అన్వేషించండి

Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ

Andhra Pradesh News | అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నాడు ఫోన్ చేశారు. రాష్ట్రంలో పౌక్ జాతీయులను గుర్తించి వారి దేశాలకు తిరిగి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.

Amit Shah Call to All CMs | న్యూఢిల్లీ: పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఉక్కుపాదం మోపుతోంది. ఇదివరకే పాక్ పౌరులు సంబంధించి వీసాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ పౌరులకు మొత్తం 17 రకాల వీసాలను హోం మంత్రిత్వ శాఖ రద్దు చేస్తూ షాకిచ్చింది. ఈ నిర్ణయానికి కొనసాగింపుగా హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ, తెలంగాణ సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేస్తున్న ఆయన.. పాక్‌ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు.

అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్‌ షా ఫోన్‌..

భారత ప్రభుత్వం సింధు నదీ జలాలపై 1960లో చేసుకున్న ఒప్పందంపై నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయాలని కేంద్రం ఇదివరకే సూచించింది. అటారీ, వాఘా సరిహద్దులను కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. ఈ క్రమంలో భారత్ నుంచి అందే అన్ని రకాల పాక్ వీసాలను రద్దు చేసినట్లు హోంశాఖ ప్రకటించింది. పాక్ పౌరులను ఆ దేశానికి తరలించాలన్న నిర్ణయంలో భాగంగా శుక్రవారం ఉదయం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా  ఫోన్‌ చేసి మాట్లాడారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాకిస్థాన్‌ జాతీయులను గుర్తించి, వారిని వెనక్కి పంపించేందుకు సాధ్యమైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని అమిత్ షా ఆదేశించారు. 

హైదరాబాద్ నగరంలో 208 మంది వరకు పాక్‌ జాతీయులు ఉన్నట్లు గుర్తించారు. అనధికారికంగా ఇంకా చాలా మంది ఉంటారన్న వాదన సైతం ఉంది. పాక్ పౌరులు రెండు రోజుల్లో భారత్ విడిచి తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే ఇతర ప్రాంతాలకు హైదరాబాద్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎంఐఎం లాంటి కీలక పార్టీకి హైదరాబాద్ కంచుకోట. దాంతో పాక్ పౌరులను గుర్తించి ఆ దేశానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయడం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కత్తిమీద సాము లాంటిదే. హైదరాబాద్‌లో ముస్లింలు అధికంగా ఉంటారు, అందులోనూ పాతబస్తీ లాంటి ప్రాంతం నుంచి కరెంట్ బిల్లులు లాంటి ప్రభుత్వం విధించే బిల్లులు చెల్లించే వారు ఉండరని పలు పార్టీల నేతలు ఆరోపిస్తుంటారు. అటువంటిది పాకిస్తాన్ పౌరులను గుర్తించి వారి దేశానికి తిరిగి అంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఉగ్రదాడికి మద్దతు తెలుపుతున్న పాకిస్తాన్

పాక్ తాము చేసిన తప్పులను గుర్తించకపోగా.. ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వమే కారణమని వాదిస్తోంది. మోదీ సర్కార్ పై వ్యతిరేకత వల్లే దేశంలోని భక్తులు ఉగ్రదాడి చేశాయని ఇటీవల పాక్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ మాట్లాడుతూ.. పహల్గాంలో దాడి చేసిన వారిన స్వాతంత్య్ర సమరయోధులుగా అభివర్ణించి అగ్గికి ఆజ్యం పోస్టున్నారు. సింధు జలాలు ఆపడం మీ తరం కాదు, అలా చేస్తే యుద్ధాన్ని ఆహ్వానించినట్లే అని.. తమకు హాని తలపెడితే భారత ప్రజలకు హాని చేస్తామని పాక్ ప్రభుత్వం సైతం హెచ్చరిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
KTR vs Kavitha political war: కవిత వర్సెస్ కేటీఆర్ - ఈ రాజకీయం బీఆర్ఎస్ పునాదుల్ని కదిలించబోతోందా?
కవిత వర్సెస్ కేటీఆర్ - ఈ రాజకీయం బీఆర్ఎస్ పునాదుల్ని కదిలించబోతోందా?
Breaking News: తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
Bandi Bhagirath Bail: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు ఊరట! పోక్సో కేసులో బెయిల్!
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు ఊరట! పోక్సో కేసులో బెయిల్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌
కేవలం రూ.10.49 లక్షలకే కొత్త నిస్సాన్ టెక్టాన్ - క్రెటా, సెల్టోస్‌కు కొత్త సవాల్
Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Benefits Of Matcha Tea: గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
Embed widget