అన్వేషించండి

Telangana Local Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీల ఫోకస్ - ఏప్రిల్‌లో పంచాయతీ, మున్సిపల్ పోల్స్ ఖాయమా?

Telangana: స్థానిక ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పథకాలు అమలు చేయగానే నిర్వహించాలనుకుంటున్నారు.

When will the Telangana government conduct the local elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేస్తున్నాయన్న ప్రచారం ఏడాదిగా జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించేసి  పాలనపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ అనుకున్నారని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ ఇప్పుడు మున్సిపాలిటీల గడువు ముగిసినా ఇంకా ఎన్నికలు పెట్టలేదు.   ఇప్పటి వరకూ కనీసం ప్రక్రియ కూడా ప్రారంభించలేదు 

తేల్చుకోలేకపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 

గత డిసెంబర్‌లో  సంక్రాంతి పండుగ అవగానే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్లు ప్రారంభమవుతాయని మీడియాకు లీకులు ఇచ్చారు.  జనవరి నెల ముగుస్తున్నా   ఇప్పటికీ క్లారిటీ లేకుండాపోయింది.  పంచాయతీల పదవి కాలం ముగిసి చాలా రోజులు అయింది. స్పెషలాఫీసర్ల పాలనలోకి పోయాయి . పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే క్యాడర్ కు కొన్ని పదవులు వచ్చి ఉండేవన్న అభిప్రాయం ఉంది. మాములుగా అయితే వాటి గడువు ముగియక ముందే ఎన్నికలు నిర్వహించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆలోచనలు చేస్తూనే ఉంది.

పథకాలు, బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు సవాళ్లు  ! 

పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి.  బీసీలకు 42  శాతం రిజర్వేషన్‌ లెక్క తేలాల్సి ఉంది. ఎదుకంటే  రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళతామని  రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఆ కమిటీ నివేదికను అనుసరించి పంచాయతీలు మున్సిపాలిటీ ల ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకోవాలి. అయితే న్యాయపరమైన సమస్యలు వస్తే ఎన్నికలు ఆగిపోతాయి. అయితే ప్రభుత్వం తల్చుకుంటే.. వెంటనే ఎన్నికలు పెట్టవచ్చు. కానీ రాజకీయంగా అనుకూలమైన వాతావరణం కోసం ఎదురుచూస్తోందన్న అభిప్రాయం ఉంది. 

Also Read: గద్దర్ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి, మా మద్ద అన్ని ఆధారాలున్నాయి: కేఏ పాల్ డిమాండ్

పెద్దఎత్తున పథకాలను అమలు చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటోంది.  రైతు భరోసాతో పాటు భూమిలేని రైతు కూలీలకు సాయం, ఇందిరమ్మ ఇళ్లు ఇలా పెద్ద ఎత్తున లబ్దిదారుల్ని ఖరారు చేసి.. వారికి తొలి విడత సాయంచేసి ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్రకారం పథకాల అమలు ప్రారంభించారు.  తెలంగాణ ప్రభుత్వానికి నిధుల కొరత వెంటాడుతోంది. అందుకే పథకాల అమలు ప్రారంభించారు కానీ అందరికీ సాయం ఖాతాల్లో పడేసరికి కొంత సమయం పడుతుంది.   ప్రభుత్వానికి నిధుల లభ్యతను బట్టి పథకాలు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లనున్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అది అయిపోయే వరకూ వేచి చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. 

Also Read: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
Telangana News: రికార్డు వేగంతో కుల గణన,​ సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
రికార్డు వేగంతో కుల గణన,​ సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
Sivakarthikeyan Vs Vijay Antony: శివకార్తికేయన్ వర్సెస్ విజయ్ ఆంటోనీ... తమిళ టైటిల్ గొడవ, ఇంతకీ 'పరాశక్తి' ఎవరి సొంతం?
శివకార్తికేయన్ వర్సెస్ విజయ్ ఆంటోనీ... తమిళ టైటిల్ గొడవ, ఇంతకీ 'పరాశక్తి' ఎవరి సొంతం?
YSRCP Leaders : కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?
కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISRO 100th Launch Journey | సైకిల్ మీద తిప్పలు, ఎడ్ల బండి మోతలు..అన్నీ దాటి ఈ రోజు సెంచరీ | ABP DesamMaha Kumbh 2025 Prayag Raj Drone VisualsMaha Kumbh 2025 Mouni Amavasya | మౌని అమావాస్య రోజు కుంభమేళాలో మహా అపశృతి | ABP DesamCM Yogi Adityanath Request Devotees | నాలుగు కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్న యోగి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
Telangana News: రికార్డు వేగంతో కుల గణన,​ సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
రికార్డు వేగంతో కుల గణన,​ సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
Sivakarthikeyan Vs Vijay Antony: శివకార్తికేయన్ వర్సెస్ విజయ్ ఆంటోనీ... తమిళ టైటిల్ గొడవ, ఇంతకీ 'పరాశక్తి' ఎవరి సొంతం?
శివకార్తికేయన్ వర్సెస్ విజయ్ ఆంటోనీ... తమిళ టైటిల్ గొడవ, ఇంతకీ 'పరాశక్తి' ఎవరి సొంతం?
YSRCP Leaders : కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?
కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?
Shruti Haasan : బర్త్​డే ఫోటోలు షేర్ చేసిన శృతి హాసన్.. ఈ ఏడాదితో 39లోకి అడుగుపెట్టేసిందిగా
బర్త్​డే ఫోటోలు షేర్ చేసిన శృతి హాసన్.. ఈ ఏడాదితో 39లోకి అడుగుపెట్టేసిందిగా
AP New DGP:  ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా - 31న ద్వారకా తిరమలరావు రిటైర్
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా - 31న ద్వారకా తిరమలరావు రిటైర్
Kohli Vs Smith: విరాట్ కంటే స్మిత్ గొప్ప.. అందుకు సాక్ష్యం అవే.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆసీస్ దిగ్గజం
విరాట్ కంటే స్మిత్ గొప్ప.. అందుకు సాక్ష్యం అవే.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆసీస్ దిగ్గజం
Telangana News: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్
Embed widget