అన్వేషించండి

Supreme Court: తన భర్త వల్ల పుట్టలేదని కుమారుడి తండ్రి పేరు రికార్డుల్లో మార్చాలని ఓ తల్లి పిటిషన్ - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?

Legal Father: చట్టబద్దమైన పెళ్లి బంధంలో ఉన్నప్పుడు వివాహేతర బంధం ద్వారా పుట్టినా ఆ పిల్లవాడి తండ్రి ఆ మహిళ భర్తే అవుతాడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Presumption is husband is father of child born in valid marriage:  భార్య, భర్తలు చట్టబద్దమైన బంధంలో ఉన్నప్పుడు వారికి  పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు వారే అవుతారు. తల్లి విషయంలో  ఎలాంటి సందేహం ఉండుద. నవమాసాలు మోసి కంటుంది. తండ్రి ఎవరు అనే దానిపై అసలు నిజం ఆమెకే తెలియాలి. చట్టబద్దమైన బంధంలో ఉన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు తండ్రి పేరును నమోదు చేశారు. అక్కడ ఎలాంటి సందేహం రాదు. కానీ కొన్ని కొన్ని అరుదైన కేసుల్లో తన బిడ్డకు తండ్రి తన భర్త కాదని వాదిస్తూ ఉంటారు. అలాంటి కేసు ఒకటి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. 

చట్టబద్ధమైన వివాహబంధంలో పుట్టిన బిడ్డకు తండ్రి భర్తే 

చట్టబద్దమైన వివాహ బంధంలో భార్యభర్తలు ఉన్నప్పుడు  పుట్టిన బిడ్డను ఆ జంట చట్టబద్ధమైన సంతానం అని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.  ఒక మహిళ  తన కుమారుడి నిజమైన తండ్రి ఎవరో తేల్చేందుకు  DNA పరీక్షను కోరుతూ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ న్యాయమూర్తులు సూర్యకాంత్ , ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. 

తన బిడ్డ తన భర్తకు పుట్టలేదని .. తండ్రి పేరు మార్చాలని ఓ మహిళ పిటిషన్

కేరళకు చెందిన ఓ మహిళ 1991లో వివాహం చేసుకుంది. ఆమెకు 2001లో ఒక కుమారుడు జన్మించాడు.  కొచ్చిన్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించే జనన రిజిస్టర్‌లో ఆమె భర్త పేరు బాలుడి "తండ్రి"గా నమోదు చేశారు.  అయితే వారి మధ్య విభేదాల కారణంగా 2003లో ఈ జంట విడివిడిగా జీవించడం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్దికాలానికే వారు విడాకుల కోసం ఉమ్మడి దరఖాస్తును దాఖలు చేశారు. 2006లో కుటుంబ కోర్టు మంజూరు చేసింది. 

విడాకులు మంజురు అయిన తర్వాత ఆమె  మున్సిపల్ కార్పొరేషన్‌ను సంప్రదించి జనన రిజిస్టర్‌లో మరొక వ్యక్తి పేరును "తండ్రి"గా నమోదు చేయమని అధికారులను కోరింది. తన బిడ్డకు అసలైన తండ్రి అతనేనని అతనితో వివాహేతర బంధం ద్వారా బిడ్డను కన్నానని చెప్పింది. అయితే అలా తండ్రి పేరు మార్చడానికి సాధ్యం కాదని..  కోర్టు ఆదేశిస్తేనే అలా చేయగలమని కార్పొరేషన్ తెలిపింది. దాంతో ఆమె కోర్టులను ఆశ్రయించారు.  

డీఎన్‌ఏ టెస్టులకూ అంగీకరించని సుప్రీంకోర్టు 

చివరికి ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అవసరం అయితే తన కుమారుడికి డీఎన్ఏ టెస్టు చేయించి.. తండ్రి ఎవరో తేల్చాలని ఆమె కోరింది. అయితే ఆమె చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, చట్టబద్ధత, పితృత్వం అనేవి వేర్వేరు భావనలు అని తెలిపింది.  భారతీయ సాక్ష్యాల చట్టం, 1872లోని సెక్షన్ 112 ప్రకారం చట్టబద్ధత పితృత్వాన్ని నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో అధికారికంగా తండ్రి పేరు మాజీ భర్త పేరే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చేసింది.              

Also Read: Meerpet Murder Case: భార్యను గురుమూర్తి ఎంత కిరాతకంగా చంపాడో చెప్పిన సీపీ సుధీర్ బాబు - ఇంత ఘోరమా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.