అన్వేషించండి

Duplicact Finger Prints: నెల్లూరులో కొత్త తరహా మోసం, వేలిముద్రలతో అరకోటి మాయం చేసిన కేటుగాళ్లు

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో వేసే వేలి ముద్రలను దొంగిచించి వాటి ద్వారా వేలిముద్రల కాపీలు తయారు చేసి బ్యాంకుల్లో డబ్బులు కొట్టేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో సరికొత్త మోసం వెలుగు చూసింది. అకౌంట్లలోనుంచి డబ్బులు మాయమైపోతోందంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు. చివరకు పరిశోధించి విషయం తేల్చారు. వేలిముద్రల ద్వారా డబ్బులు మాయం అవుతున్నట్టు గుర్తించారు. మరి బాధితులు వేలిముద్రలు వేయకుండానే ఇదంతా ఎలా జరుగుతోంది, ఆ డబ్బు ఎక్కడికెళ్తోంది, అసలా నిందితుల ప్లాన్ ఏంటి..?

ఇదో సరికొత్త మోసం, మనకు తెలియకుండానే మన వేలిముద్రలు దొంగిలించి, మన ఆధార్ కార్డ్ ద్వారా మనకు సంబంధం లేకుండానే మన అకౌంట్లనుంచి డబ్బులు మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఈ మోసం జరుగుతోంది. ప్రస్తుతం పల్లెటూల్లలో బ్యాంకింగ్ కియోస్క్ లు ఏర్పాటు చేసి, ఆధార్ నెంబర్ చెప్పి, వేలిముద్ర వేస్తే డబ్బులు విత్ డ్రా చేసి ఇస్తారు, కొంత కమీషన్ తీసుకుంటారు. అయితే దీన్ని అడ్డు పెట్టుకుని, అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా డబ్బులు కాజేస్తున్నారు కొంతమంది. ఇలాంటి ఓ ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో వేసే వేలి ముద్రలను దొంగిచించి వాటి ద్వారా వేలిముద్రల కాపీలు తయారు చేసి బ్యాంకుల్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఆధార్ నెంబర్లు కూడా రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనుంచే దొంగిలించారు. ఈ ముఠా ఇప్పటి వరకూ 51 లక్షల 25వేల రూపాయలు ఇలా దొంగిలించినట్టు గుర్తించారు. బాధితుల బ్యాంక్ అకౌంట్లనుంచి తమ వ్యాలెట్ లోకి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్న నిందితులు, వెంటనే దాన్ని విత్ డ్రా చేసుకుంటున్నారు. దీంతో రికవరీ కష్టసాధ్యంగా మారింది. 

ఎలా దొంగిలిస్తారంటే..?
కర్నూలు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ కి సంబంధించి డాక్యుమెంట్ రైటర్ గా పనిచేసే ఓ వ్యక్తి ఇందులో కీలక నిందితుడు. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ పనులకోసం వచ్చేవారు, సాక్షులుగా సంతకాలు చేసేవారు వేలిముద్రలు వేయడం, తమ ఆధార్ కాపీలు ఇవ్వడం పరిపాటి. దీని ద్వారా ఈ కేటుగాళ్లు వేలిముద్రలు, దానికి సంబంధించిన ఆధార్ కాపీలు స్కాన్ చేసేవారు. అలా స్కాన్ చేసిన వేలిముద్రలతో బ్యాంకింగ్ కియోస్క్ టెక్నాలజీతో డబ్బులు కాజేసేవారు. 

బాధితులకు తెలియదా..?
బాధితుల్లో ఎక్కువమంది నిరక్షరాశ్యులు, పల్లెటూరివారే ఉన్నారు. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ లో బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్ లు చూడటం వారికి అలవాటు లేదు. అందుకే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు ట్రాన్స్ ఫర్ అయినా కూడా వారికి తెలియదు. దీంతో ఈ కేటుగాళ్ల పని సులభమైంది. తీరా ఓ బాధితుడి ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు తీగలాగి, డొంక కదిలించారు. ఇక్కడ నెల్లూరు జిల్లావారు బాధితులే అయినా, 10మంది నిందితులు జిల్లా బయటి వ్యక్తులు కావడం విశేషం. ఇతర జిల్లాల్లో వీరు పనులు చక్కబెట్టారు. ఆన్ లైన్ నుంచి కూడా కొంత డేటా సేకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాలెట్ లో ఉన్న సొమ్ముని బ్లాక్ చేశామని, మిగతా సొమ్ము నిందితులనుంచి రికవరీ చేస్తామని చెబుతున్నారు పోలీసులు. ఇలాంటి మోసాలను నివారించాలంటే ఆధార్ తో అనుసంధానంగా ఉన్న ఫింగర్ ప్రింట్ ని డిజేబుల్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అలా చేస్తే మన వేలిముద్ర ఎవరికీ కనపడదని, వేలిముద్రలతో మన ఆధార్ ని ఎవరూ ఉపయోగించలేరని చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget