అన్వేషించండి

Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి

Womens Day 2025 | భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి అని అతికొద్ది మందికే తెలుసు. కాశ్మీర్ మహారాణి ఏకంగా గజినీ మహమ్మద్‌ను తన రాజ్యం వైపు చూడకుండా భయపడేలా చేశారు.

 భారతదేశ చరిత్రలో ఎంతోమంది మహిళలు ఎన్నో గొప్ప పదవులు అలంకరించారు. వారిలో రాణులూ ఉన్నారు. రజియా సుల్తానా, రాణి రుద్రమదేవి లాంటి వారి గురంచి చరిత్ర చెబుతూనే ఉంది. కానీ వీరందరి కంటే ముందే పరిపాలించిన భారతదేశపు తొలి మహారాణి, గజినీ మహమ్మద్ ని సైతం  తన రాజ్యం వైపు చూడాలంటే భయపడేలా చేసిన మహారాణి 'డిద్దా దేవి ' గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. కాశ్మీర్ రాజ్యం  రాజ ప్రతినిధి గా, మహారాణి గా (958 CE నుండి 1003 CE ) వరకూ  45 ఏళ్ళు పరిపాలించిన డిద్ధా దేవి పాలన మొత్తం  ఎత్తులకు పైయెత్తులు పోరాటాల తోటే నడిచింది.

రెండు రాజ్యాలను ఏకం చేసి పాలించిన డిద్దా దేవి

 కాశ్మీర్లోని పీర్ పంజల్ పర్వతాల ప్రాంతంలో ఉండే లోహారా రాజు  సింహారాజ కుమార్తె డిద్దా. ఆమె పుట్టింది 914 CE లో.  26 ఏళ్ల వయస్సులో ఆమె వివాహం కాశ్మిర్ రాజు క్షేమగుప్తుడి  తో పెళ్లి అయ్యింది. డిద్దా దేవి శక్తి సామర్థ్యాలు గుర్తించిన క్షేమగుప్తుడు  రాచ కార్యాల్లో కూడా ఆమెకు ప్రాధాన్యత కల్పించాడు. తనతో పాటు ఆమె పేరుతో కూడా  నాణాలు ముద్రించే స్థాయిలో  డిద్దా దేవి ప్రభావం క్షేమ గుప్తుడి పై ఉండేది. ఆమె వివాహంతో మొత్తం కాశ్మీర్ లోని  చిన్న చిన్న రాజ్యాలన్నీ  ఒకే పాలను కిందికి వచ్చేసాయి. 958 లో ఒక వేటకు వెళ్ళిన క్షేమగుప్తుడు జ్వరానికి లోనై మరణించాడు. చిన్నవాడైన  తమ కుమారుడు అభిమన్యు తోడుగా రాజప్రతినిధిగా  డిద్ద దేవి కాశ్మీర్ని పరిపాలించడం ప్రారంభించింది. సహజంగానే కొంతమంది మంత్రులు, సామంతులు ఆమెకు ఎదురు తిరిగి సింహాసనాన్ని హస్తగతం చేసుకోవాలని చూశారు. అయితే ప్రజల మద్దతు డిద్దా కు ఉండడంతో పాటు  స్వతహాగా తెలివైన డిద్దా ఎత్తులకు పై ఎత్తు వేసి ఎదురు తిరిగిన వాళ్లను అణిచివేసింది. ఈ విషయంలో ఎలాంటి జాలి అమె చూపించలేదు. కుట్ర చేసిన వాళ్లతో పాటు  వారి కుటుంబాలను సైతం నిర్ధాక్షణంగా అంతం చేసింది.  

