అన్వేషించండి

Karthika Deepam జనవరి 3 ఎపిసోడ్: దీప వ్యాపారం దెబ్బకొట్టేందుకు, కార్తీక్ ని అవమానించేందుకు పక్కా ప్లాన్ వేసిన రుద్రాణి.. కార్తీకదీపం అప్ డేట్స్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనవరి 3 సోమవారం 1239 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథ ఈ రోజు మరో మలుపు తిరిగింది. ఏం జరిగిందంటే…

కార్తీకదీపం 2022 జనవరి 3 సోమవారం ఎపిసోడ్
గత ఎపిసోడ్‌లో రుద్రాణి.. అబ్బులు సాయంతో శ్రీవల్లి, కోటేష్‌లను చంపిస్తుంది. కార్తీక్ వెళ్లి.. 'ఇద్దరు అమాయకుల్ని చంపేస్తావా' అని అడగడంతో మొదట నాకేం తెలియదు అన్న రుద్రాణి.. కార్తీక్ దగ్గర కెమేరాలు, ఫోన్ రికార్డులు లేవని చెక్ చేయించి మరీ నిజం చెబుతుంది.  పైగా నెల రోజుల్లో డబ్బు కట్టకుంటే మీ హిమని నేను దత్తత తీసుకుంటాను అని వార్నింగ్ కూడా ఇస్తుంది.

Also Read: రుద్రాణికి కార్తీక్ వార్నింగ్, అప్పు తీర్చకపోతే కథ వేరే ఉంటదన్న రుద్రాణి.. ‘కార్తీకదీపం’ అప్ డేట్స్..
 ఈ రోజు ( జనవరి 3 సోమవారం ఎపిసోడ్ లో) అమ్మా వంటలు నేర్పించు అని పిల్లలంటే.. వద్దమ్మా..వంటలక్క అనే బిరుదు నాతోనే అంతమైపోవాలంటుంది దీప. ఇంతలో అక్కడకు కార్తీక్ రావడంతో పిల్లలు 'నాన్నా తమ్ముడ్ని మనమే పెంచుకుందాం.. వాడు పెద్దయ్యాక  సొంత తమ్ముడు కాదని తెలిస్తే బాగోదు కదా అంటారు. అయితే ఊర్లో ఉంటే అంతా శ్రీవల్లి వాళ్ల బాబు అంటున్నారని అందుకే ఊరు వదలి వెళ్లిపోదాం అంటారు. వీడిని మనమే పెంచుకుందా కానీ ఇప్పుడప్పుడే ఈ ఊరు వదిలి వెళ్లలేం అన్న కార్తీక్ తో..ఎందుకు అని అడుగుతారు దీప-పిల్లలు. అదే సమయంలో కార్తీక్..అప్పుతీరుస్తానంటూ రుద్రాణికి చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు. ఆ విషయం అర్థం చేసుకున్న దీప..ఈ ఇంటిని వదిలేస్తే రుద్రాణి తీసుకుంటుంది కదా అప్పుడు మనం అప్పు తీర్చాల్సిన పనిలేదు కదా అంటుంది. అలా చేస్తే శ్రీవల్లి-కోటేష్ ల చావుకి అర్థం లేకుండా పోతుంది..ఎందుకంటే ఇది కోటేష్ పూర్వీకుల ఆస్తి కాబట్టి దీనికి వారసుడు ఆనంద్.. అలాంటప్పుడు ఇల్లు రుద్రాణికి అప్పగిస్తే వీడికి మనం అన్యాయం చేసినట్టు అవుతుంది కదా అంటాడు. స్పందించిన దీప ఇంత దూరం ఆలోచించలేదంటుంది... కానీ డాక్టర్ బాబు ఏదో విషయం నా దగ్గర దాచుతున్నారని మనసులో అనుకుంటుంది.

Also Read: రెండు క్యారెక్టర్లు ఔట్..కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్..
కట్ చేస్తే సౌందర్య ఇంట్లో...
పిల్లల పుస్తకాలు వెతుకున్నా వాళ్ల చేతిరాత చూసినా ఆనందంగా ఉంటుందని సౌందర్య అంటుంది. ఇన్ని సౌకర్యాలు వదిలేసి ఎక్కడుంటున్నారో ఏం తింటున్నారో, అసలు పిల్లలు స్కూల్ కి వెళుతున్నారో లేద కూడా తెలియడం లేదు, పిల్లలు ఏం చేశారని వాళ్లకీ శిక్ష అని భర్త దగ్గర బాధపడుతుంది. సౌకర్యాల్లో సంతోషం లేదు సౌందర్య..వాళ్లు మనకు దూరమయ్యారే కానీ సంతోషానికి దూరమయ్యారని ఏమాత్రం అనుకోవద్దు.. ఏదో ఒక రోజు మన దగ్గరకు వస్తారని చెబుతాడు ఆనందరావు. మరోవైపు బస్తీలో లక్ష్మణ్, అతడి భార్య.. మోనిత గురించి మాట్లాడుకుంటారు. ‘మోనితని దూరం పెట్టడం కరెక్ట్ కాదేమో.. ఆ బాబు కార్తీక్ బాబు వాళ్ల బాబే అని అనుకుంటున్నారు అంతా.. పైగా శాంతులు కోసం పూజలు కూడా చేయించారట కార్తీక్ బాబు వాళ్ల అమ్మగారు. అంటే మోనితదే తప్పు అని అనుకోలేం కదయ్యా.. నిప్పులేనిదే పొగరాదు కదయ్యా’ అంటూ మోనితకి అనుకూలంగా మాట్లాడుతుంది. దాంతో లక్ష్మణ్ ఆలోచనలో పడతాడు. 

Also Read: కార్తీక్-దీప ఉన్న ఊర్లోకి మోనిత పనిమనిషి ప్రియమణి ఎంట్రీ.. కథలో మరో మలుపు.. కార్తీక దీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
దీప బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అక్కడకు వచ్చిన కార్తీక్ ..నేను ముళ్ల చెట్టు లాంటివాడిని, నీడనివ్వలేనని బాధపడతాడు. శ్రీవల్లి-కోటేశ్ కి అన్యాయం జరిగినా నోరు విప్పలేకపోయాను, రుద్రాణి నువ్వు చేసింది తప్పు అని అరిచి లోకానికి చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోయాను, కాళ్లకు మట్టి అంటకుండా పెరిగిన పిల్లలకి కాళ్లకి చెప్పుల్లేకుండా ఉన్న పరిస్థితి తీసుకొచ్చాను, కడుపునిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను..నా దగ్గర ఇంకా తగ్గించుకునేందుకు ఏముందని అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. నేను బాధపడానని నాకు ధైర్యం చెబుతున్నావు కానీ నేనేంటి, నేనెవరు అని క్వశ్చన్ చేస్తాడు. డాక్టర్ ని అయిండి వైద్యం చేయలేకపోతున్నాను, మనిషిని అయిండి సాయం చేయలేకపోతున్నాను, తండ్రినా- పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను, భర్తనా-నీకు అండగా ఉండలేకపోతున్నా అంటాడు. స్పందించిన దీప..మీకు ఇష్టమైన పని-మీరు చేతనైన పని ఏదో ఒకటి చేయండి చాలు అప్పుడైనా మీకు ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయంటుంది దీప.

Also Read: మోనితని ఇంట్లోంచి గెెంటేసిన సౌందర్య, రుద్రాణి దగ్గరకు చేరిన మోనిత బిడ్డ, కార్తీకదీపం డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
 సౌందర్య స్టోర్ రూమ్ కి వెళ్లి పిల్లల పుస్తకాలు చూసి వాళ్లు అడిగే ప్రశ్నలు గుర్తుచేసుకుని ఏడుస్తుంది. ఇంతలో స్టోర్ రూమ్ లో మోనిత-కార్తీక్ ఫొటో చూసి కోపంతో రగిలిపోతుంది. ఈ ఫొటోను తీసుకెళ్లి విసిరేయకుండా ఎందుకింత భద్రంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని కోపంగా విసిరేస్తుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడకు వచ్చిన మోనిత ఆ ఫొటోని పట్టుకుంటుంది. నమస్తే ఆంటీ గారూ మీరు విసిరేస్తే క్యాచ్ పట్టుకున్నా బాగానే పట్టుకున్నా...నేను దీనికోసమే వచ్చాను..నా మనసు తెలుసుకున్నట్టే ఇచ్చారు..న్యూ ఇయర్ గిఫ్ట్ గా భావిస్తా అంటుంది. కొన్ని అనుకుంటాం కానీ అవి జరగవు, మీరు నన్ను ఫ్యామిలీ లోంచి పంపిద్దామనుకున్నారు, నేను దగ్గరవుదాం అనుకుంటున్నా అంటుంది. మిడిసిపడకు మోనిత అని సౌందర్య అంటే.. నా కార్తీక్-నా బిడ్డతో ఈ ఇంట్లో అడుగుపెడతాను అప్పుడు మీరే హారతిచ్చి రమ్మంటారని వెళ్లిపోతుంది. 

Also Read: సీతాకోక చిలుకల్లా రెండు మనసులు ఊగిన నెమలి ఈక ఉయ్యాల, గుప్పెడంత మనసు ఎపిసోడ్ అంతా ప్రేమమయం..
ఉయ్యాల్లో ఉన్న బాబుని ఒళ్లోకి తీసుకున్న కార్తీక్.. అనుకోని అతిథిగా మా జీవితాల్లోకి వచ్చావ్, ఈ పేదరికంలో నిన్నెలా బాగా చూసుకోవాలి అనుకుంటాడు.  ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చి శ్రీవల్లి - కోటేశ్ కొడుకయ్యావు. వాళ్లు వెళ్లిపోయారు నువ్వు ఒంటరిగా మిగిలిపోయావ్.. నీకు మేం ఉన్నాం. నా బిడ్డలతో సమానంగా చూసుకుంటాను నానుంచి ఎవ్వరూ వేరు చేయలేరు అనుకుంటాడు. బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి పాలు తీసుకొస్తా అంటూ వెళతాడు కార్తీక్. మరోవైపు రుద్రాణి... దీపా పిండివంటలు చేస్తూ బాకీ తీరుస్తావా, ఎన్ని వంటలు చేసి తీరుస్తావు, నేను వంటలు ఆపడమే కాదు నీ మొగుడి చేతే ఆపేలా చేయిస్తా అనుకుంటుంది.

Also Read: వసుపై ప్రేమతో ప్లేట్ ఫిరాయించిన రిషి, మహేంద్ర క్లాస్-జగతి షాక్, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
Also Read:  గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
SRH vs MI: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
SRH vs MI: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Pahalgam Baisaran Valley: బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ -  వాహనాలు కూడా వెళ్లవు - అందుకే టెర్రరిస్టుల ప్లాన్ ?
బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ - వాహనాలు కూడా వెళ్లవు - అందుకే టెర్రరిస్టుల ప్లాన్ ?
Saeed Hussain Shah killed: హిందువుల కోసం ప్రాణం ఇచ్చిన ముస్లిం -  పెహల్గాం దాడి ఘటనలో మరో కోణం
హిందువుల కోసం ప్రాణం ఇచ్చిన ముస్లిం - పెహల్గాం దాడి ఘటనలో మరో కోణం
Karshmir Terror Attack: ఉగ్రవాదుల దాడిలో పెద్దల్ని కోల్పోయిన రెండు తెలుగు కుటుంబాలు - వీరి కన్నీళ్లకు సమాధానం ఎలా?
ఉగ్రవాదుల దాడిలో పెద్దల్ని కోల్పోయిన రెండు తెలుగు కుటుంబాలు - వీరి కన్నీళ్లకు సమాధానం ఎలా?
Pahalgam Terror Attack Viral Photo: ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
Embed widget