అన్వేషించండి
Chittoor News: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం... టిప్పర్కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లా విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి(ప్రతీకాత్మక చిత్రం)
1/3

టిప్పర్కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని పాలసముద్రం మండలం కనికాపురంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు.
2/3

కనికాపురంలో ఇల్లు నిర్మించుకుంటున్న ఓ వ్యక్తి.. నిర్మాణ అవసరాల కోసం టిప్పర్లో కంకర రాళ్లు తెప్పించారు. కంకర అన్లోడ్ చేస్తోన్న సమయంలో టిప్పర్ వెనక భాగం విద్యుత్ తీగలను తాకింది. దీంతో డ్రైవర్ గట్టిగా అరిచాడు. డ్రైవర్ని కాపాడేందుకు ప్రయత్నించిన దొరబాబు, జ్యోతిశ్వర్ లకు కరెంట్ షాక్ కొట్టింది. ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
3/3

ఈ ప్రమాదంలో మృతి చెందిన యువకులు దొరబాబు, జ్యోతిశ్వర్
Published at : 09 Aug 2021 12:10 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















