అన్వేషించండి

Ganesh Chaturthi 2024: కమల్ హాసన్ సినిమాలో ఖైరతాబాద్ వినాయకుడు- ఒక్క అడుగుతో మొదలై గణేష్‌ గురించి తెలుసా?

Khairatabad Ganesh:ఖైరతాబాద్ వినాయకుడు ఏడాదికేడాది ప్రత్యేకతతో రికార్డులు సృష్టిస్తున్నాడు. ఒక్క అడుగుతో మొదలైన ఇక్కడి వినాయక విగ్రహం నేడు 70 అడుగులకు చేరింది.

Hyderabad Ganesh Festival: గణేష్‌ చతుర్థి అంటే ఠక్కున ఖైరతాబాద్ వినాయకుడు గుర్తుకు వస్తాడు. ఈసారి ఎలాంటి విగ్రహం పెడుతున్నారు. ఎత్తు ఎంత ఉంటుంది... అని చాలా మంది ఆరా తీస్తుంటారు. ఈసారి కూడా ప్రజల అంచనాలకు అందనంత స్థాయిలో ఖైరతాబాద్‌లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వినాయక పూజా కార్యక్రమాలు ప్రారంభమై 70 ఏళ్లు అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొదట ఎప్పుడు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు. అనేది పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైన విశేషాలు తెలుస్తున్నాయి. 

ఒక్క అడుగుతో మొదలై...

ప్రజల్లో స్వతంత్ర్య కాంక్షను రగిల్చేందుకు ఉద్యమకారులను సంఘటితం చేసేందుకు తొలిసారిగా ఈ గణేష్ విగ్రహాల ఏర్పాటు సంస్కృతిని తీసుకొచ్చారు బాలగంగాధర్ తిలక్‌. దీంతో వాడవాడలో విగ్రహాలు ఏర్పాటు అయ్యాయి. అలా ఖైరతాబాద్‌లో కూడా గణేషుడు పూజలు అందుకున్నాడు. తొలిసారి ఒక్క అడుగు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ పూజా కమిటీ సభ్యులు. అప్పుడు మొదలైనప్పటికీ 1978 నుంచి నిరంతరంగా ఈ విగ్రహం ఏర్పాటు కొనసాగుతోంది. తొలి విగ్రహాన్ని సింగరి శంకరయ్య అనే కళాకారుడు తీర్చిదిద్దాడు. తర్వాత ఆ వంశస్తులు ఈ ప్రక్రియను ఇంకా కొనసాగిస్తున్నారు. 

Also Read: 70 ఏళ్ల మహాగణపతికి 70 అడుగుల విగ్రహం- ఖైరతాబాద్ గణేషుడి విశేషాలు తెలుసా?

కమల్ హాసన్ సినిమాలో.

1954లో నుంచి తొలిసారిగా ఇలా బహిరంగంగా పెద్ద మండపాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజలు చేస్తున్నారు. 1980లో విగ్రహాన్ని సారథి స్టూడియోలో రూపొందించారు. అక్కడ అప్పటికే కమల్‌హాసన్ నటిస్తున్న సాగర సంగమం షూటింగ్ నడుస్తోంది. అందులో ఓ పాట చిత్రీకరణ కూడా ఈ విగ్రహం ఎదుటే చేశారు. 

విగ్రహం అంటే వాళ్లే..

సింగరి వంశస్తులు మాత్రం మధ్యలో ఓ పదేళ్లు విగ్రహాల తయారీకి దూరంగా ఉన్నారు. మళ్లీ 2000 నుంచి గణేష్ ప్రతిమను తయారూ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొలువుదీరిన 70 అడుగుల మహాగణపతి విగ్రహం కూడా సింగరి వంశస్తులు తీర్చిదిద్దిందే. 

2022లో ఖైరతాబాద్‌లో తొలిసారిగా మట్టితో వినాయక విగ్రహాన్ని రూపొందించారు. 50 అడుగుల ఎత్తులో  మట్టితో శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిని ప్రతిష్టించి పూజలు చేశారు. ఎడ‌మ‌వైపున శ్రీ తిశ‌క్తి మ‌హా గాయ‌త్రి దేవి, కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి విగ్ర‌హాలు ఉంచారు. 

Also Read: సింగపూర్ లో సంపెగ, నేపాల్ లో తంత్ర, శ్రీలంకలో పిళ్లయార్..విదేశాల్లో మన గణపయ్య!

ఈ స్థాయి భారీ విగ్రహాలు తయారు చేయించి ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం అంత ఈజీకాదు. కానీ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని మాత్రం ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తుంటారు. ఇప్పుడు పూజలు అందుకుంటున్న 70 అడుగుల విగ్రహాన్ని కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు అందిస్తామని చెబుతున్నారు పూజా కమిటీ. ఇలా ఈ స్థాయిలో భారీ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం ప్రపంచ చరిత్రలోనే ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇప్పటికే చాలా రికార్డులను ఖైరతాబాద్‌ వినాయకుడు సొంత చేసుకున్నాడని ఇప్పుడు మరో రికార్డు తన ఖాతాలో వేసుకోబోతున్నాడని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Saraswati Power Lands: సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Saraswati Power Lands: సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
Embed widget