అన్వేషించండి

Onion Crop: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు, కానీ అది కూడా వారిని ఆగం చేసింది!

Onion Crop: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చింది. కానీ గిట్టుబాట ధర లేకపోవడంతో వాటిని మార్కెట్లకు తీసుకెళ్లడం కూడా దండగే అనుకున్నారు. ఇంకేముంది పండించిన చేనులోనే పంటను దున్ని నాశనం చేశారు.

Onion Crop: కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని సింగాపురానికి చెందిన మహదేవ్, వెంటకేష్ లు ఐదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. ఉల్లి వేసి పంట కూడా పండించారు. కానీ ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి పంటను పండించిన పొలంలోనే దున్నేశారు. ఐదు ఎకరాలకు మూడు లక్షల 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉల్లిగడ్డకు మార్కేట్ లో గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నామని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కిలోకు 10 రూపాయలు మాత్రమే ఉండటంతో చాలా నష్టపోతున్నామని.. కనీసం పెట్టబుడి డబ్బులు కూడా రావట్లేదని రైతులు వివరిస్తున్నారు. 

కనీస గిట్టుబాటు ధర లేనప్పుడు వాటిని తవ్వి, మార్కెట్లకు తీసుకు రావడం కంటే పొలంలో దున్నేయడమే మంచిదని చెబుతున్నారు. ఉల్లి పంటను సాగు చేసి లోడు తీసేసరికి దాదాపు రెండు లక్షల రూపాయల నష్టం వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యను గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తు్న్నారు. 

ఏపీలో ఉల్లి పరిస్థితి ఇదీ...! 
రాష్ట్రంలో ఎక్కువగా కర్నూలు జిల్లాలోనే ఉల్లిని సాగు చేస్తుంటారు. ఉల్లిగడ్డ అనగానే అందరికీ గుర్తొచ్చేది కర్నూల్ లోని ఉల్లిగడ్డే. దేశీయ మార్కెట్లో దీనికి చాలా ప్రత్యేకత ఉంది. కర్నూల్ కరువు జిల్లానే అయినప్పటికీ.. ఎక్కువ మంది రైతులు ఖరీఫ్ సీజన్ లో ఎక్కువగా ఉల్లిని సాగు చేస్తుంటారు. సామాన్య మధ్య తరగతికి చెందిన రైతులను కూడా ఉల్లి.. కోటీశ్వరులను చేసింది. అలాగే చాలా మంది రైతులు మరింత పేదలుగా మారేందుకు కారణం అయింది. 

దేశవ్యాప్తంగా ఉల్లి పరిస్థితి.. 
దేశ వ్యాప్తంగా ఉల్లిని ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. అయితే అక్కడ పండే ఉల్లి నాణ్యత, రంగు, పరిణాణంలో ప్రత్యేకతను కల్గి ఉంటుంది. కాబట్టి వాటిని దేశీయంగానే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలలో సాధారణంగా మన దేశంలో ఉండే ధర కంటే నాలుగు రెట్లు అధికంగా ఉంటాయి. అయితే మార్కెట్లో మహారాష్ట్ర ఉల్లి ఉంటే వాటి ప్రభావం కారణంగా.. తెలుగు రాష్ట్రాలలో పండుతున్న ఉల్లి ధర పతనమై రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల ఉల్లికి గిరాకి ఎప్పుడు, ఎలా...? 
ఉత్తర భారతదేశంలో ఋతు పవనాల కారణంగా భారీ వర్షాలు కురిసినప్పుడు మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో పంటంతా పాడవుతుంది. అలాంటి సమయాల్లో తెలుగు రాష్ట్రాలలో ఉల్లికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కూడా ఉల్లి ధరలు రెట్టింపై.. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వంటి కొన్ని అంశాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు దళారులు, మరోవైపు ఉల్లికి కుళ్లిపోయే స్వభావం ఉండడం వల్లనే ఎక్కువ నష్టాలు వస్తున్నాయని వివరిస్తున్నారు. 

ఎన్ని ప్రభుత్వాలొచ్చినా మారని పరిస్థితి..
భారతదేశంలో ఇప్పటికీ దాదాపుగా 70 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం చేదని చెప్పడమే తప్ప.. వారికి ఏ ప్రభుత్వాలు సాయం చేసిన దాఖలాలు లేవు. రోజురోజుకు అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నా ఒక్క రైతు పండించిన పంట ధర మాత్రమే పెరగడం లేదు. చాలా మంది రైతులు, కౌలు రైతులు పండించిన పంటకు గిట్టుబాట ధర లేక.. నష్టాల పాలై ఆత్మహత్యలు చేస్కున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితి మారిన నాడే అన్నదాతల బతుకులు గాడిలో పడతాయని అన్నదాతలు చెబుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Akhanda 2 Release Updates: 'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Akhanda 2 Release Updates: 'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
Amaravati Farmers: అమరావతి రైతులు ముందుకొచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
అమరావతి రైతులు ముందుకొచ్చి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
ఫోర్త్ సిటీ కాదు..ఫ్యూచర్ సిటీ! 4 అంటే మరణం, అపశకునమా? రేవంత్ రెడ్డి అందుకే ఈ పేరు ఖరారు చేశారా?
ఫోర్త్ సిటీ కాదు..ఫ్యూచర్ సిటీ! 4 అంటే మరణం, అపశకునమా? రేవంత్ రెడ్డి అందుకే ఈ పేరు ఖరారు చేశారా?
Telangana Global Rising Summit: గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడుల వెల్లువ - మధ్యాహ్నానికే లక్ష కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు!
గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడుల వెల్లువ - మధ్యాహ్నానికే లక్ష కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు!
Embed widget