అన్వేషించండి

CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?

CEC impeachment notice: భారత రాజకీయ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పావులు కదుపుతున్నాయి.

CEC Gyanesh Kumar impeachment notice: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్  జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌తో  ఇండియా  కూటమికి చెందిన  193 మంది ఎంపీలు  సంతకాలు చేసిన నోటీసును సిద్ధం చేశారు. ఇందులో లోక్‌సభకు చెందిన 130 మంది, రాజ్యసభకు చెందిన 63 మంది ఎంపీలు ఉన్నారు. శుక్రవారం నాడు పార్లమెంటులోని ఏదో ఒక సభలో ఈ నోటీసును సమర్పించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక సీఈసీని తొలగించడానికి పార్లమెంటులో నోటీసు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి . 

నిబంధనల ప్రకారం.. 

రాజ్యాంగం ప్రకారం, ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియనే  అనుసరించాల్సి ఉంటుంది. లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యులు లేదా రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు సంతకాలు చేసిన నోటీసును ఇస్తేనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం విపక్షాల వద్ద అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉండటంతో ఈ నోటీసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా కూటమి పార్టీలతో పాటు, ప్రస్తుతం కూటమిలో అధికారికంగా లేని ఆమ్ ఆద్మీ పార్టీ  ఎంపీలు కూడా దీనిపై సంతకాలు చేశారు.

సీఈసీపై ఉన్న ఏడు ప్రధాన ఆరోపణలు 

ఈ నోటీసులో జ్ఞానేష్ కుమార్‌పై మొత్తం ఏడు రకాల తీవ్రమైన ఆరోపణలను విపక్షాలు పొందుపరిచాయి. అందులో ప్రధానంగా అధికారంలో ఉండి పక్షపాతంగా వ్యవహరించడం,  ఎన్నికల అవకతవకలపై దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం,  ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్ల తొలగింపు వంటి అంశాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి.

రాజకీయ ఉత్కంఠ 

పార్లమెంటులో ఈ నోటీసును సమర్పించిన తర్వాత, దానిని ఆమోదించాలా లేదా అనేది స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకవేళ నోటీసు ఆమోదం పొందితే, ఆరోపణల విచారణ కోసం ఒక కమిటీని వేయాల్సి ఉంటుంది. అయితే, అధికార పక్షానికి మెజారిటీ ఉన్నందున ఈ తీర్మానం నెగ్గడం కష్టమే అయినప్పటికీ, ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతపై దేశవ్యాప్తంగా చర్చ లేవనెత్తడమే విపక్షాల ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.

సీఈసీని తొలగించే ఈ రాజ్యాంగ ప్రక్రియ ఇలా!

అభిశంసన నోటీసును ఆమోదిస్తే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ,  ఒక ప్రముఖ న్యాయకోవిదుడితో కూడిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఆరోపణలు నిజమని తేల్చి నివేదిక ఇస్తేనే, పార్లమెంటులో అసలు ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ సమయంలో ఉభయ సభల్లోనూ  ప్రత్యేక మెజారిటీ  అంటే.. సభలోని మొత్తం సభ్యులలో సగానికి పైగా,   ఓటింగ్ వేసిన వారిలో మూడింట రెండొంతుల మంది మద్దతు లభించాలి. ఒకే సెషన్‌లో రెండు సభలు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే, అప్పుడు రాష్ట్రపతి తుది ఉత్తర్వు జారీ చేయడం ద్వారా సీఈసీని పదవి నుంచి తొలగిస్తారు.                   


 

టాప్ హెడ్ లైన్స్

DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Captain Cool MS Dhoni Birthday: లెజెండ్ ఎంఎస్ ధోని 45వ బర్త్ డే.. టికెట్ కలెక్టర్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రోఫీ కలెక్టర్‌గా మారిన 'మహి' మైండ్ బ్లోయింగ్ సక్సెస్ జర్నీ!
లెజెండ్ ఎంఎస్ ధోని 45వ బర్త్ డే.. టికెట్ కలెక్టర్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రోఫీ కలెక్టర్‌గా మారిన 'మహి' మైండ్ బ్లోయింగ్ సక్సెస్ జర్నీ!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
ABP Desam Top 10, 7 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 7 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Embed widget