అన్వేషించండి

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

గత ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ద్వారా జరిగిన మద్యం విక్రయాలు, విధానాలలో అక్రమాలు జరిగాయని అభియోగాలున్నాయి. ఈ కేసులో మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.

 AP Liquor Scam | న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మిథున్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతం వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న  మద్యం కుంభకోణం (AP Liquor Scam) వ్యవహారంలో ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు అందాయి. ఈ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు, ఈ నెల 23న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని మిథున్ రెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేశారు. ఆ రోజున మిథున్ రెడ్డి వ్యక్తిగతంగ విచారణకు హాజరై తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇదే కేసులో ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం తెలిసిదే. కీలక నేతలకు వరుసగా నోటీసులు అందుతుండటంతో ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పన, నిధుల మళ్లింపు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అధికారుల బృందం వారిని ప్రశ్నించే అవకాశం ఉంది.

కేసు బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ..
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ద్వారా జరిగిన మద్యం విక్రయాలు, ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు, నగదు రూపంలో జరిగిన లావాదేవీలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వానికి 3 వేల కోట్లకు పైగా నష్టం వాటల్లిందని, వాటిని వైసీపీ నేతలు దారి మళ్లించి లబ్ది పొందారని ఛార్జ్ షీట్‌లో అధికారులు ప్రాథమికంగా పొందుపరిచారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ సైతం ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వ విధానాల వల్ల అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎక్కడికి మళ్లింది అనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు. వరుసగా వైసీపీ ఎంపీలకు నోటీసులు అందడంపై అధికార, ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుండగా, అవినీతి బయటపడుతోందని కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Advertisement

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget