అన్వేషించండి

Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

తనపై వైఎస్ జగన్ సన్నిహితుడు అనే ముద్ర పడటంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం అయ్యాకే వైఎస్ జగన్ ను తొలిసారి కలిశానని బీజేపీ నేత స్పష్టం చేశారు.

Andhra Pradesh News | అమరావతి: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితుడు అనే ముద్రపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యేంత వరకు తనకు ఆయనతో ఎలాంటి పరిచయాలు లేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, అయితే ఎమ్మెల్సీగా ఉన్న తాను అప్పుడు సీఎంగా ఉన్న జగన్ ను కలిశానని చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నుంచి అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును అధిష్టానం సోమవారం ప్రకటించింది. 

జగన్ సన్నిహితుడైన బీజేపీ నేత సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని ఏపీలో ప్రచారం జరుగుతోంది. కూటమి నుంచి వస్తున్న వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. జగన్ సీఎం అయ్యేంత వరకు ఆయనతో తనకు పరిచయం లేదన్నారు. జగన్‍తో తనకు రహస్య స్నేహం అనేది అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు.  జగన్ సీఎం అయ్యాక ఎమ్మెల్సీగా ఉన్న తాను వెళ్లి కలిశానని తెలిపారు. తాను నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని, జగన్ కు కేవలం 10 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందన్నారు. 

చంద్రబాబు 2014లో నాకు మంత్రి పదవి ఇస్తానన్నాను. మోదీ, చంద్రబాబు బంధంలానే.. చంద్రబాబుతో ఇద్దరి మధ్య నమ్మకమైన బంధం ఉందన్నారు. గతంలో తాను అమరావతిని  వ్యతిరేకించానన్నది అవాస్తవం అన్నారు. తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది కేవలం బీజేపీ పార్టీ నిర్ణయం మాత్రమే నని, తాను ఎక్కడా, ఎలాంటి లాబీయింగ్ చేయలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో చిట్ చాట్ లో ఈ విషయాలు షేర్ చేసుకున్నారు.

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు..
ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. జనసేన నుంచి నాగబాబుకు ఛాన్స్ దక్కింది. టీడీపీ సైతం ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించింది. కావలి గ్రీష్మ (ఎస్సీ), బీటీ నాయుడు (బీసీ), బీద రవిచంద్ర (బీసీ)లకు అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అయితే కూటమి నుంచి 5వ స్థానంపై ఉత్కంఠ నెలకొనగా చివరి నిమిషంలో సోము వీర్రాజును బీజేపీ ఎమ్మెల్సీ స్థానం ఖరారు చేసింది. దాంతో ఆయన హడావిడిగా నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. 

ఆఘమేఘాల మీద నామినేషన్.. విమానంలో పత్రాలు, ఫారాలు

ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులకు బీ ఫారం పత్రాలు తప్పనిసరి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతకం చేసిన ఫారాలు అవసరం. తెలంగాణ నుంచి వాటిని టీవీఎస్ రాజు ప్రత్యేక విమానంలో గన్నవరం తీసుకెళ్లారు. వాటిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంతకాలు చేయాలి. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని ఆమె ఢిల్లీలో ఉన్నారు. దాంతో ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజుకు స్పెషల్ ఆథరైజేషన్ ఇచ్చారు. ఏలూరు ధర్నాకు వెళ్తున్న ఆయన గన్నవరం వెళ్లి హైదరాబాద్ నుంచి వచ్చిన పత్రాలను తీసుకున్నారు. 
పత్రాలు తీసుకుని అసెంబ్లీకు చేరుకున్నాక సోము వీర్రాజు ఆ పత్రాలు తీసుకుని మరో 14 నిమిషాల్లో గడువు ముగుస్తుందనగా.. నామినేషన్ దాఖలు చేశారు.

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Embed widget