అన్వేషించండి

Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం

Pakistans Deputy PM Ishaq Dar | జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాకి పాల్పడిన నిందితులను స్వాతంత్య్ర సమరయోధులుగా పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ వ్యాఖ్యానించారు.

ఇస్లామాబాద్: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై పాకిస్తా్న్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాంతో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) చేసిన టెర్రరిస్టులను స్వాతంత్ర్య సమరయోధులుగా ఇషాక్ దార్ అభివర్ణించారు. అసలే ఈ ఉగ్రదాడితో పాకిస్తాన్ పై భారత్ మండిపడుతోంది. పాక్ ను ఏకాకి చేయాలని, తద్వారా బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం భావిస్తుంటే మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత హేయమైన కామెంట్లు చేస్తోంది.

పాక్ మీద భారత్ ఉక్కుపాదం..

ఇదివరకే పాకిస్తాన్ మంత్రి ఆ దాడితో మాకు సంబంధం లేదు. మోదీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో దేశంలోని శక్తులే జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడికి పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం పాక్ పై ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీసాలు రద్దు చేయడంతో పాటు పాక్ పౌరులు ఆ దేశానికి వెళ్లిపోవాలని సూచించింది. అటారీ, వాఘా సరిహద్దు మూసివేయడంతో పాటు పాక్ జీవనాడి అయిన సింధు జలాల ఒప్పందంపై నిషేధం విధించి దాయాది నడ్డి విరిచింది..

పాక్ ఉప ప్రధాన మంత్రి అయిన ఇషాక్ దార్ గురువారం మాట్లాడుతూ.. ఏప్రిల్ 22న పహల్గామ్ లో దాడులు చేసిన వారు స్వాతంత్ర్య సమరయోధులు అని వ్యాఖ్యానించారు. 1960 సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తరువాత పాక్ మంత్రులు, ప్రతినిధులు భారత్ పై మరింత విషం చిమ్ముతున్నారు. ఇందులో భాగంగా కాశ్మీర్ లో ఉగ్రదాడికి పాల్పడి 26 మంది పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా పేర్కొనడంపై దుమారం రేగుతోంది.

బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ కేబినెట్ కమిటీ సమావేశంలో సింధు జలాల ఒప్పందంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైద్య  కోసం దేశానికి వచ్చి ఉన్న పాకిస్తానీయులకు జారీ చేసిన అన్ని వీసాలను కేంద్రం రద్దు చేసింది. భారత్ తీసుకుంటున్న చర్యలపై ఇషాక్ దార్ మాట్లాడుతూ, ఇది యుద్ధ చర్య లాంటిదన్నారు. 

సింధు జలాలను ఆపాలనుకోవడం యుద్ద చర్యే

పాకిస్తాన్‌లోని 240 మిలియన్ల మందికి నీళ్లు అవసరం. భారత్ సింధు జలాలను ఆపలేదు. కనుక భారత్ నిర్ణయం యుద్ధ చర్యతో సమానం. ఏదైనా సస్పెన్షన్ లేదా ఆక్రమణ లాంటివి అంగీకరించేది లేదు. పాకిస్తాన్‌పై భారతదేశం చేసిన దాడికి మరింత తిరిగిచ్చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు రావాల్సిన వాటా ఇవ్వాలి. అలా కాదని చర్యలు తీసుకుంటే దానిని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశం తరువాత ఆ ప్రకటన విడుదల చేశారు.

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ.. మా దేశ ప్రజలకు ఎవరైనా హాని కలిగిస్తే, దానికి ప్రతిగా భారత ప్రజలకు హాని చేస్తామని హెచ్చరించారు. మేం ప్రతీకారం తీర్చుకుంటే భారత్‌కు నష్టం వాటిల్లుతుంది. ఏప్రిల్ 22 పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసారన్ మెడోస్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మృతి చెందారు. నిషేధిత లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ ఉగ్రదాడి చేసింది తామేనని ప్రకటించుకుంది

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget