అన్వేషించండి

Paddy cultivation in Andhra Pradesh: తెలంగాణలో రికార్డులు - ఏపీలో తగ్గిపోతున్న వరి దిగుబడి - ఎందుకిలా జరుగుతోంది?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వరి సాగు తగ్గిపోతోంది. దీనిపై పలు వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రైతులు మార్పు కోరుకుని అభివృద్ధి చెందుతున్నారన్న గణాంకాలు వెలుగులోకి వస్తున్నాయి.

Paddy cultivation in Andhra Pradesh declining:   తెలంగాణ వరి సాగులో రికార్డులు సృష్టిస్తూ  భారతదేశ ధాన్యాగారంగా  అవతరిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పదేళ్లుగా వరి సాగు విస్తీర్ణం పెరగకపోగా స్వల్పంగా తగ్గింది. దీనిపై వివిధ వర్గాల్లో  ఆసక్తికర చర్చ నడుస్తోంది.  కానీ వరి సాగు పెరగడమే వ్యవసాయాభివృద్ధికి ఏకైక కొలమానం కాదు. ఏపీ రైతులు ఆహార భద్రత  నుంచి  ఆదాయ భద్రత వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. వరి కంటే అత్యధిక లాభాలనిచ్చే ఆక్వాకల్చర్ , ఉద్యానవన పంటల వైపు మళ్లడం వల్ల ఏపీ ఆర్థిక వ్యవస్థ  లో వ్యవసాయ రంగం వాటా  30 శాతానికి పైగా  ఉందని గణాంకాలు చెబుతున్నాయి.  ఇదే సమయంలో తెలంగాణలో ఇది కేవలం 16 శాతంగానే  ఉంది. 

వరికి పెట్టుబడి ఎక్కువ .. ఆదాయం తక్కువ! 

వరి సాగులో పెట్టుబడి ఖర్చులు, కూలీల కొరత,  మద్దతు ధరలో ఒడిదుడుకులు రైతుకు నికర లాభాన్ని తగ్గించేస్తున్నాయి. అందుకే ఏపీలోని కోస్తా తీర ప్రాంత రైతులు తెలివిగా వరి పొలాలను రొయ్యల చెరువులుగా మారుస్తున్నారు. ఫలితంగా, నేడు దేశం నుండే జరుగుతున్న రొయ్యల ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో  నిలిచింది. ఒక ఎకరం వరిలో వచ్చే ఆదాయం కంటే, ఆక్వా రంగంలో మూడు నాలుగు రెట్లు అధిక లాభం పొందుతూ రైతులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటున్నారు. కేవలం వరి మీదనే ఆధారపడకుండా విభిన్న రంగాల్లో రాణించడం ఏపీ వ్యవసాయ రంగ పరిణతికి నిదర్శనంగా భావిస్తున్నారు. 

రాయలసీమలోనూ మారిన పంటల తీరు 

రాయలసీమ  మెట్ట ప్రాంతాల్లో కూడా రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే) పంటల కంటే ఎక్కువ విలువనిచ్చే  పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మిరప, వేరుశనగతో పాటు మామిడి, అరటి వంటి ఉద్యానవన పంటల సాగులో ఏపీ నేడు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం పొందే ఈ పంటలు మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోగలవు. వరి సాగు విస్తీర్ణం పెరగకపోవడం అనేది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు, అది మారుతున్న కాలానుగుణంగా రైతులు ఎంచుకున్న లాభదాయక మార్గమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యతలు వేరు 

తెలంగాణ ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాధాన్యతలు పూర్తిగా భిన్నమైనవి. తెలంగాణ భారీ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా సాగులోకి వచ్చిన భూముల్లో వరిని ప్రోత్సహిస్తుంటే, ఏపీ మాత్రం ఉన్న భూముల్లో గరిష్ట విలువను  సృష్టించడంపై దృష్టి పెట్టింది. పండిన పంటను నేరుగా అమ్మేయకుండా ప్రాసెసింగ్ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడమే ఏపీ ప్రస్తుత వ్యూహం. దేశానికి అన్నం పెట్టే స్థాయిని కాపాడుకుంటూనే, రైతుల జేబుల్లో ఎక్కువ డబ్బు చేరాలనే లక్ష్యంతో ఏపీ రైతులు వాణిజ్య పంటల వైపు వెళ్లడం ఆర్థికంగా అత్యంత ఆరోగ్యకరమైన పరిణామం.

కేవలం వరి పండించడం మాత్రమే వ్యవసాయం కాదు. భూమిని, నీటిని సమర్థవంతంగా వాడుకుంటూ రైతుకు గరిష్ట ఆదాయాన్ని అందించే పంటలే నిజమైన ప్రగతికి సంకేతం. ఏపీ రైతులు పాత పద్ధతుల నుండి బయటపడి పారిశ్రామిక వ్యవసాయం వైపు మళ్లడం ద్వారా భవిష్యత్తు సవాళ్లకు సిద్ధమవుతున్నారని అనుకోవచ్చు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
Janasena: మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉద్రిక్తత - కార్ల ధ్వంసం, నిందితుడు అరెస్ట్
మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉద్రిక్తత - కార్ల ధ్వంసం, నిందితుడు అరెస్ట్
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Kavitha Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
Advertisement

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
Vijay Sangeetha Divorce: విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దళపతి విజయ్... తమిళనాడులో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్
విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దళపతి విజయ్... తమిళనాడులో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్
Kavitha: లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్! తదుపరి అడుగులెటు !
లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్! తదుపరి అడుగులెటు !
KTR On Delhi Liquor Scam: కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
Friday Stock Markets: మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
Holi Health Tips : హోలీ రోజున ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ సేఫ్‌! 
హోలీ రోజున ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ సేఫ్‌! 
Rakshith Setty: మళ్ళీ ప్రేమలో పడలేదు, పెళ్ళీ చేసుకోలేదు... ఇంకా ఒంటరిగా రక్షిత్ శెట్టి?
మళ్ళీ ప్రేమలో పడలేదు, పెళ్ళీ చేసుకోలేదు... ఇంకా ఒంటరిగా రక్షిత్ శెట్టి?
Embed widget