అన్వేషించండి

Congress: జవాను సాయితేజ మరణంపై వీహెచ్ సంచలన కామెంట్స్.. సీఎంలు కేసీఆర్, జగన్‌‌పైన కూడా..

అమర జవాన్ సాయి తేజకు నివాళులు అర్పించడానికి ఏపీ మంత్రులు హాజరుకాకపోవడం పట్ల తాను బాధపడుతున్నానని  వి. హనుమంతరావు అన్నారు.

తమిళనాడులో కొద్ది రోజుల క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తెలుగు జవానుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు స్పందించారు. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు జవాను మరణంపై రాజకీయ నేతలు, మంత్రుల స్పందన అంతంత మాత్రంగానే ఉందని వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, అమరజవాను సాయి తేజకు నివాళులు అర్పించిన తీరుపై కూడా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అమర జవాన్ సాయి తేజకు నివాళులు అర్పించడానికి ఏపీ మంత్రులు హాజరుకాకపోవడం పట్ల తాను బాధపడుతున్నానని  వి. హనుమంతరావు అన్నారు. 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అయ్యప్ప మాలలో ఉంటే.. ఇతర మంత్రులు వెళ్లవచ్చు కదా అని ప్రశ్నించారు. అసలు ఏపీ సీఎం జగన్ ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ వీహెచ్ నిలదీశారు. సీఎం కేసీఆర్ వివిధ సందర్భాల్లో పీవీ సింధు, సానియా మీర్జాకు కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మరి ఈ అమర జవాన్ కుటుంబానికి ఇవ్వరా అని ప్రశ్నించారు. అసలు సాయి తేజ సాటి తెలుగు వాడని కూడా కేసీఆర్ గౌరవించరా అని వీహెచ్ నిలదీశారు. 

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తూ చనిపోయిన 700 మంది రైతులకు కేసీఆర్ పరిహారం ఇస్తానన్నారని.. ఇలాంటి దేశ భక్తులకు ఇవ్వరా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇంటికి వస్తే కౌగలించుకునే కేసీఆర్.. సైనికుడి విషయంలో అనుసరించే విధానం ఇదేనా అంటూ ధ్వజమెత్తారు. సాయి తేజ కుటుంబం నుంచి దేశం కోసం ఇద్దరు కొడుకులను పంపించారని గుర్తు చేశారు. మరి ఇలాంటి విషయంలో జవాన్లను ప్రభుత్వం గౌరవిస్తేనే దేశ యువతకు మంచి సందేశం అందుతుందని తెలిపారు. కాబట్టి, మనం, మన ప్రభుత్వాలు అమర సైనికులను గౌరవించుకోవాలని వి. హనుమంతరావు పిలుపు ఇచ్చారు. 

తమిళనాడులో నీలగిరి పర్వతాల్లో డిసెంబరు 8న జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దంపతులతో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు 13 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో లాన్స్ నాయక్ గ్రేడ్‌కు చెందిన, చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాను కూడా ఉన్నారు. సాయి తేజ అంత్యక్రియలు ఆదివారం (డిసెంబరు 12) జరిగిన సంగతి తెలిసిందే.

Also Read: డ్యూటీలో చేరేందుకు బయల్దేరిన సిద్దిపేట జవాను.. ఆచూకీ గల్లంతు, అందరిలో ఆందోళన

Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..

Also Read: Dharmapuri Arvind: బీజేపీ అధిష్ఠానం దృష్టి పడింది.. కొద్ది రోజుల్లో TSలో మరిన్ని సంచలనాలు: ధర్మపురి అర్వింద్

Also Read:  ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలవరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
ఐ ఫోన్ కోసం డెలవరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలవరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
ఐ ఫోన్ కోసం డెలవరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
Kothagudem News: సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
Embed widget