అన్వేషించండి

PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ

PM Modi : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనుక ఉన్న వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చిరించారు. తన సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకొని భారత్ బయల్దేరారు.

PM Modi :  జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని సంచలనం సృష్టించింది. చాలా ఏళ్ల తర్వాత భారత్‌లో ఈ స్థాయిలో ఉగ్రదాడి జరిగింది. దీంతో సౌదీ అరేబియా అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్న మోదీ తన పర్యటనను అర్థాంతరంగా ముగించేశారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పశ్చిమాసియాలో టూర్‌ రద్దు చేసుకొని భారత్‌కు తిరిగి పయనమయ్యారు. 

మంగళవారం భారతదేశానికి తిరిగి బయలుదేరి ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటారని పిటిఐ వర్గాలు తెలిపాయి. జెడ్డాలో సౌదీ అరేబియా నిర్వహించే అధికారిక విందుకు ప్రధాని మోదీ దూరంగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను కూడా కలవాల్సి ఉంది. అన్నింటినీ రద్దు చేశారు. 

సౌదీ అరేబియా అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్న మోదీ తన పర్యటనను అర్థాంతరంగా ముగించేశారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పశ్చిమాసియాలో టూర్‌ రద్దు చేసుకొని భారత్‌కు తిరిగి పయనమయ్యారు. 

మంగళవారం భారతదేశానికి తిరిగి బయలుదేరి ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటారని పిటిఐ వర్గాలు తెలిపాయి. జెడ్డాలో సౌదీ అరేబియా నిర్వహించే అధికారిక విందుకు ప్రధాని మోదీ దూరంగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను కూడా కలవాల్సి ఉంది. అన్నింటినీ రద్దు చేశారు. 

జెడ్డాలో ఉంటున్న టైంలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి ప్రధానమంత్రి తెలుసుకున్నారు. వెంటనే అమిత్‌షాకు ఫోన్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే జమ్ముకశ్మీర్ వెళ్లి పరిస్థితి నేరుగా సమీక్షించాలని పేర్కొన్నారు. హైలెవల్ కమిటీ మీటింగ్ నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా జమ్ముకశ్మీర్‌వెళ్లారు. 

దాడి గురించి తెలుసుకున్న మోదీ... ఉగ్రచర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ దారుణమైన చర్య వెనుక ఉన్న వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.  Xలో ఒక పోస్ట్‌ పెట్టిన ప్రధానమంత్రి ఇలా అన్నారు.... “జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అయిన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు సాధ్యమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ”

ఈ దాడికి పాల్పడిన వారికి తీవ్ర హెచ్చరిక చేశారు ప్రధానమంత్రి మోడీ "ఈ హేయమైన చర్య వెనుక ఉన్నవారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతాం. వారిని వదిలిపెట్టబోము! వారి విధ్వంసం ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదు. ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం మరింత బలపడుతుంది." అని నొక్కి చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget