అన్వేషించండి

కారు లోన్ బెటరా, సేవింగ్స్ బెటరా? రూ.8 లక్షల కారు కోసం నెలకు ఎంత ఆదా చేయాలి?

కొత్త కారు కొనాలనుకునే వారు నెలకు ఎంత పొదుపు చేయాలి? రూ.8 లక్షల కారు ధర 5 ఏళ్లలో ఎంత అవుతుంది? సేవింగ్స్‌ ప్లాన్‌ పూర్తి వివరాలు తెలుసుకోండి.

Monthly investment for a new car: ఒకప్పుడు కారు విలాసానికి ప్రతీకగా భావించేవారు. కానీ ఇప్పుడు అదే కారు అవసరంగా మారింది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ప్రయాణాలు, పిల్లల చదువులు వంటి అవసరాల కారణంగా సొంత కారు ఉండటం అనేక మందికి ప్రాధాన్యతగా మారింది. అయితే కారు కొనాలనే ఆలోచన వచ్చిన వెంటనే చాలా మందిని వేధించే ప్రశ్న ఒక్కటే. అంత పెద్ద మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలి? లోన్ తీసుకోవాలా? లేక ముందుగానే పొదుపు చేసి కొనాలా?

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన ప్రణాళికతో ముందుకు వెళితే కారు కొనుగోలు ఎలాంటి భారంగా మారదు. పైగా లోన్ వడ్డీ భారం లేకుండా మీ కలల కారును సొంతం చేసుకోవచ్చు.

ముందుగా బడ్జెట్ నిర్ణయించుకోవాలి

కారు కొనుగోలు ప్రణాళికలో మొదటి అడుగు బడ్జెట్‌ను నిర్ణయించడం. ప్రస్తుతం భారత మార్కెట్లో మంచి మధ్యతరగతి కుటుంబ కారు ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంది. మీ ఆదాయం, కుటుంబ అవసరాలు & భవిష్యత్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఒక బడ్జెట్‌ను ఖరారు చేయాలి.

ఉదాహరణకు మీరు రూ.8 లక్షల ఆన్‌రోడ్‌ ధరతో వచ్చే కారు కొనాలని భావిస్తున్నట్లయితే, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

కారు లోన్ తీసుకోవడం ఎంతవరకు మంచిది?

ప్రస్తుతం చాలా బ్యాంకులు కారు విలువలో 80 నుంచి 90 శాతం వరకు రుణం అందిస్తున్నాయి. రూ.8 లక్షల కారు కొనుగోలు చేయాలంటే సుమారు రూ.1.60 లక్షలు డౌన్ పేమెంట్‌గా చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని 5 నుంచి 7 సంవత్సరాల పాటు EMIల రూపంలో చెల్లించవచ్చు. కారు లోన్ తీసుకోవడం చాలా సులభంగా అనిపించినా... రుణంపై వడ్డీ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్‌టీల కారణంగా కారు వాస్తవ ధర కంటే ఇంకా ఎక్కువ మొత్తం తిరిగి చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా సంవత్సరాల పాటు EMI చెల్లించడం కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

పొదుపు చేసి కొనడం ఎందుకు ఉత్తమం?

కొంతకాలం పాటు ఓపికగా పొదుపు చేసి కారు కొనుగోలు చేస్తే వడ్డీ భారం ఉండదు. అలాగే నెలవారీ కిస్తీ ఒత్తిడి కూడా ఉండదు. ఆర్థికంగా మరింత ప్రశాంతత లభిస్తుంది. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కారు ధరలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంటాయి. గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, భారతదేశంలో కార్ల ధరలు సగటున ఏడాదికి 10 శాతం వరకు పెరుగుతున్నాయి. అంటే ప్రస్తుతం రూ.8 లక్షల విలువైన కారు ధర మరో ఐదేళ్ల తర్వాత సుమారు రూ.12 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. అందుకే మీ సేవింగ్స్ లక్ష్యాన్ని కూడా అదే స్థాయిలో నిర్ణయించుకోవాలి.

ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

ఐదేళ్ల కాలపరిమితి ఉన్న లక్ష్యాల కోసం నిపుణులు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లను సూచిస్తున్నారు. ఈ ఫండ్లు... ఈక్విటీ & డెట్ ఆస్తులు రెండింటిలోనూ పెట్టుబడి పెడతాయి. మార్కెట్ మంచి స్థితిలో ఉన్నప్పుడు ఇవి అధిక రాబడులు అందించే అవకాశం ఉండగా, మార్కెట్ ఒడుదొడుకుల్లో ఉన్నప్పుడు డెట్ పెట్టుబడులు రక్షణ కల్పిస్తాయి.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెడితే పెద్ద లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు.

ఐదేళ్లలో రూ.12 లక్షలు కూడబెట్టడానికి నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి?

సగటు వార్షిక రాబడి 8 శాతం వస్తుందని అనుకుంటే, నెలకు రూ. 16,346 పెట్టుబడి పెట్టాలి.

సగటు వార్షిక రాబడి 10 శాతం వస్తుందని అనుకుంటే, నెలకు రూ. 15,550 పెట్టుబడి పెట్టాలి.

సగటు వార్షిక రాబడి 12 శాతం వస్తుందని అనుకుంటే, నెలకు రూ. 14,796 పెట్టుబడి పెట్టాలి.

ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం, రాబడి తక్కువ వచ్చినా లక్ష్యం చేరుకునేలా నెలకు రూ. 16,346 వరకు పెట్టుబడి పెట్టడం సురక్షితమైన మార్గం. ఒకవేళ రాబడి ఎక్కువగా వస్తే ఆ అదనపు మొత్తంతో మీరు మరింత ప్రీమియం కారు లేదా అదనపు ఫీచర్లతో కూడిన మోడల్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

మొత్తంగా చూస్తే, కారు కొనుగోలు అనేది కేవలం భావోద్వేగ నిర్ణయం కాకుండా ఆర్థిక ప్రణాళికతో తీసుకోవాల్సిన నిర్ణయం. సరైన పొదుపు అలవాటు, క్రమబద్ధమైన SIP పెట్టుబడి & దీర్ఘకాలిక ప్రణాళికతో ఎలాంటి రుణభారం లేకుండా మీ కలల కారును మీ ఇంటి ముందుకు తీసుకురావచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

526 km లాంగ్‌ రేంజ్‌తో రాబోతున్న కియా సైరస్ ఎలక్ట్రిక్‌ కారు - తెలుగు రాష్ట్రాల్లో ధర, బ్యాటరీ ఆప్షన్లు, ఫీచర్లు తెలుసుకోండి
కియా సైరస్ EV వచ్చేస్తోంది - ఎన్ని వేరియంట్లు ఉన్నయి? వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఇస్తారు? పూర్తి వివరాలు
ఏథర్ రిజ్టాకు LFP బ్యాటరీ ఆప్షన్‌ - కొత్త బ్యాటరీ ప్యాక్‌లు, 900W ఛార్జర్‌తో కీలక అప్‌డేట్
యూత్‌ మెచ్చిన ఏథర్ స్కూటర్లకు ఫ్రెష్‌ అప్‌డేట్‌ - చిన్న బ్యాటరీలతోనే సేమ్‌ రేంజ్, ఛార్జింగ్‌లో మరింత వేగం!
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ 2026లో ఏం కొత్తగా మారనుంది? కొత్త ఇంజిన్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు! రేటు ఎంత ఉండొచ్చు?
మారుతి బ్రెజ్జా 2026 మోడల్‌ ఎంట్రీకి మరో 10 రోజులు కూడా లేదు - కొత్త ఇంజిన్‌తో పాటు మిడిల్‌క్లాస్‌ మెచ్చే ఫీచర్లు!
మీ డ్రైవింగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే 8 స్మార్ట్ కార్ గాడ్జెట్లు - వీటిని ఒక్కసారి ట్రై చేస్తే ఇక వదిలిపెట్టరు!
మీ కారులో ఈ స్మార్ట్ గాడ్జెట్లు ఉన్నాయా? సేఫ్టీ నుంచి స్టైల్ వరకు డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ మారిపోతుంది!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget