By: ABP Desam | Updated at : 13 Dec 2021 06:13 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తెలంగాణ సీఈవో శశాంక్ గోయల్
తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరగనున్నాయి. కౌంటింగ్ ఏర్పాట్లపై ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ సోమవారం మాట్లాడారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం 5 నియోజకవర్గాలలో ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లు ఎజెంట్ల సమక్షంలో ఓపెన్ చేయనున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ లో 6 టేబుళ్లు, కరీంనగర్ 9 టేబుళ్లు, మిగతా చోట్లా 5 టేబుళ్లు ఏర్పాటుచేశామని వెల్లడించారు. 25 ఓట్ల చొప్పున బండిల్స్ చేస్తారన్నారు. ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లని లెక్కించి, తరువాత నెక్స్ట్ ప్రయారిటీ ఓట్ల ని లెక్కిస్తారని శశాంక్ గోయల్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Also Read: వీరాపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి వీరంగం... వాహనాన్ని కిలోమీటర్ దూరం వెంబడించిన పులి
ర్యాలీలకు అనుమతి లేదు
'కౌంటింగ్ కేంద్రంలోకి వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండవద్దు. ఫలితాలు వచ్చాక ఇద్దరు వచ్చి సర్టిఫికెట్ తీసుకోవాలి. ర్యాలీలకు అనుమతి లేదు. మొబైల్ ఫోన్, కెమెరాలు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదు. నల్గొండ, మెదక్ లో కౌంటింగ్ రౌండ్స్ ఎక్కువ ఉన్నాయి' అని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు.
Also Read: డ్యూటీలో చేరేందుకు బయల్దేరిన సిద్దిపేట జవాను.. ఆచూకీ గల్లంతు, అందరిలో ఆందోళన
ఆరు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు
తెలంగాణలో ఆరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరిగింది. ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం, కరీంనగర్ లో రెండు స్థానాలకు మొత్తం 26 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీపడ్డారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం 5,326 మంది ఓటర్లు 37 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 99.69 శాతం, 1,324 ఓట్లకు 1,320 ఓట్లు నమోదయ్యాయి. రేపు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Also Read: జవాను సాయితేజ మరణంపై వీహెచ్ సంచలన కామెంట్స్.. సీఎంలు కేసీఆర్, జగన్పైన కూడా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
వెయ్యి కిలోమీటర్లు దాటిన "ప్రజాసంగ్రామ యాత్ర"
KTR : ఆసియా లీడర్స్ మీట్కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !
Breaking News Live Telugu Updates: కాంగ్రెస్కు మరో షాక్! రేవంత్ పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
30వేల మంది విద్యార్థులతో మెగా ఈవెంట్- మల్లారెడ్డి యూనివర్సిటీ రికార్డు ప్రోగ్రామ్!
TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ ఫైర్ !
Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !
YSRCP Vs Janasena : వైఎస్ఆర్సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !
Common Charging Port: మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!