అన్వేషించండి

Duplicact Finger Prints: నెల్లూరులో కొత్త తరహా మోసం, వేలిముద్రలతో అరకోటి మాయం చేసిన కేటుగాళ్లు

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో వేసే వేలి ముద్రలను దొంగిచించి వాటి ద్వారా వేలిముద్రల కాపీలు తయారు చేసి బ్యాంకుల్లో డబ్బులు కొట్టేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో సరికొత్త మోసం వెలుగు చూసింది. అకౌంట్లలోనుంచి డబ్బులు మాయమైపోతోందంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు. చివరకు పరిశోధించి విషయం తేల్చారు. వేలిముద్రల ద్వారా డబ్బులు మాయం అవుతున్నట్టు గుర్తించారు. మరి బాధితులు వేలిముద్రలు వేయకుండానే ఇదంతా ఎలా జరుగుతోంది, ఆ డబ్బు ఎక్కడికెళ్తోంది, అసలా నిందితుల ప్లాన్ ఏంటి..?

ఇదో సరికొత్త మోసం, మనకు తెలియకుండానే మన వేలిముద్రలు దొంగిలించి, మన ఆధార్ కార్డ్ ద్వారా మనకు సంబంధం లేకుండానే మన అకౌంట్లనుంచి డబ్బులు మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఈ మోసం జరుగుతోంది. ప్రస్తుతం పల్లెటూల్లలో బ్యాంకింగ్ కియోస్క్ లు ఏర్పాటు చేసి, ఆధార్ నెంబర్ చెప్పి, వేలిముద్ర వేస్తే డబ్బులు విత్ డ్రా చేసి ఇస్తారు, కొంత కమీషన్ తీసుకుంటారు. అయితే దీన్ని అడ్డు పెట్టుకుని, అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా డబ్బులు కాజేస్తున్నారు కొంతమంది. ఇలాంటి ఓ ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో వేసే వేలి ముద్రలను దొంగిచించి వాటి ద్వారా వేలిముద్రల కాపీలు తయారు చేసి బ్యాంకుల్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఆధార్ నెంబర్లు కూడా రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనుంచే దొంగిలించారు. ఈ ముఠా ఇప్పటి వరకూ 51 లక్షల 25వేల రూపాయలు ఇలా దొంగిలించినట్టు గుర్తించారు. బాధితుల బ్యాంక్ అకౌంట్లనుంచి తమ వ్యాలెట్ లోకి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్న నిందితులు, వెంటనే దాన్ని విత్ డ్రా చేసుకుంటున్నారు. దీంతో రికవరీ కష్టసాధ్యంగా మారింది. 

ఎలా దొంగిలిస్తారంటే..?
కర్నూలు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ కి సంబంధించి డాక్యుమెంట్ రైటర్ గా పనిచేసే ఓ వ్యక్తి ఇందులో కీలక నిందితుడు. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ పనులకోసం వచ్చేవారు, సాక్షులుగా సంతకాలు చేసేవారు వేలిముద్రలు వేయడం, తమ ఆధార్ కాపీలు ఇవ్వడం పరిపాటి. దీని ద్వారా ఈ కేటుగాళ్లు వేలిముద్రలు, దానికి సంబంధించిన ఆధార్ కాపీలు స్కాన్ చేసేవారు. అలా స్కాన్ చేసిన వేలిముద్రలతో బ్యాంకింగ్ కియోస్క్ టెక్నాలజీతో డబ్బులు కాజేసేవారు. 

బాధితులకు తెలియదా..?
బాధితుల్లో ఎక్కువమంది నిరక్షరాశ్యులు, పల్లెటూరివారే ఉన్నారు. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ లో బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్ లు చూడటం వారికి అలవాటు లేదు. అందుకే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు ట్రాన్స్ ఫర్ అయినా కూడా వారికి తెలియదు. దీంతో ఈ కేటుగాళ్ల పని సులభమైంది. తీరా ఓ బాధితుడి ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు తీగలాగి, డొంక కదిలించారు. ఇక్కడ నెల్లూరు జిల్లావారు బాధితులే అయినా, 10మంది నిందితులు జిల్లా బయటి వ్యక్తులు కావడం విశేషం. ఇతర జిల్లాల్లో వీరు పనులు చక్కబెట్టారు. ఆన్ లైన్ నుంచి కూడా కొంత డేటా సేకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాలెట్ లో ఉన్న సొమ్ముని బ్లాక్ చేశామని, మిగతా సొమ్ము నిందితులనుంచి రికవరీ చేస్తామని చెబుతున్నారు పోలీసులు. ఇలాంటి మోసాలను నివారించాలంటే ఆధార్ తో అనుసంధానంగా ఉన్న ఫింగర్ ప్రింట్ ని డిజేబుల్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అలా చేస్తే మన వేలిముద్ర ఎవరికీ కనపడదని, వేలిముద్రలతో మన ఆధార్ ని ఎవరూ ఉపయోగించలేరని చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu ABP Country Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Japanese Andhra Meals: తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
TGSRTC Medaram Prasadam: మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu ABP Country Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Japanese Andhra Meals: తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
TGSRTC Medaram Prasadam: మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
Stock market crash: స్టాక్ మార్కెట్‌లో తుడిచిపెట్టుకుపోయిన పది లక్షల కోట్లు - మహా పతనానికి కారణాలు ఇవే !
స్టాక్ మార్కెట్‌లో తుడిచిపెట్టుకుపోయిన పది లక్షల కోట్లు - మహా పతనానికి కారణాలు ఇవే !
Mana Shankara Varaprasad Garu Review : ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్..
Tamilnadu assembly: తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర గీతమే ఫస్ట్ - ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ - ఈ వివాదం ఎప్పటిదో?
తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర గీతమే ఫస్ట్ - ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ - ఈ వివాదం ఎప్పటిదో?
Embed widget