అన్వేషించండి

Andhra Pradesh Polling Updates: నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం

Andhra Pradesh News: నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై వైసీపీ నేతలు దాడి చేశారు. నేతలు వెళ్తున్న ప్రతి చోట వైసీపీ లీడర్లు అడ్డుకోవడం ఉద్రిక్తతకు కారణం అవుతోంది.

 Narsaraopet And Vijayawada News: కృష్ణా , గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. పోలింగ్ కేంద్రాలను సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న నేతలపై ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కవ్వింపు చర్యలు దిగుతున్నారు. ఇది పరిస్థితిని హీటెక్కిస్తోంది. 
పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయులు టీంపై వైసీపీ లీడర్లు దాడి చేశారు. దొండపాడులోని పోలింగ్ సరళి పరిశీలించేందుకు వెళ్లిన ఆయనపై వైసీపీ లీడర్లు మూకుమ్మడిగా దాడి చేశారు. ఆయన కార్లు ధ్వంసం చేశారు. 


Andhra Pradesh Polling Updates: నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై  వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం

వైసీపీ దాడితో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అక్కడే ఉన్న అడ్డుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు ఛాన్స్ లేదని... అంతా ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేశారు. 


Andhra Pradesh Polling Updates: నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై  వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం

లావుకృష్ణదేవరాయులపై దాడిని టీడీపీ నేతలు ఖండించారు. ఈ దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఓడిపోతున్నామనే భయంతోనే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు. 


Andhra Pradesh Polling Updates: నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై  వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం

ఎన్టీఆర్‌ జిల్లాలోని కంభంపాడు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌ల సందర్శనకు వెళ్లిన విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని(కేశినేని శివనాథ్‌) బృందంబై వైసీపీ లీడర్లు దాడి చేశారు. ఆయన వస్తున్న కార్లపై రాళ్ల దాడి చేశారు. 


Andhra Pradesh Polling Updates: నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై  వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం

ముందస్తు ప్లాన్ ప్రకారమే వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారని పోలీసులు మాత్రం నిలువరించే ప్రయత్నం చేయడం లేదని కేశినేని చిన్ని ఆరోపించారు. ఓడిపోతున్నామని తెలిసి ప్రజల్లో మద్దతు లేదని గ్రహించే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. ప్రజలంతా ఓటు వేసేలా పోలీసులు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. అక్కడ అభ్యర్థినే రాణించని వైసీపీ శ్రేణులు స్వేచ్ఛగా ఓటు వేసే ఛాన్స్ ఇస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటివి ఎన్నికల సంఘం గమనించాలని విజ్ఞప్తి చేశారు.  

ఓడిపోతున్నామనే భయంతో దౌర్జన్యాలు: పంచుమర్తి అనురాధ
ఓడిపోతున్నామనే భయంతో వైసీపీ నాయకులకు ఏమి చేయాలో తెలియక దౌర్జన్యాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమండ్ చేశారు. సోమవారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ" నాలుగున్నర ఏళ్లు ప్రజల్ని వైసీపీ నాయకులు తిన్నారు. ఈ రోజు కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర మా ఏజెంట్లపై దాడులు చేస్తున్నారు. ఓడిపోతున్నామని తెలిసిపోయి అర్థంకాని పరిస్థితుల్లో మా ఏజెంట్లపై దాడులు చేస్తున్నారు. 

చిత్తూరు జిల్లా పుంగనూరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో కోడాలి నాని అనుచరులు రౌడీలకే రౌడీలన్నట్లు హల్ చల్ చేశారు. ఓటర్ల తలుపులు బాది, అందరూ వైసీపీకే ఓటు వేయాలని ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారు.  

మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దైర్జన్యాలు, అరాచకాలే.  రెంటచింతలలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ శ్రేణుల దాడి చేశారు. ఇద్దరికి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు ఏజెంట్లు గాయపడ్డారు. పార్వతీపురంలో ఏకంగా రిగ్గింగ్ చేస్తున్నారు. వీటిపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలి" అని అనురాధ డిమాండ్ చేశారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
Chandramouli Last Rites: విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
Hyderabad local body MLC elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
Chandramouli Last Rites: విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
Hyderabad local body MLC elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
Sarangapani Jathakam Review - సారంగపాణి జాతకం రివ్యూ: 'కోర్ట్' విజయం తర్వాత ప్రియదర్శికి మరో హిట్ వచ్చిందా? జాతకాల పిచ్చి నవ్వించిందా?
సారంగపాణి జాతకం రివ్యూ: 'కోర్ట్' విజయం తర్వాత ప్రియదర్శికి మరో హిట్ వచ్చిందా? జాతకాల పిచ్చి నవ్వించిందా?
CM Chandrababu: నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
Indus Water Treaty: సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
IPL 2025 MS Dhoni 400th T20: అరుదైన ఘ‌నత ముంగిట ధోనీ.. స‌న్ రైజ‌ర్స్ తో నేటి మ్యాచ్ ధోనీకి ప్ర‌త్యేకం.. రోహిత్, కోహ్లీ స‌ర‌స‌న చేరనున్న త‌లా
అరుదైన ఘ‌నత ముంగిట ధోనీ.. స‌న్ రైజ‌ర్స్ తో నేటి మ్యాచ్ ధోనీకి ప్ర‌త్యేకం.. రోహిత్, కోహ్లీ స‌ర‌స‌న చేరనున్న త‌లా
Embed widget