అన్వేషించండి

Beer Price Hike: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన బీర్ల ధరలు - ఒకేసారి అంత పెంచారా!

Telangana Beer Price Increase: తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి. బీర్లపై ఏకంగా 15 శాతం ధరలు పెరగడంతో మందుబాబులు షాకవుతున్నారు.

Beer Price Increase In Telangana: హైదరాబాద్‌: మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాక్‌ ఇచ్చింది. ఏకంగా బీర్ల ధరలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. బీర్ల ధరల పెంపు మంగళవారం (ఫిబ్రవరి 11) నుంచే అమల్లోకి రానుందని ఉత్తర్వులలో తెలిపారు. ధరల నిర్ణయ కమిటీ సూచనల మేరకు ధరల పెంపునకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కో బీరుపై రూ.20 నుంచి రూ.30 వరకు ధర పెరిగింది. ఇటీవల మందుబాబులు పోరాడి కింగ్ ఫిషర్ బీర్లు సాధించుకున్నారు. కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఉండదని, వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కానీ అంతలోనే ధరల పెపుతో బీర్ ప్రియలుకు షాకిచ్చారు.

అన్నిరకాల బ్రాండ్ల బీర్లపై 15 శాతం ప్రాథమికంగా ధర పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. దీని ప్రకారం ప్రస్తుతం రూ.150 ఉన్న లైట్ బీర్ ధర రూ.170, రూ.180 వరకి పెరగనుంది. స్ట్రాంగ్‌ బీరు అయితే రూ.160 నుంచి రూ.190కి ధరలు పెరగనున్నాయి. అయితే పాత స్టాకు బీర్లకు మాత్రం పాత రేటకే విక్రయించాలని ఎక్సైజ్ శాఖ సూచించింది. సాధారణంగా పాటించే రౌండింగ్‌ అఫ్‌ పద్ధతి ప్రకారం తెలంగాణలో మద్యం ధరలు పెరుగుతున్నాయని ఎక్సైజ్‌ వర్గాలు వెల్లడించాయి. 

మంత్రి అలా అన్నారు.. కానీ ధరలు పెరిగాయి..

ప్రజలపై భారం పడేందుకు అంగీకరించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల చెప్పారు. కానీ అంతలోనే తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరల పెంపునకు అనుమతి ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల ఎక్సైజ్ శాఖ సమావేశంలో కొత్త బ్రాండ్ల బీర్లకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ నేతల బినామీలకు చెందిన కంపెనీలతో కొత్త బీర్లు తీసుకొస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 

Also Read: Andhra Pradesh Liquor Rates:ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ 

ఏపీలో మధ్యం ధరలు పెరిగాయి. క్వార్టర్ లేదా హాఫ్ లేదా ఫుల్ బాటిల్ అనేది సంబంధం లేకుండా, బ్రాండులతో కూడా సంబంధం లేకుండా రూ.10 చొప్పున పెంచినట్లు ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. బీరు, రూ 99 మద్యంపై మాత్రం ప్రస్తుతానికి పెంపు లేదని స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget