US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
ఈ యుద్ధనౌకను చూశారు కదా..కొద్ది రోజుల క్రితం విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న ఇరాన్ దేశానికి యుద్ధ నౌక ఇది. దీని పేరు ఐరిస్ దేనా. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గౌరవ వందనం సమర్పించి...విశాఖ తీరానికి గుడ్ బై చెప్పి ఇరాన్ కు బయల్దేరిన ఈ నౌకపై అమెరికన్ నేవీ దాడి చేసింది. జలాంతర్గామి నుంచి టోర్పడోలను ప్రయోగించి ఈ యుద్ధ నౌకను శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రంలో పేల్చేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉండగా...వారిలో 32 మందిని మాత్రమే శ్రీలంక నేవీ రక్షించగలిగింది. 87 మృతదేహాలను నీళ్లలో నుంచి వెలికితీసింది. మిగిలిన వారంతా గల్లంతయ్యారు. ఈ దాడిని అమెరికా వార్ సెక్రటరీ పీట్ హేగ్ సేత్ స్వయంగా ధృవీకరించారు. అంతే కాదు రెండో ప్రపంచయుద్ధం తర్వాత సబ్ మెరైన్ ల టోర్పడోలను ఉపయోగించి మరో దేశానికి చెందిన యుద్ధ నౌకను పేల్చేయటం అమెరికాకు ఇదే తొలిసారి.























