అన్వేషించండి

CJI Uday Umesh Lalit: హనుమంత వాహనాన్ని మోసిన సీజేఐ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్

CJI Uday Umesh Lalit: సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ శ్రీవారి సేవలో తరించారు. సతీసమేతంగా వాహన సేవ చేశారు. 

CJI Uday Umesh Lalit: తిరుమల శ్రీవారి సాలకట్ల‌ బ్రహ్మోత్సవాలు ఆరో రోజు వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో‌ భాగంగా ఆరో రోజు ఉదయం హనుమంత వాహనంపై స్వామి వారు విహరించి‌ భక్తులకు కనువిందు చేశారు. హనుమంత వాహనంపై ఆశీనులైన స్వామి వారి వాహన సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పాల్గొని స్వయంగా వాహన సేవను మోశారు. అనంతరం వాహనం సేవతో పాటుగా తిరుమాఢ వీధిలో ఉదయ్ ఉమేష్ లలిత్ సతీ సమేతంగా కళాకారులతో కలిసి నాట్యం ఆడి ఫోటోలు తీసుకున్నారు. అనంతరం వరహా స్వామి వారిని‌ సతీ సమేతంగా దర్శించుకున్న తర్వాత ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, టీటీడీ‌ ఈవో ధర్మారెడ్డిలు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు సీజే 
అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి కె. మిశ్రా కూడా ఉన్నారు. దర్శనం అనంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ ను సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ సతీ సమేతంగా బేడి‌ ఆంజనేయ స్వామి వారిని‌ దర్శించుకుని‌ ఆశీస్సులు‌ పొందారు.

సాయంత్రం స్వర్ణరథం, గజవాహనం 
ఆరో రోజు అయిన ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు శ్రీవారు స్వర్ణ రథంపై భక్తులను కటాక్షించనున్నారు. స్వర్ణ రథం స్వామికి అత్యంత ప్రీతి పాత్రమైంది. ఈ స్వర్ణోత్సవ సేవలో కల్యాణ కట్ట సేవా పరులు తొలుతబంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా వాసులకు ఎంతో సంతోషం కలిగింది. స్వర్ణ రథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుందని విశ్వాసం. ఈ సేవ అనంతరం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు గజవాహనంపై తిరుమల వీధుల్లో ఊరేగుతూ భక్తులతకు అభయం ఇస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్లు భక్తులు కూడా నిరంతరం వేంకటపతిని హృదయంలో ఉంచి శరణాగతి చెందాలని ఈ వాహన సేవలోని ఆంతర్యమని పండితులు చెబుతున్నారు. 

నిన్న శ్రీవారి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా  సాగింది. ఐదో రోజు శ్రీమలయప్పస్వామి వారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్త కోటికి దర్శనం ఇచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళ్తుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శన మధ్య వాహన సేవ కోలాహలంగా సాగింది. మొత్తం గ్యాలరీల వద్ద స్వామి వారిని అటు ఇటు తిప్పుతూ భక్తులకు గరుడ వాహనాదీశుడైన శ్రీ మలయప్ప స్వామి వారి దర్శనభాగ్యం కల్పించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget