అన్వేషించండి

Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ

Andhra Pradesh News | అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నాడు ఫోన్ చేశారు. రాష్ట్రంలో పౌక్ జాతీయులను గుర్తించి వారి దేశాలకు తిరిగి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.

Amit Shah Call to All CMs | న్యూఢిల్లీ: పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఉక్కుపాదం మోపుతోంది. ఇదివరకే పాక్ పౌరులు సంబంధించి వీసాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ పౌరులకు మొత్తం 17 రకాల వీసాలను హోం మంత్రిత్వ శాఖ రద్దు చేస్తూ షాకిచ్చింది. ఈ నిర్ణయానికి కొనసాగింపుగా హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ, తెలంగాణ సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేస్తున్న ఆయన.. పాక్‌ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు.

అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్‌ షా ఫోన్‌..

భారత ప్రభుత్వం సింధు నదీ జలాలపై 1960లో చేసుకున్న ఒప్పందంపై నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయాలని కేంద్రం ఇదివరకే సూచించింది. అటారీ, వాఘా సరిహద్దులను కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. ఈ క్రమంలో భారత్ నుంచి అందే అన్ని రకాల పాక్ వీసాలను రద్దు చేసినట్లు హోంశాఖ ప్రకటించింది. పాక్ పౌరులను ఆ దేశానికి తరలించాలన్న నిర్ణయంలో భాగంగా శుక్రవారం ఉదయం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా  ఫోన్‌ చేసి మాట్లాడారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాకిస్థాన్‌ జాతీయులను గుర్తించి, వారిని వెనక్కి పంపించేందుకు సాధ్యమైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని అమిత్ షా ఆదేశించారు. 

హైదరాబాద్ నగరంలో 208 మంది వరకు పాక్‌ జాతీయులు ఉన్నట్లు గుర్తించారు. అనధికారికంగా ఇంకా చాలా మంది ఉంటారన్న వాదన సైతం ఉంది. పాక్ పౌరులు రెండు రోజుల్లో భారత్ విడిచి తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే ఇతర ప్రాంతాలకు హైదరాబాద్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎంఐఎం లాంటి కీలక పార్టీకి హైదరాబాద్ కంచుకోట. దాంతో పాక్ పౌరులను గుర్తించి ఆ దేశానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయడం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కత్తిమీద సాము లాంటిదే. హైదరాబాద్‌లో ముస్లింలు అధికంగా ఉంటారు, అందులోనూ పాతబస్తీ లాంటి ప్రాంతం నుంచి కరెంట్ బిల్లులు లాంటి ప్రభుత్వం విధించే బిల్లులు చెల్లించే వారు ఉండరని పలు పార్టీల నేతలు ఆరోపిస్తుంటారు. అటువంటిది పాకిస్తాన్ పౌరులను గుర్తించి వారి దేశానికి తిరిగి అంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఉగ్రదాడికి మద్దతు తెలుపుతున్న పాకిస్తాన్

పాక్ తాము చేసిన తప్పులను గుర్తించకపోగా.. ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వమే కారణమని వాదిస్తోంది. మోదీ సర్కార్ పై వ్యతిరేకత వల్లే దేశంలోని భక్తులు ఉగ్రదాడి చేశాయని ఇటీవల పాక్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ మాట్లాడుతూ.. పహల్గాంలో దాడి చేసిన వారిన స్వాతంత్య్ర సమరయోధులుగా అభివర్ణించి అగ్గికి ఆజ్యం పోస్టున్నారు. సింధు జలాలు ఆపడం మీ తరం కాదు, అలా చేస్తే యుద్ధాన్ని ఆహ్వానించినట్లే అని.. తమకు హాని తలపెడితే భారత ప్రజలకు హాని చేస్తామని పాక్ ప్రభుత్వం సైతం హెచ్చరిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Formula E Case Adjourned: ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget