అన్వేషించండి

Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన

Sajjanar Expresses Concern Over Huma Relations | తండ్రి అంత్యక్రియలను కుమార్తెలు వీడియో కాల్ ద్వారా చూడటంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నవారిని ఆదరించడం పిల్లల ధర్మమన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వృద్ధాశ్రమంలో వ్యాపారి మరణం సజ్జనార్‌ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
  • కుమార్తెలు కడచూపునకు రాక, అంత్యక్రియలు వీడియో కాల్‌లో చూశారు.
  • ఖర్చులకు ₹5,100 పంపి, తమ బాధ్యత తీరిందనుకోవడం అత్యంత దారుణం.
  • ఆన్‌లైన్ బదిలీలు, స్క్రీన్లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కావు.

హైదరాబాద్: నేటి రోజుల్లో మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో, చనిపోయాక చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నారు. చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్‌లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా? అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రశ్నించారు. ఆయన షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను సైతం కదిలిస్తోంది.
 
 హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ ఓ వృద్ధాశ్రమంలో కన్నుమూసిన ఘటనపై ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు, అంతస్తులు సంపాదించి, పిల్లలను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఆ తండ్రి చివరికి అనాథలా వైకుంఠ ధామానికి చేరడం నేటి సమాజంలో దిగజారుతున్న మానవ సంబంధాలకు, నైతిక విలువలకు సజీవ సాక్ష్యమన్నారు. 

కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపునకు కూడా రాలేకపోయిన కుమార్తెలు, ఆఖరికి అంత్యక్రియలను మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్ ద్వారా చూస్తూ సరిపెట్టుకోవడం అత్యంత దారుణం అన్నారు. తండ్రి చివరి కార్యక్రమాల ఖర్చుల కోసం కేవలం ₹5,100 ఆన్‌లైన్‌లో పంపి తమ బాధ్యత తీరిపోయిందని భావించడం, నేటి సమాజంలో మనుషులు యంత్రాల్లా ఎలా మారిపోతున్నారో తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకని సజ్జనార్ ప్రశ్నించారు. కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివని నిలదీశారు. చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్‌లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాలేవని స్పష్టం చేశారు.

Also Read: Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!

తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మమని హైదరాబాద్ సీపీ పిలుపునిచ్చారు. కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం మానవత్వానికే మచ్చ అని, ఇలాంటి స్వార్థపూరిత సంస్కృతిలో త్వరితగతిన మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.

 

Frequently Asked Questions

చివరి క్షణాల్లో సాంకేతికత కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయమా అని ఎవరు ప్రశ్నించారు?

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ ప్రశ్న వేశారు. డిజిటల్ స్క్రీన్లు, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్‌లు మానవ సంబంధాలకు ప్రత్యామ్నాయం కాలేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సజ్జనార్‌ను కదిలించిన ఘటన ఎక్కడ, ఎవరి గురించి జరిగింది?

హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు వృద్ధాశ్రమంలో ఒంటరిగా కన్నుమూసిన ఘటన గురించి సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుమార్తెలు చివరి చూపునకు రాలేకపోయారు.

వ్యాపారవేత్త కుమార్తెలు తండ్రి అంత్యక్రియలకు ఎలా హాజరయ్యారు?

వారు కడసారి చూపునకు రాలేకపోయారు. అంత్యక్రియలను మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్ ద్వారా చూస్తూ, ₹5,100 ఆన్‌లైన్‌లో పంపి తమ బాధ్యత తీరిందని భావించారు.

తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రాథమిక ధర్మం ఏమిటి?

తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి చివరి ఘడియల్లో తోడుగా నిలబడటమే పిల్లల ప్రాథమిక ధర్మం అని హైదరాబాద్ సీపీ పిలుపునిచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mancherial MLA Prem Sagar Rao: అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget