అన్వేషించండి

Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive

Hydra Demolitions | హైడ్రా కూల్చివేతలు బ్యాంకులకు పెను సవాలుగా మాారాయి. మరోవైపు బాధితులు సైతం EMI వేధింపులు భరించలేని పరిస్దితి నెలకొంది. ఇళ్లే లేనప్పడు EMI ఎందుకు కట్టాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

హైడ్రా కూల్చివేతలు కొన్ని నెలల నుంచి కలకలం రేపుతున్నాయి. బాధితుల నిరసన, ప్రతిపక్షాల ఆందోళనతో కొన్ని రోజులపాటు హైడ్రా సైలెంట్ అయింది. ఇటీవల మళ్లీ కూల్చివేతలు చేపట్టింది. అయితే ఇళ్లు లేకున్నా ఈఎంఐ కట్టాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. తమకు కనీసం ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇందిరమ్మ ఇండ్లు అయినా ఇవ్వాలని కొందరు అడుగుతుంటే, నష్టపరిహారం చెల్లించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అధికారులు ఇచ్చిన అనుమతితో, బ్యాంకుల నిర్ధారించి లోన్ ఇచ్చిన తరువాత ఇల్లు కట్టుకున్నామని చెబుతున్నారు. దీనిపై ఏబీపీ దేశం పలు విషయాలు ఇక్కడ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది.

ABP Desam: హైడ్రా కూల్చివేతల వల్ల హోమ్ లోన్స్ ఇచ్చిన బ్యాంక్ లు నష్టపోతున్నాయా.. బ్యాంకులపై ఎంత భారం పడే అవకాశం ఉంది ?

రాంబాబు (ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ కార్యదర్శి) : మున్సిపల్, జిహెచ్ ఎంసీ, హెచ్ ఎండిఏ ఇలా వీటి అనుమతి ఉన్న లేఅవుట్ లో నిర్మించిన ఇళ్లకు మాత్రమే బ్యాంక్ లు హోమ్ లోన్స్ ఇస్తాయి. లోన్ కోసం బ్యాంక్ వద్దకు వస్తే, బ్యాంక్ ఏర్పాటు చేసిన ఓ న్యాయవాది వద్ద లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. లీగన్ ఒపీనియన్ ఇచ్చే న్యాయవాది బార్ కౌన్సిల్ గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రభుత్వ వ్యవస్దలు ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ను క్షేత్రస్దాయికి వెళ్లి పరిశీలించిన తరువాత ఆ టైటిల్ డీడ్ అనేది బ్యాంక్ కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది అనే ఒపీనియన్ ఇచ్చిన తరువాత మాత్రమే లోన్ తీసుకునేందుకు అనుమతి లభిస్తుంది.

బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని హైడ్రా ఇళ్లు కూల్చేసింది. కానీ అవన్నీ అనుమతులు పొందిన లేఅవుట్లు. బ్యాంక్ మేనేజర్ ప్రభుత్వ వ్యవస్దలపైనే ఆధారపడి హోమ్ లోన్స్ ఇస్తారు. మేనేజర్ ఎక్కడా క్షేత్రస్దాయికి వెళ్లరు. ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు అక్రమం ఎలా అవుతాయి. ఇప్పటివరకూ హైడ్రా కూల్చిన ఇళ్లకు ఇచ్చిన లోన్స్ మొత్తం 10వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. లోన్స్ తీసుకున్నవారు  తిరిగి చెల్లించకపోతే బ్యాంక్ లలో డిపాజిట్ చేసిన ఖాతాదారులకు తిరిగి డబ్బు చెల్లించడం బ్యాంకులకు సవాలుగా మారుతుంది. బ్యాంకింగ్ వ్యవస్ద కుదేలైయ్యే అవకాశాలు ఉన్నాయి. స్దలం మీద హక్కులేదు, ఇళ్లు లేదు కాబట్టి రికవరీ చేయడం బ్యాంకులకు అంత ఈజీ కాదు. ఇవన్నీ చట్టరీత్యా తేలాల్సిన అంశాలు.


Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive

ABP Desam: హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి  తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు ఏం చేస్తాయి. వసూలు విధానం ఎలా ఉంటుంది.?

రాంబాబు: హైడ్రా ఎందుకు కూల్చింది అనే వివాదంలోకి బ్యాంక్ వెళ్లదు. లోన్ తీసుకున్న సమయంలో బ్యాంక్ కు ఇచ్చిన అగ్రిమెంట్ ను మాత్రమే చూస్తుంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో గ్యారెంటీ ఉన్న  వ్యక్తి వద్ద నుండి లొన్ వసూలు చేసేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తాయి. ఇవ్వకపోతే కోర్టకు వెళ్లి చర్యలు తీసుకుంటాయి. లోన్ తీసుకున్న వ్యక్తి ఉద్యోగి అయితే ఆ కంపెనీని సంప్రదించి వసూలు చేస్తాయి. ఇతర ఆస్తులు, గ్యారెంటీ ఉన్నవారి ఆస్తులు జప్తు చేస్తారు. ఎట్టి  పరిస్దితుల్లోనూ లోన్ రికవరీ చేయకుండా బ్యాంకులు వదిలిపెట్టవు. ఇదే హైడ్రా బాధితులకు సైతం వర్తిస్తుంది.  

ABP Desam: ఇంటిని తనఖా పెట్టుకుని మీరు లోన్ ఇచ్చారు. హైడ్రా బాధితులకు ఇప్పుడు ఇళ్లే లేదు. బాధితులపై ఎందుకు చర్యలు తీసుకుంటారు..?

రాంబాబు: ఇళ్లు కూల్చేసినా, లోన్ తీసుకునే సమయంలో బాధితులు ఇచ్చిన టైటిల్ డీడ్ బ్యాంక్ వద్ద ఉంటుంది. కానీ ఇప్పడు ఆ టైటిల్ డీడ్ చెల్లదని హైడ్రా అంటోంది. ఈ ప్రత్యేక పరిస్దితుల్లో చట్టం దీనికి ఒప్పుకుంటుందా.. ఒకవేళ లోన్ కట్టకపోతే బ్యాంక్ లు డిపాజిట్ దారులకు సమయానికి డబ్బు చెల్లించలేవు. కాబట్టి లోన్ కట్టకపోతే బ్యాంక్ లు కోర్టుకు వెళతాయి. వసూలు చేసుకునేందు తమ వద్ద ఉన్న వ్యవస్దను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తాయి. 

ABP Desam: బ్యాంక్ లకు సవాలుగా మారిన హైడ్రా కూల్చివేతలను బ్యాంకులు  ప్రత్యేకంగా పరిగణిస్తాయా...?

రాంబాబు: ఇలాంటి పరిస్దితులు దేశంలో గతంలో ఎప్పుడూ జరగలేదు. పార్టీలు మారినప్పుడుల్లా గత ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు తప్పు అంటే కోర్టులు సమర్ధించే అవకాశాలు తక్కువ. హైడ్రాను బ్యాంక్ లు ప్రత్యేకంగా పరిగణించవు. రాని బాకీల క్రింద ఏర్పడన తరువాత సూట్ ఫైల్ అకౌంట్స్ కూడా ఫెయిల్  అయిన తరువాత డిక్రీలు కూడా ఎగ్జికూట్ కాని పరిస్దితులలో మాత్రమే  లోన్ రద్దు అవుతుంది.

ABP Desam: హైడ్రా కూల్చిన ఇళ్లకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులే లోన్స్ కట్టించాలనే ప్రశ్నలకు మీరు ఏమంటారు?

రాంబాబు: అన్ని అనుమతులు ఉన్నాయని, అడ్వకేట్ ద్రువీకరీస్తారు. దానికి ఆధారాలను జతచేస్తారు. అధికారులు ఇచ్చిన అనుమతులు ఇప్పుడు కాదంటే కోర్టులో చెల్లదు. ప్రభుత్వరంగ సంస్దలైనా, ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఆధారంగానే హోమ్ లోన్స్ ఇస్తాయి. కూల్చిన అన్ని ఇళ్లకు అనుమతులు ఉన్నాయి. లేఅవుట్ అనుమతులు, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులే దీనికి బాధ్యులు. వీళ్లే లోన్ రీపే (Loan RePay) చేయాలనేది న్యాయబద్దమైన డిమాండ్. ఈ దిశగా ముందుకు వెళితే హైడ్రా బాధితులకు కోర్టులు న్యాయం చేసే అవకాశం ఉంది. 

Also Read: Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
AP Politics: ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
AP Politics: ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
3 Roses Season 2 Web Series: మరో 2 కొత్త రోజెస్ వచ్చేస్తున్నాయ్! - ఓటీటీలోకి వచ్చేస్తోన్న '3 రోజెస్' సిరీస్ సీజన్ 2.. ఈసారి ఫన్ మామూలుగా ఉండదంతే..
మరో 2 కొత్త రోజెస్ వచ్చేస్తున్నాయ్! - ఓటీటీలోకి వచ్చేస్తోన్న '3 రోజెస్' సిరీస్ సీజన్ 2.. ఈసారి ఫన్ మామూలుగా ఉండదంతే..
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Nikhil Maliyakkal - Chinni Serial: 'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
Indira Mahila Shakti: కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
Embed widget