అన్వేషించండి

Janasena On Ysrcp Govt : ఏపీఎస్డీసీని అప్పుల కార్పొరేషన్ గా మార్చేశారు, రూ.6 వేల కోట్లు ఏమైయ్యాయి-నాదెండ్ల మనోహర్

Janasena On Ysrcp Govt : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏపీఎస్డీసీ ను అప్పుల కార్పొరేషన్ గా మార్చేసిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. తెచ్చిన అప్పుల్లో రూ. 6 వేల కోట్లు ఏమైపోయాయని ప్రశ్నించారు.

Janasena On Ysrcp Govt : రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (APSDC)ను రాష్ట్ర అప్పుల కార్పొరేషన్ గా వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఏపీఎస్డీసీ ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని, గొప్పలు చెప్పి అప్పులు తీసుకొచ్చిన రాష్ట్రప్రభుత్వం దొడ్డిదారిన నేతల జేబులు నింపుకొన్నారని తెలిపారు. ఈ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పుల్లో రూ.6 వేల కోట్లు ఏమైపోయాయో లెక్కలు తేలలేదని ఆరోపించారు. ఎవరి అభివృద్ధి కోసం మళ్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన రూ. 23 వేల కోట్ల రుణాల్లో అమ్మఒడి, చేయూత, ఆసరా పథకాలకు రూ. 16,899 కోట్లు ఇవ్వగా మిగిలిన నగదు సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఈ అప్పుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  

రూ.25 వేల కోట్లు రుణాలు 

నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ప్రభుత్వం 2020 ఆగస్టులో ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా ప్రతి పౌరుడికి సేవలు అందిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, పేదలకు గృహాలు కల్పిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ను వ్యతిరేకిస్తే వారిని మభ్య పెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చని జస్టిస్ మిశ్రా దగ్గర నుంచి లేఖను తీసుకొచ్చి ఇచ్చారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మొదటి ఏడాదిలోనే మోసం చేయాలనే ఒక ప్రణాళికతో బ్యాంకుల నుంచి రూ. 25 వేల కోట్లు రుణాలు తీసుకున్నారు. రుణాలు తిరిగి చెల్లించడానికి ఎస్ర్కో అకౌంట్లు ప్రభుత్వం ప్రారంభించింది." అని ఆరోపించారు. 

రాజ్యాంగ విరుద్ధం

రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ రాజ్యాంగ విరుద్ధమని, ఆర్థిక క్రమశిక్షణకు విఘాతమని పార్లమెంట్ లో కేంద్ర మంత్రే ప్రకటన చేశారని నాదెండ్ల మనోహర్ అన్నారు. రుణాలు మంజూరు చేయడంపై బ్యాంకులను హెచ్చరించారని గుర్తుచేశారు. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 7 నుంచి 9 శాతం వడ్డీకి రూ. 23 వేల కోట్లు రుణాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు మళ్లించిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అభివృద్ధి, మౌలిక సదుపాయలకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. కార్పొరేషన్ మొదలుపెట్టినపుడు ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఏంటి? ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడు భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా గ్యారెంటీలుగా చూపించి అప్పులు తెస్తున్నారన్నారు. కేవలం నాలుగు నెలల్లో  రూ.41 వేల కోట్లు అప్పలు తీసుకొచ్చారని ఆరోపించారు. 

మద్యం అమ్మకాలపై ఏడాదికి రూ. 25 వేల కోట్లు 

వైసీపీ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. మూడేళ్లలో ఏడాదికి రూ. 25 వేల కోట్లు చొప్పున మద్యం అమ్మకాలు జరిగాయి. దీనిపై రాష్ట్రానికి ఎక్సైజ్ ఆదాయం కోట్లలో ఉంది. ఈ ఆదాయం ఎక్కడికి పోతోంది? మ్యానిఫెస్టోనే మాకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ అని చెప్పారు. అధికారంలోకి రాగానే మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతామన్నారు. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ మంత్రే మద్యపాన నిషేధం హామీని అసలు మ్యానిఫెస్టోలోనే పెట్టలేదని అంటున్నారు. సీఎం ఎందుకు స్పందించడం లేదు. అప్పులు తెచ్చి ఆసుపత్రులు, స్కూళ్లు కడతామని చెప్పారు. అవి లేవుగానీ కొత్త బార్లు మాత్రం వచ్చాయి. మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవడానికి తాజాగా మరో 840 బార్లకు లైసెన్సులు ఇచ్చారు. ప్రతి జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది 40 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. కొన్ని జిల్లాల్లో 70శాతం వరకూ ఆదాయం పెరిగింది. 