అంతా బాగుంది అనుకున్న సమయంలో  972లో  అభిమన్యు సైతం చనిపోయాడు. అతని కుమారుడు నందిగుప్తుడు కూడా చిన్న పిల్లోడే కావడంతో  అతని తరఫున కూడా డిద్దా దేవి రాజ్యపాలన చేసింది. కానీ అతను, అతని సోదరులు త్రిభువన గుప్త, భీమగుప్త కూడా పసివాళ్ళుగానే మరణించారు. దీని వెనక అంతఃపుర కుట్రలు ఉన్నాయని కల్హణుడు 'రాజతరంగిణి ' లో పేర్కొన్నాడు. ఇలా కొడుకు మనవళ్లు చనిపోవడంతో  975లో  కాశ్మీర్ మహారాణిగా  పట్టాభిషేకం చేసుకొని  తానే పరిపాలించడం మొదలు పెట్టింది డిద్దా. తన సన్నిహితుడు. ప్రధాన మంత్రి 'తుంగ' తో కలిసి  1003 CE లో 79 ఏళ్ల వయస్సు లో ఆమె మరణించేంతవరకూ కాశ్మీర్ ని  పరిపాలించింది. శత్రువుల విషయంలో చాలా క్రూరంగా ఉండేది. అందుకే తరువాతి కాలంలో చరిత్రకారులు ఆమెను  రష్యాను పరిపాలించిన 'కేథరిన్ ది గ్రేట్' తో పోల్చారు.  ఆమెలోని ఈలక్షణం కాశ్మీర్ కు మరో విధంగా మేలు చేసింది.

 కాశ్మీర్ వైపు దండెత్తడానికి భయపడ్డ గజని 

 భారతదేశం పై దండెత్తిన గజినీ మహమ్మద్  ఎంత నష్టం చేశాడో చరిత్ర చెబుతుంది. కానీ అలాంటివాడు సైతం డిద్దా దేవి రాజ్యం పై దాడి చేయడానికి భయపడ్డాడు. కారణం అప్పటి చీనా సహా చుట్టుపక్కల రాజ్యాలతో  సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్న డిద్దా కాశ్మీర్ కి వెళ్లే మార్గాలు అన్నిటి లోనూ రక్షణ ఏర్పాట్లు బలంగా చేసింది. యుద్ధ తంత్రంలోనూ ఆమె ప్రతిభ గురించి విన్న గజినీ మహమ్మద్ ఆమె బతుకున్నంత కాలం కాశ్మీర్ వైపు కన్నెత్తి చూడలేదు. 1003 లో ఆమె చనిపోకముందు తన మేనల్లుడు  సంగ్రామ రాజాను దత్తత తీసుకుంది. అతనే కాశ్మీర్ ని 1928 వరకూ పాతికేళ్లు పరిపాలించాడు.

డిద్దా దేవి చనిపోయిన పదేళ్లకు కాశ్మీర్ పై గజినీ మహమ్మద్ 1014,1021 లో రెండుసార్లు దండెత్తాడు. కానీ  ఆ రెండు సార్లు  విపరీతమైన సైనిక నష్టం జరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. దీనికి సంగ్రామ రాజా పోరాటంతో పాటు కాశ్మీర్లోని భీకర వాతావరణ పరిస్థితులు కూడా కారణం. ఆ తర్వాత గజనీ మహమ్మద్ మళ్లీ కాశ్మీర్ వైపు కన్నెత్తి చూడలేదు. ఆ తర్వాత కూడా డిద్దా స్థాపించిన "లోహారా " రాజవంశం మరో 300 ఏళ్ళు అంటే 1320 CE వరకూ కాశ్మీర్ ను పరిపాలించింది. ఇప్పటికీ కాశ్మీర్లో ఆడ పిల్లలకు మతాలకతీతంగా "డిద్దా " అనే పేరు పెడుతుంటారు. చేస్తే ఆడపిల్లలు ధైర్య సాహసాలతో పెరుగుతారని కాశ్మీర్ లో ఒక నమ్మకం

టాప్ హెడ్ లైన్స్

NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
PM Modi on Yoga Day: దేశ ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది: కోల్‌కతాలో ప్రధాని మోదీ
దేశ ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది: కోల్‌కతాలో ప్రధాని మోదీ
Train Ticket Rules: రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా రెట్టింపు, కొన్ని సందర్భాలలో జైలు శిక్ష సైతం
రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా రెట్టింపు, కొన్ని సందర్భాలలో జైలు శిక్ష సైతం
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
Chennai Love Story Jigithara Song : జిగితార జిగితార దిగినావా మనసారా - క్యూట్ కపుల్‌కు ఫీల్ గుడ్ లిరిక్స్
జిగితార జిగితార దిగినావా మనసారా - క్యూట్ కపుల్‌కు ఫీల్ గుడ్ లిరిక్స్
CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
PM Modi on Yoga Day: దేశ ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది: కోల్‌కతాలో ప్రధాని మోదీ
దేశ ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది: కోల్‌కతాలో ప్రధాని మోదీ
Happy Fathers Day : హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
Amaravati High Speed Rail: అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే
అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే
Embed widget