Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
Best Crime Thriller Movies Telugu: తెలుగులో వచ్చిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఇదొకటి. ఇందులో క్రైమ్ ఒక్కటే కాదు... నేరానికి పాల్పడే వ్యక్తి పర్వర్షన్ కూడా ఉంటుంది. కొత్త పెళ్లి కూతుళ్లను టార్గెట్ చేసే ఆ సినిమా ఏదంటే?

OTT Movie: అనగనగా ఒక ఊరు... సైకిల్ ఎక్కితే పది నిమిషాల్లో ఊరంతా చుట్టేసి రావచ్చు. ఆ ఊరిలో ఒకరికొకరు బాగా తెలుసు. అయితే... ఆ ఊరిలో వరుస హత్యలు గ్రామ ప్రజలు అందరినీ భయాందోళనలకు గురి చేస్తాయి. అదీ నవ వధువులను టార్గెట్ చేస్తూ... వాళ్లను అనుభవించి మరీ హత్యలు చేస్తాడో వ్యక్తి. ఆ వ్యక్తి కథ ఏమిటి? ఆ సినిమా ఎందులో ఉంది? అనేది తెలుసుకోండి.
కొత్త పెళ్లి కూతుళ్లను టార్గెట్ చేసే దోభీ...
భర్త తలతో పోలీస్ స్టేషన్ గడప ఎక్కిన భార్య!
అసలు కథలోకి వెళితే... ఓదెల అని ఓ ఊరు ఉంది. అందులో తిరుపతి (వశిష్ఠ ఎన్ సింహా) అని ఓ యువకుడు ఉన్నాడు. అతడికి పెళ్లి అయ్యింది. భార్య పేరు రాధ (హెబ్బా పటేల్). వంశపారంపర్యంగా వచ్చిన దోభీ వృత్తిని కంటిన్యూ చేస్తున్నారు. ఊరి ప్రజల మాసిన దుస్తులు తీసుకు వచ్చి ఉతకడం, ఆరేసి ఇస్త్రీ చేసి ఇవ్వడం ఆ దంపతుల పని. ఊరి ప్రజలందరి తలలో నాలుకలా ఉంటారు.
ఓదెల గ్రామ ప్రజల్లో భయాందోళనలకు కారణం తిరుపతి. పైకి అమాయకుడిగా నటించే అతను, కొత్తగా పెళ్లైన అమ్మాయిపై అఘాయిత్యం చేసి ఆ తర్వాత చంపుతూ ఉంటాడు. వరుస హత్యాచారాలకు కారణం ఎవరో తెలియక పోలీసులు విచారణ ముమ్మరం చేస్తుంటారు. అయితే... తిరుపతి చేసే పని పోలీసుల కంటే ముందు అతని భార్య రాధకు తెలుస్తుంది. దాంతో భర్తను చంపేసి అతని తల నరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతుంది. తెలుగులో వచ్చిన డిఫరెంట్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాల్లో ఇదొకటి. ఇంతకీ, సినిమా పేరు ఏదో గుర్తుకు వచ్చిందా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఆహా ఓటీటీతో పాటు యూట్యూబ్లోనూ!
Odela Railway Station OTT Streaming Platform: హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'. పూజితా పొన్నాడ, సాయి రోనక్ కీలక పాత్రల్లో నటించారు. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంపత్ నంది కథ అందించారు. కేకే రాధామోహన్ నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీ (AHA OTT)లో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ వెర్షన్ యూట్యూబ్లోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్ తీశారు. ఆ సినిమా 'ఓదెల 2'లో తమన్నా ప్రధాన పాత్ర పోషించారు. ఆ చిత్రానికీ సంపత్ నంది కథ అందించగా... అశోక్ తేజ దర్శకత్వం వహించారు.
Also Read: Anantha Sriram: నేను సరస్వతి పుత్రుణ్ణి కాదు... ఆయనకు అనంత శ్రీరామ్ కౌంటర్?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