కడప జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర

రైతుల ఆత్మహత్యల వివరాలను గత రెండేళ్లుగా కేంద్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని నాదెండ్ల ఆరోపించారు. కావాలనే రైతుల ఆత్మహత్యలను దాచిపెడుతున్నారన్నారు. కడప జిల్లాలో గత మూడేళ్లలో ఆత్మహత్య  చేసుకున్న కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. తాజాగా తమకు అందిన లెక్కల ప్రకారం కడప జిల్లాలో 167 మంది కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోనే 41 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు.  త్వరలోనే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి ఆర్థిక సాయం చేయడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా నిలబడి భరోసా ఇస్తారన్నారు.  
 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Governor Speech: రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
KTR on Governor Speech: రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Telangana Governor Speech: ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం- గేమ్ ఛేంజర్‌గా మహాలక్ష్మీ పథకం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం- గేమ్ ఛేంజర్‌గా మహాలక్ష్మీ పథకం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Jr NTR : తారక్ చేతికి రిచర్డ్ మిల్లె లిమిటెడ్ ఎడిషన్ వాచ్... ధర ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
తారక్ చేతికి రిచర్డ్ మిల్లె లిమిటెడ్ ఎడిషన్ వాచ్... ధర ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Jio SpaceX Deal: ఎయిర్‌టెల్‌ బాటలోనే జియో - హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ కోసం స్టార్‌లింక్‌తో అగ్రిమెంట్‌, ఏంటి ఈ ఆఫర్‌?
ఎయిర్‌టెల్‌ బాటలోనే జియో - హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ కోసం స్టార్‌లింక్‌తో అగ్రిమెంట్‌, ఏంటి ఈ ఆఫర్‌?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP DesamAdilabad Cement Industry Condition | అమిత్ షా హామీ గాల్లో కలిసిపోయిందా..అందుకే అమ్మేస్తున్నారా.? | ABP DesamJeedimetla Ramalingeswara Temple Issue | రామలింగేశ్వర స్వామి గుడిలో చోరీ..హిందూ సంఘాల ఆందోళన | ABP Desamleviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Governor Speech: రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
KTR on Governor Speech: రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Telangana Governor Speech: ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం- గేమ్ ఛేంజర్‌గా మహాలక్ష్మీ పథకం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం- గేమ్ ఛేంజర్‌గా మహాలక్ష్మీ పథకం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Jr NTR : తారక్ చేతికి రిచర్డ్ మిల్లె లిమిటెడ్ ఎడిషన్ వాచ్... ధర ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
తారక్ చేతికి రిచర్డ్ మిల్లె లిమిటెడ్ ఎడిషన్ వాచ్... ధర ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Jio SpaceX Deal: ఎయిర్‌టెల్‌ బాటలోనే జియో - హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ కోసం స్టార్‌లింక్‌తో అగ్రిమెంట్‌, ఏంటి ఈ ఆఫర్‌?
ఎయిర్‌టెల్‌ బాటలోనే జియో - హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ కోసం స్టార్‌లింక్‌తో అగ్రిమెంట్‌, ఏంటి ఈ ఆఫర్‌?
KCR At Assembly: అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ సభ్యులు ఘన స్వాగతం, అనంతరం పార్టీ నేతలకు దిశానిర్దేశం
అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ సభ్యులు ఘన స్వాగతం, అనంతరం పార్టీ నేతలకు దిశానిర్దేశం
Chittoor Gun Fire: చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Jabardasth Sowmya Rao: అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంటే... తండ్రి మరో మహిళతో - స్టేజిపైనే వెక్కివెక్కి ఏడ్చిన 'జబర్దస్త్' సౌమ్య
అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంటే... తండ్రి మరో మహిళతో - స్టేజిపైనే వెక్కివెక్కి ఏడ్చిన 'జబర్దస్త్' సౌమ్య
Railway Passengers Alert: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మారిన నాలుగు రైళ్లు- అధికారుల ప్రకటన
Railway Passengers Alert: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మారిన నాలుగు రైళ్లు- అధికారుల ప్రకటన
Embed widget