అన్వేషించండి

World Earth Day 2025 : వరల్డ్ ఎర్త్​ డే ప్రారంభించడానికి కారణమిదే.. ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా?

World Earth Day : పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రతి ఏడాది వరల్డ్ ఎర్త్​ డేని నిర్వహిస్తున్నారు. అయితే దీనిని ప్రారంభించడానికి రీజన్ ఏంటో.. ఈ ఏడాది థీమ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Earth Day 2025 : పర్యావరణ సమస్యలపై అవగాహన కల్పిస్తూ.. భూమిపై ప్రభావం చూపే సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన వరల్డ్ ఎర్త్​ డే (World Earth Day) నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సాహిస్తున్నారు. అయితే అసలు దీనిని ఎప్పుడు ప్రారంభించారు. ఈ స్పెషల్ డే వెనుక రీజన్ ఏంటి.. ఈ ఏడాది ఫాలో అయ్యే థీమ్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

ఎలా మొదలైందంటే.. 

వరల్డ్ ఎర్త్​ డేని తొలిసారి 1970లో ప్రారంభించారు. 1962లో యూఎస్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్​ భూమి ప్రమాదంలో ఉందని తెలిపారు. అప్పటి నుంచి ఎర్త్ డేని పాటించాలని కోరారు. ఆ తర్వాత 1969లో జరిగిన జరిగిన oil spill తర్వాత సెనేటర్ గేలార్డ్ నెల్సన్ అమెరికాలో 1970లో ఏప్రిల్ 22వ తేదీన భూమి దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 2 కోట్లమంది అమెరికన్లు పాల్గొనడంతో పర్యావరణ పరిరక్షణకు పలు చట్టాలు, ఏజెన్సీలు మొదలయ్యాయి. 

1990 నాటికి ప్రపంచవ్యాప్తంగా 141 దేశాలకు ఈ ఎర్త్​ డే విస్తరించింది. దీనిలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పర్యావరణ పరిరక్షణకు మద్ధతునివ్వడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పలు కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రచారాలు చేస్తున్నారు. 2025, ఏప్రిల్ 22తో ఎర్త్ డే 55వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. దీంతో మంచి థీమ్​ని తెరపైకి తీసుకొచ్చారు. 

2025 ఎర్త్​ డే థీమ్

ప్రతి సంవత్సరం ఎర్త్​ డే సందర్భంగా ఓ కొత్త థీమ్​ని తెరపైకి తెస్తారు. ఈ ఏడాది మన శక్తి – మన గ్రహం (Our Power, Our Planet) అనే థీమ్​తో వచ్చారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పత్తి విద్యుత్ సామర్థాన్ని మూడింతలు పెంచడమే దీని లక్ష్యం. విద్యుత్ ఆదా చేస్తూ కూడా పర్యావరణానికి మేలు చేయవచ్చని చెప్తూ ఈ థీమ్​ని తీసుకొచ్చారు.

ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ఇప్పటికే ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా జూట్​ బ్యాగ్స్​, పేపర్ బ్యాగ్స్​ ఉపయోగించవచ్చు. అలా ప్లాస్టిక్​కి ఆల్ట్రనేటివ్​గా వివిధ వస్తువులు ఉపయోగించవచ్చు. 2040 నాటికి ప్లాస్టిక్ రహిత భూమిని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.

ఎర్త్ డే నిర్వహించడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుంది. దీనివల్ల భూమిని కాపాడుకోవాలన్న బాధ్యత పెరుగుతుంది. ప్రభుత్వ సంస్థలు, ప్రజలు కలిసి భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే భావను పెంచుతుంది. ఈ ఎర్త్​ డే సందర్భంగా చాలామంది వృక్షాలు నాటుతారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుతారు. ఇది మిగిలిన వారిలో అవగాహన కల్పిస్తుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget