Telugu breaking News: రూ. 2,75,891 కోట్లతో తెలంగాణ ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్- సభ ముందు ఉంచిన ప్రభుత్వం
Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE

Background
మూసీ ఆధునీకరణకు వెయ్యి కోట్లు
ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు
వైద్య రంగానికి 11,500 కోట్లు కేటాయింపు
త్వరలో 15వేల మంది కానిస్టేబుళ్ళ నియామకాలు
TSPC నిర్వాహణకు 40 కోట్లు కేటాయింపు
ఆరు గ్యారంటీల అమలుకు 53,196 కోట్లు కేటాయింపు
హైదరాబాద్ మెడలో అందమైన హారంగా మూసీ నది
మూసీ ఆధునీకరణకు వెయ్యి కోట్లు
త్వరలోనే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ
ఐటీ రంగం మరింత వృద్ధి చెందేలా చర్యలు
ఐటీ పరిశ్రమలు ఇతర జిల్లాలకు విస్తరణ
Telangana Budget 2024: గద్దర్ను గౌరవించడం అంటే ప్రజాగాయకులకు దక్కిన గౌరవం
ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇక నుంచి నంది అవార్డును గద్దర్ అవార్ పేరుతో చిత్ర, టీవీ కళాకారులకు అందచేయనున్నామన్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ కు ఇదే తాము ఇచ్చే నివేళి అన్నారు. గద్దర్ను గౌరవించడం అంటే తెలంగాణ సంస్తృతిని, ప్రగతిల భావజాలంతో సమాజాన్ని చైతన్య పరిచే ప్రజా కవులు, ప్రజా గాయకులను గౌరవించడమే అన్నారు.
Telangana Budget 2024: శాంతి భద్రతల పరిరక్షణే ప్రథమ కర్తవ్యం
రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అన్నారు భట్టి. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నిరాటకంగా అందించ్ అవకాశం ఉంటుంది. గత ఐదేళ్లు సంవత్సరాలుగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగం ఎక్కువైందజి. ఎంతో మంది యువతీ యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఇది ఏ మాత్రం ఉపేక్షించే అంసం కాదన్నారు.
అందుకే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. రాష్ట్రంలో గత నెలరోజులుగా మన పోలీసులు, ఆబ్కారీ అధికారులు దాడుల్లో పెద్ద మొత్తంలో పట్టుకున్న గంజాయి ఇతర మాదక ద్రవ్యాలే మా కార్యచరణకు నిదర్శనం అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక బృందాలకు అవసరమైన నిధులను సిబ్బందిని కేటాయించాం. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం అనే మాట ఉత్పన్న కాకూడదన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి మాదక ద్రవ్యాల మహమ్మారి బారిన పడకుండా తెలంగాణ యువతను కాపాడుతున్నామన్నారు. ఈ నెల 4 వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంల హుక్కా బార్లను కూడా నిషేదించామన్నారు.
ఎంతో కాలంగాణ పెండింగ్లో ఉన్న నూతన హైకోర్టు భవన సముదాయానికివంద ఎకరాల స్థలాన్ని కేటాయమైంది. న్యాయవ్యవస్థ పటిష్ఠతకు మేం తీసుకుంటున్న చర్యతో దేశ మొత్తం తెలంగాణ వైపు చూసతుడటంతో సందేహం లేదు.
Telangana Budget 2024: ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశ పెట్టడానికి కారణమేంటీ?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే తొలి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా ప్రవేశ పెట్టడం అయిష్టంగా ఉందన్నారు భట్టి. కేంద్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకువాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉంది. దానిలో భాాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసే నిధులు సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఉపయోగించుకోవాలనే స్పష్టత ఉంది. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్థి స్థాయి బడ్జెట్లో వివిధ రంగావారిగా కేటాయింపులు జరిగినప్పుడే, మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనేది అంచనా వేయగలుగుతామన్నారు. అందువల్లే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశ పెట్టినప్పుడే రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించామన్నారు.
Telangana Budget 2024: ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యం
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశ పెడతుందన్నారు. ఈ బడ్జెట్ లక్ష్యం ఒక్కటే అన్నారు. తెలంగాణ రాష్ట్ర మొత్తం సమగ్రంగా అభివద్ధి చేయడమే అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించిన విధంగా ఆరు గ్యారంటీలను తూజా తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీనులను అభివృద్ధి చేస్తామన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

