అన్వేషించండి

AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?

AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. సాగుతున్న వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేసింది.

AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2(Group 2) నోటిఫికేషన్ వివాదాల మధ్య కొనసాగుతోంది. ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ పరీక్ష వాయిదా పడుతూ వస్తోంది. వివాదాలతో పరీక్ష వాయిదా పడుతూ వస్తోంది. గతేడాదిలో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ నెల 23న మెయిన్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ వివాదాలు మాత్రం సమసిపోలేదు. రోస్టర్ విధానం సరిగా లేదని కొందరు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ విధానంలోనే కొనసాగితే తమ జీవితాలు నాశనమైపోతాయని వాపోతున్నారు. కాస్త ఆలస్యమైనా ప్రస్తుతానికి ఈ ఆదివారం జరిగే మెయిన్స్ పరీక్ష వాయిదా వేసి తప్పులను సరిచేయాలని అభ్యర్థిస్తున్నారు. వాళ్లకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నారు. ఈ డిమాండ్ తీవ్రం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)కీలక నిర్ణయం తీసుకుంది. 

మళ్లీ పోస్ట్, జోనల్ ప్రిపరెన్స్

వేల మంది అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. మరోసారి పోస్టు, జోనల్‌ ప్రిపరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. పరీక్షలు రాసిన అనంతరం దీనికి అవకాశం ఇస్తామని పేర్కొంది. ఫలితాలు వచ్చిన తర్వాత సర్టిఫికేట్‌ వెరిఫికేషన్ సమయంలో ఈ ప్రక్రియ చేపడతామని తెలిపింది. ఇప్పటికే ఆలస్యం అయినందుకు పరీక్ష వాయిదా వేసేందుకు మాత్రం ఏపీపీఎస్సీ సిద్ధంగా లేదు అని అర్థమవుతుంది. తప్పులున్న ఉన్నమాట వాస్తమేనని అంగీకరించిన ఏపీపీసీఎస్సీ మధ్యే మార్గంగా ఈ ఆలోచన చేస్తోంది. 

23న మెయిన్స్ పరీక్ష 

గ్రూప్‌2 మెయిన్స్ పరీక్ష 92,250 మంది రాయబోతున్నారు. ఈ పరీక్ష ఈ ఆదివారం(ఫిబ్రవరి 23) నాడు జరగనుంది. రెండు పూటలు జరిగే పరీక్షల కోసం పదమూడు జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.  ఈ పరీక్షనే వాయిదా వేయాలని అభ్యర్థులు హైకోర్టుకు కూడా వెళ్లారు. దీనిపై గురువారం తీర్పు వెల్లడించిన కోర్టు గ్రూప్‌ 2 వాయిదా వేయడానికి నిరాకరించింది. 

Also Read: మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన

పరీక్ష వాయిదా కోరుతున్న అభ్యర్థులు 

గ్రూప్‌2 వాయిదా వేయడానికి కోర్టు, ఏపీపీఎస్సీ నిరాకరించడంతో అభ్యర్థులంతా రోడ్డుపైకి వచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండి గ్రూప్‌ 2కి సిద్ధమవుతున్న వారంతా ఆందోళనలు చేపట్టారు. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని ప్రభుత్వమే అంగీకరించిన వేళ కచ్చితంగా వాయిదా వేయ్యాలని డిమాండ్ చేశారు. అన్ని తప్పులు సవరించిన తర్వాత పరీక్ష పెట్టడానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. వాళ్ల ఆందోళనలకు కాంగ్రెస్, వైసీపీ మద్దతు ప్రకటించాయి. 

Image

2023లో నోటిఫికేషన్...కొనసాగుతున్న వివాదం

ఇప్పుడు జరుగుతున్న పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ 2023లో వచ్చింది. డిసెంబర్ 7వ నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత ఏడాది అంటే 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష పెట్టారు. అనంతరం జరగాల్సిన మెయిన్స్ పరీక్ష ఈ రోస్టర్, మరికొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఆ పరీక్ష ఇప్పుడు పెట్టేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. దీన్ని కూడా వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.   

Also Read: 23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget