అన్వేషించండి

Gutha Sukhender Reddy: కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

Caste Census in Telangana | తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసల జల్లులు కురిపించారు.

Telangana Caste Census | నల్గొండ:  దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో సామాజిక , ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే ( Comprehensive Family Survey) నిర్వహించడం చారిత్రాత్మకం అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితాకు, కుల గణన సర్వేలో తేలిన సమగ్ర సర్వేలో తేలిన లెక్కలకు అసలు పొంతన లేదన్నారు. కొందరికి రెండు చోట్ల ఓట్లు ఉండటం, కొందరు సర్వేలో పాల్గొనకపోవడం అందుకు కారణమన్నారు. 

ఓటర్ల జాబితాతో సర్వే నెంబర్లు మ్యాచ్ కావు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించని విధంగా 94, 863  ఎన్యుమరేటర్స్ , 9 628 సూపర్ వైజర్స్, 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లు 50  రోజుల్లో తెలంగాణలో సమగ్ర సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో 97 శాతం రాష్ట్ర ప్రజలు పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా చేసుకుని సర్వే లెక్కలు సరిగ్గా లేవనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓటర్ లిస్టుకి , సమగ్ర సర్వే లెక్కలకు కచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. కొందరు వ్యక్తులు 2 చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఓటర్ లిస్ట్ ఆధార్ కి అనుసంధానం చేస్తే లెక్కలు కాస్త మ్యాచ్ అవుతాయి. రాజకీయ ప్రయోజనాల కోసం సమగ్ర, కులగణన (Caste Census) సర్వే లెక్కలు తప్పుడు జాబితా అని విమర్శలు చేయడం సరికాదు. ప్రభుత్వం చేసిన పనిని పార్టీలకు అతీతంగా ఎవరైనా అభినందించాలి . 

రాజకీయాల్లో నైతిక విలువలు పాటించడం అవసరం. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం ఎవరికీ మంచిది కాదు. 3 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు. సర్వే కోసం వచ్చిన అధికారులకు వారు వివరాలు ఇవ్వలేదు. అలాంటి వారు సైతం ఇప్పుడు అధికారులకు తమ వివరాలు ఇవ్వవచ్చు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన అధికారులతో పాటు సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 

ఇచ్చిన మాట ప్రకారం సర్వే

గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు కొతత రేషన్ కార్డులను ఇస్తుంది. BPL, APL  కార్డ్స్ సైతం ఇవ్వాలని నేను సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశాను. దీనిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. BPL, APL కార్డ్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ 2 ఎకరాల వరకు రైతు భరోసా నగదు అందించింది. రైతుల ఖాతాల్లో ఎకరాకు 6 వేల చొప్పున జమ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. కనుక కోర్ట్ ప్రకటనపై స్పందించను. నాకు రాజకీయాలకు సంబంధం లేదు. కానీ కుల , మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఎవరు మాట్లాడిన అది తప్పే. బీసీలు, అగ్రకులాల మధ్య విద్వేషాలు పెంచేలా మాట్లాడం సరికాదు. మరోవైపు మదర్ డైరీ ఆస్తులు అమ్మడం సరికాదని నా అభిప్రాయం. ఆస్తులు అమ్మడం ఎప్పటికీ సరైన పరిష్కారం కాదు. సంస్థను మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు’ గుత్తా సుఖేందర్ రెడ్డి.

Also Read: Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget