News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Coromandel Train Accident: రైలు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అంటూ వ్యాఖ్యానించారు. 

FOLLOW US: 
Share:

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనలో 261 మంది మృతి చెందడంపై సంతాపం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఘోర ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోవడం, తీవ్ర గాయాల పాలు కావడం తనను కలిచి వేస్తోందంటూ చెప్పుకొచ్చారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోని వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని సూచించారు. 


రైలు ఢీకొని 261 మంది ప్రయాణికులు మృతి చెందగా.. వందాలది గాయపడిన ఘటనపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన ప్రయాణీకుల కుటుంబాలకు, క్షతగాత్రుల కుటుంబాలకు తన హృదయ పూర్వక సానుభూతి తెలిపారు. వారికి ఆ దేవుడు ఎంతో ధైర్యాన్ని కల్పించాలని కోరుతున్నట్లు ప్రకటించారు. యాంటీ కొలిజన్ పరికరాలకు ఏమైందని, ఇది నిజంగా ఎప్పుడూ జరగకూడని విషాదం అంటూ ట్విట్టర్ వేధికగా రాసుకొచ్చారు. 

మరోవైపు 50 మంది వరకు తెలుగు ప్రజలు చనిపోయినట్టు అనుమానం

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ లో శుక్రవారం రోజు ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ఈ రైలు ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వివరించారు. అలాగే రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Published at : 03 Jun 2023 02:56 PM (IST) Tags: Odisha Train Accident Coromandel Express Accident Odisha Train Accident News Balasore Train Accident KCR Condolence on Train Accident

ఇవి కూడా చూడండి

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

Bathukamma Sarees: ప్రతి ఊర్లో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి, కలెక్టర్లకు సీఎస్ ఆదేశం

Bathukamma Sarees: ప్రతి ఊర్లో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి, కలెక్టర్లకు సీఎస్ ఆదేశం

SA Exams: సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షల సమయాల్లో మార్పులు, మారిన షెడ్యూలు ఇలా

SA Exams: సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షల సమయాల్లో మార్పులు, మారిన షెడ్యూలు ఇలా

Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

టాప్ స్టోరీస్

షారుఖ్ Vs ప్రభాస్ - సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!

షారుఖ్ Vs ప్రభాస్ - సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!

Medico Preethi: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడికి ఊరట- సైఫ్‌ సస్పెన్సన్‌ తాత్కాలికంగా రద్దు

Medico Preethi: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడికి ఊరట- సైఫ్‌ సస్పెన్సన్‌ తాత్కాలికంగా రద్దు

హిజాబ్‌ రూల్ పాటించలేదని యువతిపై ఇరాన్ పోలీసుల దాడి! కోమాలో బాధితురాలు

హిజాబ్‌ రూల్ పాటించలేదని యువతిపై ఇరాన్ పోలీసుల దాడి! కోమాలో బాధితురాలు

Thalaivar 170: రజనీకాంత్ కొత్త మూవీ షూటింగ్ షురూ, ఫుల్ జోష్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్

Thalaivar 170: రజనీకాంత్ కొత్త మూవీ షూటింగ్ షురూ, ఫుల్ జోష్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్