సాధారణ కాల్స్ ద్వారా మాట్లాడుకుంటూనే ఉన్నారు. పూణే పోలీసులు జరిపిన సోదాల్లో తవార్ ఇంటి నుంచి మునుపటి కేసులకు సంబంధించిన కొన్ని పత్రాలు లభించాయని అధికారులు తెలిపారు. వీటిపై తవార్ ను పోలీసులు విచారిస్తున్నారు. డాక్టర్ అజయ్ తవార్ కు విశాల్ అగర్వాల్ కుటుంబం  పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని హామీ ఇచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి. అజయ్ తవార్ తనకు మద్యం తీసుకురావాలని ఆసుపత్రి సిబ్బందిని తరచూ అడిగేవాడిని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

డీల్ ఖరీదు ఎంత?
పోర్షే కారు యాక్సిడెంట్‌లో మైనర్ నిందితుడి బ్లడ్ శాంపిల్ స్థానంలో మరో వ్యక్తి రక్త నమూనాను ఇవ్వడానికి సాసూన్ ఆసుపత్రికి లంచం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ మొత్తం ఎంత అనేది విచారణలో తేలాల్సి ఉంది. నిందితుడైన వైద్యులను కలవడానికి ఎవరు వచ్చారో తెలుసుకోవడానికి పోలీసులు ససూన్ ఆసుపత్రిలోని సిసిటివి కెమెరాలు ..  దాని డివిఆర్ నుండి ఫుటేజీని రికవరీ చేస్తున్నారు. ప్రస్తుతం,అజయ్ తవార్, ఇతర వైద్యులు మే 30 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Ram Charan Upasana: రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs nz First Half Highlights | Champions Trophy 2025 Final లో భారత్ దే ఫస్ట్ హాఫ్ | ABP DesamInd vs NZ CT Final 2025 | అప్పుడు అంతా బాగానే ఉంది..కానీ ఆ ఒక్క మ్యాచ్ తో కోలుకోలేని దెబ్బ తిన్నాంInd vs Nz Champions Trophy 2025 Final | MS Dhoni కథకు క్లైమాక్స్ ఈరోజే | ABP DesamInd vs Nz Champions Trophy Final Preview | మినీ వరల్డ్ కప్పును ముద్దాడేది ఎవరో..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Ram Charan Upasana: రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
Telangana Latest News: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
Prabhas Prashanth Varma Movie: బ్రహ్మ రాక్షస కాదు... ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు కొత్త టైటిల్
బ్రహ్మ రాక్షస కాదు... ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు కొత్త టైటిల్
BRS: 11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
Embed widget