అన్వేషించండి

CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?

CEC impeachment notice: భారత రాజకీయ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పావులు కదుపుతున్నాయి.

CEC Gyanesh Kumar impeachment notice: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్  జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌తో  ఇండియా  కూటమికి చెందిన  193 మంది ఎంపీలు  సంతకాలు చేసిన నోటీసును సిద్ధం చేశారు. ఇందులో లోక్‌సభకు చెందిన 130 మంది, రాజ్యసభకు చెందిన 63 మంది ఎంపీలు ఉన్నారు. శుక్రవారం నాడు పార్లమెంటులోని ఏదో ఒక సభలో ఈ నోటీసును సమర్పించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక సీఈసీని తొలగించడానికి పార్లమెంటులో నోటీసు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి . 

నిబంధనల ప్రకారం.. 

రాజ్యాంగం ప్రకారం, ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియనే  అనుసరించాల్సి ఉంటుంది. లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యులు లేదా రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు సంతకాలు చేసిన నోటీసును ఇస్తేనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం విపక్షాల వద్ద అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉండటంతో ఈ నోటీసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా కూటమి పార్టీలతో పాటు, ప్రస్తుతం కూటమిలో అధికారికంగా లేని ఆమ్ ఆద్మీ పార్టీ  ఎంపీలు కూడా దీనిపై సంతకాలు చేశారు.

సీఈసీపై ఉన్న ఏడు ప్రధాన ఆరోపణలు 

ఈ నోటీసులో జ్ఞానేష్ కుమార్‌పై మొత్తం ఏడు రకాల తీవ్రమైన ఆరోపణలను విపక్షాలు పొందుపరిచాయి. అందులో ప్రధానంగా అధికారంలో ఉండి పక్షపాతంగా వ్యవహరించడం,  ఎన్నికల అవకతవకలపై దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం,  ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్ల తొలగింపు వంటి అంశాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి.

రాజకీయ ఉత్కంఠ 

పార్లమెంటులో ఈ నోటీసును సమర్పించిన తర్వాత, దానిని ఆమోదించాలా లేదా అనేది స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకవేళ నోటీసు ఆమోదం పొందితే, ఆరోపణల విచారణ కోసం ఒక కమిటీని వేయాల్సి ఉంటుంది. అయితే, అధికార పక్షానికి మెజారిటీ ఉన్నందున ఈ తీర్మానం నెగ్గడం కష్టమే అయినప్పటికీ, ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతపై దేశవ్యాప్తంగా చర్చ లేవనెత్తడమే విపక్షాల ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.

సీఈసీని తొలగించే ఈ రాజ్యాంగ ప్రక్రియ ఇలా!

అభిశంసన నోటీసును ఆమోదిస్తే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ,  ఒక ప్రముఖ న్యాయకోవిదుడితో కూడిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఆరోపణలు నిజమని తేల్చి నివేదిక ఇస్తేనే, పార్లమెంటులో అసలు ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ సమయంలో ఉభయ సభల్లోనూ  ప్రత్యేక మెజారిటీ  అంటే.. సభలోని మొత్తం సభ్యులలో సగానికి పైగా,   ఓటింగ్ వేసిన వారిలో మూడింట రెండొంతుల మంది మద్దతు లభించాలి. ఒకే సెషన్‌లో రెండు సభలు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే, అప్పుడు రాష్ట్రపతి తుది ఉత్తర్వు జారీ చేయడం ద్వారా సీఈసీని పదవి నుంచి తొలగిస్తారు.                   


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
Women Reservation Implementation: లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
Who is Rinkoo Singh Rahee: అవినీతిపై పోరాటమే ఆ ఐఏఎస్ చేసిన పాపం - రింకూ సింగ్ రాహీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.
అవినీతిపై పోరాటమే ఆ ఐఏఎస్ చేసిన పాపం - రింకూ సింగ్ రాహీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.
West Bengal Latest News:పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
Advertisement

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women Reservation Implementation: లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
Nara Lokesh in Delhi: అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Embed widget